ETV Bharat / bharat

'వివాహ వయసు బిల్లు'ను సమీక్షించే కమిటీలో ఒక్కరే మహిళ

author img

By

Published : Jan 2, 2022, 7:32 PM IST

Women marriage age in India: మహిళల వివాహ వయసును పెంచుతూ రూపొందిన బిల్లును సమీక్షించనున్న పార్లమెంటరీ స్థాయీ సంఘంలో ఒక్కరే మహిళా ఎంపీ ఉన్నారు. ఈ కమిటీలోని 31 మంది సభ్యుల్లో.. టీఎంసీకి చెందిన సుష్మితా దేవ్ మినహా మిగిలిన వారందరూ పురుషులే. ప్యానెల్​లో మరికొందరు మహిళా ఎంపీలు ఉండాల్సిందని సుష్మితా సహా పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

woman marriage age Parliament panel
woman marriage age Parliament panel

Women marriage age in India: మహిళల వివాహ వయసును 18 నుంచి 21 పెంచాలని కేంద్ర ప్రభుత్వం రూపొందించిన బిల్లును సమీక్షించనున్న పార్లమెంటరీ ప్యానెల్​లో ఒకేఒక్క మహిళా ఎంపీ ఉన్నారు. మహిళా ప్రాధాన్యం ఉన్న ఈ బిల్లుపై సమీక్షించే ప్యానెల్​లో 31 మంది సభ్యులు ఉండగా.. వీరిలో 30 మంది పురుషులే కావటంటం గమనార్హం.

woman marriage age Parliament panel

రాజ్యసభ వెబ్​సైట్​లో ఉన్న వివరాల ప్రకారం భాజపా సీనియర్ నేత వినయ్ సహస్రబుద్ధె... ఈ పార్లమెంట్ స్థాయీసంఘానికి అధ్యక్షత వహిస్తున్నారు. టీఎంసీకి చెందిన సుష్మితా దేవ్ ప్యానెల్​లో ఏకైక మహిళా ఎంపీగా ఉన్నారు.

ప్యానెల్​లో మరికొంతమంది మహిళా ఎంపీలు ఉంటే బాగుండేదని సుష్మితా దేవ్ అభిప్రాయపడ్డారు. అయితే, అన్ని వర్గాల ప్రజల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకొనే బిల్లుపై నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు.

Woman members in Parliament panel

ఎన్​సీపీ ఎంపీ, శరద్ పవార్ కుమార్తె సుప్రియా సూలే సైతం ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు. మహిళల సమస్యలను తరచుగా పార్లమెంట్​లో ప్రస్తావించే సూలే.. ప్యానెల్​లో మహిళా ఎంపీలు ఉంటే బాగుండేదన్నారు. తద్వారా సంబంధిత ఈ సమస్యపై విస్తృత చర్చ జరిగేదని పేర్కొన్నారు. అవసరమైతే, ప్యానెల్​కు నిపుణులను ఆహ్వానించే అధికారం ఛైర్మన్​కు ఉందని, దానికనుగుణంగా పలువురు మహిళా ఎంపీలను పిలవాలని సూచించారు.

Jaya Jaitly committee report

జయా జైట్లీ కమిటీ సిఫార్సుల ఆధారంగా మహిళల వివాహ వయసును పెంచుతూ బిల్లు రూపొందించింది కేంద్రం. ఈ కమిటీ అధ్యక్షులు జయా జైట్లీ సైతం.. స్థాయీ సంఘంలో మహిళా ఎంపీలు లేకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. కనీసం 50 శాతం మంది సభ్యులు మహిళలై ఉండాల్సిందని ఆకాంక్షించారు. 'నిబంధనలు అనుమతిస్తే.. ప్రస్తుతం ఉన్న ఎంపీల స్థానంలో మహిళా ఎంపీలను పార్లమెంటరీ ప్యానెల్​కు పంపించేలా రాజకీయ పార్టీలు నిర్ణయం తీసుకోవాలి. లేదంటే తమ ఎంపీలు... మహిళా ఎంపీలను సంప్రదించి నిర్ణయాలు తీసుకునేలా ఆదేశించాలి' అని సూచించారు.

Woman marriage age bill

బాల్య వివాహాల నిరోధక (సవరణ) బిల్లును శీతాకాల సమావేశాల్లో భాగంగా లోక్​సభలో ప్రవేశపెట్టింది. ఈ బిల్లు ఆమోదం పొందితే మహిళల వివాహ వయసు 18 నుంచి 21కి పెరుగుతుంది. ఈ బిల్లును.. విద్య, మహిళలు, చిన్నారులు, యువజన, క్రీడా అంశాలపై ఏర్పాటైన పార్లమెంటరీ స్థాయీ సంఘానికి సిఫార్సు చేసింది.

