రంగారెడ్డి జిల్లా చేవెళ్ల లోక్సభ ఓట్ల లెక్కింపునకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. శంషాబాద్ మండలం పాలమాకులలోని బీసీ వసతి గృహంలో లెక్కింపు కేంద్రాన్ని సిద్ధం చేశారు. మూడంచెల భారీ పోలీసు బందోబస్తు మధ్య ఓట్ల లెక్కింపు ప్రక్రియ నిర్వహించేందుకు జిల్లా ఎన్నికల అధికారి లోకేశ్కుమార్ సర్వం సిద్ధం చేశారు. 7 అసెంబ్లీ సెగ్మెంట్లలోని ఓట్లను రేపు ఉదయం 8 గంటల నుంచి లెక్కించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు. 43 రౌండ్ల తర్వాత చేవెళ్ల తుది ఫలితం వెల్లడికానుంది. లెక్కింపు కేంద్రాలకు రావడానికి అభ్యర్థులు, ఏజెంట్ల కోసం పాలమాకులలో ప్రత్యేక వాహన సదుపాయాన్ని సమకూర్చారు.
ఇవీ చూడండి: సార్వత్రిక ఎన్నికల లెక్కిపునకు భాగ్యనగరం సిద్ధం