ETV Bharat / briefs

లక్ష్మణ్​కు సంఘీభావంగా బీజేవైఎం రాస్తారోకో

ఇంటర్​ విద్యార్థులకు న్యాయం జరిగేలా భాజపా శ్రేణులు ఆందోళనలు చేపడుతున్నాయి. హైదరాబాద్​ ఆర్టీసీ క్రాస్​ రోడ్​లో బీజేవైఎం రాస్తారోకో నిర్వహించింది. పార్టీ అధ్యక్షుడు లక్ష్మణ్​ దీక్షకు సంఘీభావం తెలిపింది.

author img

By

Published : May 2, 2019, 12:53 PM IST

లక్ష్మణ్​కు సంఘీభావంగా బీజేవైఎం రాస్తారోకో
లక్ష్మణ్​కు సంఘీభావంగా బీజేవైఎం రాస్తారోకో

ఇంటర్ బోర్డు అవకతవకలపై ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ హైదరాబాద్​ బీజేవైఎం ఆందోళన చేపట్టింది. భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ చేపట్టిన నిరవధిక నిరాహార దీక్షకు సంఘీభావంగా ఆర్టీసీ క్రాస్ రోడ్​లో రాస్తారోకో నిర్వహించారు. బస్సులకు అడ్డంగా నిలబడి నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఇంటర్ విద్యార్థులకు న్యాయం చేసేవరకు దశల వారీగా తమ పోరాటం కొనసాగిస్తామని బీజేవైఎం గ్రేటర్ అధ్యక్షుడు నవీన్ స్పష్టం చేశారు. నాయకులు చేపట్టిన రాస్తారోకోతో ట్రాఫిక్​కు తీవ్ర అంతరాయం ఏర్పడింది.

ఇవీ చూడండి: చారిత్రక చార్మినార్​కు ఊడిన పెచ్చులు

లక్ష్మణ్​కు సంఘీభావంగా బీజేవైఎం రాస్తారోకో

ఇంటర్ బోర్డు అవకతవకలపై ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ హైదరాబాద్​ బీజేవైఎం ఆందోళన చేపట్టింది. భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ చేపట్టిన నిరవధిక నిరాహార దీక్షకు సంఘీభావంగా ఆర్టీసీ క్రాస్ రోడ్​లో రాస్తారోకో నిర్వహించారు. బస్సులకు అడ్డంగా నిలబడి నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఇంటర్ విద్యార్థులకు న్యాయం చేసేవరకు దశల వారీగా తమ పోరాటం కొనసాగిస్తామని బీజేవైఎం గ్రేటర్ అధ్యక్షుడు నవీన్ స్పష్టం చేశారు. నాయకులు చేపట్టిన రాస్తారోకోతో ట్రాఫిక్​కు తీవ్ర అంతరాయం ఏర్పడింది.

ఇవీ చూడండి: చారిత్రక చార్మినార్​కు ఊడిన పెచ్చులు

Intro:ఇంటర్ విద్యార్థుల కు న్యాయం జరిగే వరకు బీజేవైఎం పోరాటం కొనసాగిస్తుందని నాయకుడు స్పష్టం చేశారు


Body:ఇంటర్ అవకతవకలపై ప్రభుత్వం అనుసరిస్తున్న నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ నగర బీజేవైఎం ఆందోళన చేపట్టింది.... ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్యలకు నిరసనగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్ చేపట్టిన నిరవధిక నిరాహార దీక్షకు సంఘీభావంగా చిన్న పిలుపులో భాగంగా బీజేవైఎం గ్రేటర్ నాయకులు కార్యకర్తలు హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్లో రాస్తారోకో నిర్వహించారు..... ఆర్టీసీ బస్సులకు అడ్డంగా నిలబడి నిరసన వ్యక్తం చేశారు...... ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిని ఎండగడుతూ నినాదాలు చేశారు.... ఇంటర్ విద్యార్థులకు ప్రభుత్వం న్యాయం చేసేవరకు దశల వారీగా తమ పోరాటం కొనసాగిస్తామని బీజేవైఎం గ్రేటర్ అధ్యక్షుడు నవీన్ స్పష్టం చేశారు ఇప్పటికైనా ప్రభుత్వం కళ్లు తెరవాలని ఆయన హితవు పలికారు...... అలాగే చిక్కడపల్లిలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బరత్ గౌడ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు


Conclusion:ఆర్టీసీ క్రాస్ రోడ్లో విజయనగరం నాయకులు చేపట్టిన రాస్తారోకోతో ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం ఏర్పడింది
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.