పార్లమెంట్​లో శాఖా సంబంధిత స్థాయీ సంఘాలు శాశ్వతంగా ఉంటాయి. జాయింట్, సెలెక్ట్ కమిటీలను సమయానుగుణంగా ఏర్పాటు చేస్తారు. వివాహ వయసు బిల్లును సమీక్షిస్తున్న ఈ స్థాయీ సంఘం రాజ్యసభ పరిధిలో ఉంటుంది. సభలో సంఖ్యాబలం ఆధారంగా పార్టీలు.. తమ ఎంపీలను ప్యానెల్​కు నామినేట్ చేస్తాయి.

ఇదీ చదవండి: అమ్మాయి పెళ్లి వయసు పెంచడం మంచిదేనా?

Women marriage age in India: మహిళల వివాహ వయసును 18 నుంచి 21 పెంచాలని కేంద్ర ప్రభుత్వం రూపొందించిన బిల్లును సమీక్షించనున్న పార్లమెంటరీ ప్యానెల్​లో ఒకేఒక్క మహిళా ఎంపీ ఉన్నారు. మహిళా ప్రాధాన్యం ఉన్న ఈ బిల్లుపై సమీక్షించే ప్యానెల్​లో 31 మంది సభ్యులు ఉండగా.. వీరిలో 30 మంది పురుషులే కావటంటం గమనార్హం.

woman marriage age Parliament panel

రాజ్యసభ వెబ్​సైట్​లో ఉన్న వివరాల ప్రకారం భాజపా సీనియర్ నేత వినయ్ సహస్రబుద్ధె... ఈ పార్లమెంట్ స్థాయీసంఘానికి అధ్యక్షత వహిస్తున్నారు. టీఎంసీకి చెందిన సుష్మితా దేవ్ ప్యానెల్​లో ఏకైక మహిళా ఎంపీగా ఉన్నారు.

ప్యానెల్​లో మరికొంతమంది మహిళా ఎంపీలు ఉంటే బాగుండేదని సుష్మితా దేవ్ అభిప్రాయపడ్డారు. అయితే, అన్ని వర్గాల ప్రజల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకొనే బిల్లుపై నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు.

Woman members in Parliament panel

ఎన్​సీపీ ఎంపీ, శరద్ పవార్ కుమార్తె సుప్రియా సూలే సైతం ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు. మహిళల సమస్యలను తరచుగా పార్లమెంట్​లో ప్రస్తావించే సూలే.. ప్యానెల్​లో మహిళా ఎంపీలు ఉంటే బాగుండేదన్నారు. తద్వారా సంబంధిత ఈ సమస్యపై విస్తృత చర్చ జరిగేదని పేర్కొన్నారు. అవసరమైతే, ప్యానెల్​కు నిపుణులను ఆహ్వానించే అధికారం ఛైర్మన్​కు ఉందని, దానికనుగుణంగా పలువురు మహిళా ఎంపీలను పిలవాలని సూచించారు.

Jaya Jaitly committee report

జయా జైట్లీ కమిటీ సిఫార్సుల ఆధారంగా మహిళల వివాహ వయసును పెంచుతూ బిల్లు రూపొందించింది కేంద్రం. ఈ కమిటీ అధ్యక్షులు జయా జైట్లీ సైతం.. స్థాయీ సంఘంలో మహిళా ఎంపీలు లేకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. కనీసం 50 శాతం మంది సభ్యులు మహిళలై ఉండాల్సిందని ఆకాంక్షించారు. 'నిబంధనలు అనుమతిస్తే.. ప్రస్తుతం ఉన్న ఎంపీల స్థానంలో మహిళా ఎంపీలను పార్లమెంటరీ ప్యానెల్​కు పంపించేలా రాజకీయ పార్టీలు నిర్ణయం తీసుకోవాలి. లేదంటే తమ ఎంపీలు... మహిళా ఎంపీలను సంప్రదించి నిర్ణయాలు తీసుకునేలా ఆదేశించాలి' అని సూచించారు.

Woman marriage age bill

బాల్య వివాహాల నిరోధక (సవరణ) బిల్లును శీతాకాల సమావేశాల్లో భాగంగా లోక్​సభలో ప్రవేశపెట్టింది. ఈ బిల్లు ఆమోదం పొందితే మహిళల వివాహ వయసు 18 నుంచి 21కి పెరుగుతుంది. ఈ బిల్లును.. విద్య, మహిళలు, చిన్నారులు, యువజన, క్రీడా అంశాలపై ఏర్పాటైన పార్లమెంటరీ స్థాయీ సంఘానికి సిఫార్సు చేసింది.

పార్లమెంట్​లో శాఖా సంబంధిత స్థాయీ సంఘాలు శాశ్వతంగా ఉంటాయి. జాయింట్, సెలెక్ట్ కమిటీలను సమయానుగుణంగా ఏర్పాటు చేస్తారు. వివాహ వయసు బిల్లును సమీక్షిస్తున్న ఈ స్థాయీ సంఘం రాజ్యసభ పరిధిలో ఉంటుంది. సభలో సంఖ్యాబలం ఆధారంగా పార్టీలు.. తమ ఎంపీలను ప్యానెల్​కు నామినేట్ చేస్తాయి.

ఇదీ చదవండి: అమ్మాయి పెళ్లి వయసు పెంచడం మంచిదేనా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.