ETV Bharat / briefs

ఈశాన్య రాష్ట్రాల కంటే భాగ్యనగరంలోనే అధికం..

గతంలో ఎన్నడూ లేని విధంగా హైదరాబాద్​లో విద్యుత్తు వినియోగం 3,276 మెగావాట్లకు చేరుకుంది. గత ఏడాది 2,950 మెగావాట్లుగా ఉన్న వినియోగం... ఈ ఏడాది డిమాండ్​లో పది శాతం వృద్ధి సాధించింది. ఈశాన్య రాష్ట్రాల కంటే భాగ్యనగరంలోనే విద్యుత్ వాడకం అధికంగా ఉంది.

author img

By

Published : May 23, 2019, 5:17 AM IST

ట్రాన్స్ కో సీఎండీ

ఏడు ఈశాన్య రాష్ట్రాలతో పోల్చితే హైదరాబాద్ నగరంలో విద్యుత్తు వాడకం ఎక్కువగా ఉందని ట్రాన్స్ కో సీఎండీ దేవులపల్లి ప్రభాకర్ రావు అన్నారు. వివిధ రాష్ట్రాల్లో వినియోగిస్తున్న విద్యుత్ హైదరాబాద్​తో పోల్చితే చాలా తక్కువగా ఉందన్నారు. డిమాండ్​కు తగినట్లు కరెంట్ సరఫరా చేయడానికి అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. ఇప్పటికే నగరం చుట్టూ 400 కేవీ రింగు ఏర్పాటు చేశామని... నాలుగు 400 కేవీ సబ్​స్టేషన్లు నిర్మించామన్నారు.

వివిధ రాష్ట్రాల్లో..

హిమాచల్ ప్రదేశ్​లో 1,387 మెగావాట్లు, జమ్మూకశ్మీర్​లో 2,826, ఉత్తరాఖండ్​లో 1,922, గోవాలో 594, సిక్కింలో 100, ఝార్ఖండ్​లో 1,266, అస్సాంలో 1,712 మెగావాట్ల విద్యుత్తు వినియోగం జరుగుతోంది. హైదరాబాద్ నగరంలో పెరుగుతున్న పారిశ్రామికీకరణ, ఐటీ పరిశ్రమ వృద్ధి, వాణిజ్య కనెక్షన్లు పెరగడం, తదితర అవసరాల కోసం కరెంట్ వినియోగం చాలా వరకు పెరిగింది. తెలంగాణ ఏర్పడినప్పుడు నగరంలో 37.8 లక్షల ఎల్​టీ విద్యుత్తు కనెక్షన్లు ఉంటే ఇప్పుడు అవి 47.8 లక్షల ఎల్​టీ కనెక్షన్లకు చేరుకుని 27 శాతం వృద్ధి సాధించింది.

ట్రాన్స్ కో సీఎండీ దేవులపల్లి ప్రభాకర్ రావు

ఇవీ చూడండి: ఈవీఎంలపై కాంగ్రెస్​-భాజపా మాటల యుద్ధం

ఏడు ఈశాన్య రాష్ట్రాలతో పోల్చితే హైదరాబాద్ నగరంలో విద్యుత్తు వాడకం ఎక్కువగా ఉందని ట్రాన్స్ కో సీఎండీ దేవులపల్లి ప్రభాకర్ రావు అన్నారు. వివిధ రాష్ట్రాల్లో వినియోగిస్తున్న విద్యుత్ హైదరాబాద్​తో పోల్చితే చాలా తక్కువగా ఉందన్నారు. డిమాండ్​కు తగినట్లు కరెంట్ సరఫరా చేయడానికి అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. ఇప్పటికే నగరం చుట్టూ 400 కేవీ రింగు ఏర్పాటు చేశామని... నాలుగు 400 కేవీ సబ్​స్టేషన్లు నిర్మించామన్నారు.

వివిధ రాష్ట్రాల్లో..

హిమాచల్ ప్రదేశ్​లో 1,387 మెగావాట్లు, జమ్మూకశ్మీర్​లో 2,826, ఉత్తరాఖండ్​లో 1,922, గోవాలో 594, సిక్కింలో 100, ఝార్ఖండ్​లో 1,266, అస్సాంలో 1,712 మెగావాట్ల విద్యుత్తు వినియోగం జరుగుతోంది. హైదరాబాద్ నగరంలో పెరుగుతున్న పారిశ్రామికీకరణ, ఐటీ పరిశ్రమ వృద్ధి, వాణిజ్య కనెక్షన్లు పెరగడం, తదితర అవసరాల కోసం కరెంట్ వినియోగం చాలా వరకు పెరిగింది. తెలంగాణ ఏర్పడినప్పుడు నగరంలో 37.8 లక్షల ఎల్​టీ విద్యుత్తు కనెక్షన్లు ఉంటే ఇప్పుడు అవి 47.8 లక్షల ఎల్​టీ కనెక్షన్లకు చేరుకుని 27 శాతం వృద్ధి సాధించింది.

ట్రాన్స్ కో సీఎండీ దేవులపల్లి ప్రభాకర్ రావు

ఇవీ చూడండి: ఈవీఎంలపై కాంగ్రెస్​-భాజపా మాటల యుద్ధం

Intro:Body:Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.