ETV Bharat / bharat

సరిహద్దుల్లో నారీశక్తి.. దేశం కోసం ప్రాణాలు పణంగా పెట్టి గస్తీ

author img

By

Published : Mar 8, 2022, 11:29 AM IST

Updated : Mar 8, 2022, 12:15 PM IST

Women in Indian Army: పురుషులకు దీటుగా సైన్యంలో మహిళలు సేవలు అందిస్తున్నారు. సరిహద్దుల్లో కూడా మహిళా జవాన్లు ప్రాణాలు పణంగా పెట్టి దేశ రక్షణ కోసం పాటుపడుతున్నారు. మహిళా దినోత్సవం సందర్భంగా భారత్​-చైనా సరిహద్దుల్లో మహిళా జవాన్లు గస్తీ కాస్తున్న వీడియోను ఐటీబీపీ విడుదల చేసింది.

Women in Indian Army
అరుణాచల్​ ప్రదేశ్​లో మహిళా బలగాల గస్తీ
సరిహద్దుల్లో ఐటీబీపీ మహిళా జవాన్లు

Women in Indian Army: భారత భద్రతా బలగాల్లో మహిళలు కీలక పాత్ర పోషిస్తున్నారు. పురుషులకు దీటుగా సేవలు అందిస్తున్న మహిళా జవాన్లు.. ప్రాణాలను పణంగా పెట్టి సరిహద్దుల్లో గస్తీ కాస్తూ దేశ భద్రతకు ముప్పు కలగకుండా చూసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా అరుణాచల్​ ప్రదేశ్​లోని భారత్​ చైనా సరిహద్దు వద్ద మహిళా బలగాలు గస్తీ కాస్తున్న వీడియోను ఐటీబీపీ సోషల్​ మీడియాలో షేర్​ చేసింది. ఇండో-టిబెటన్​ బార్డర్​ పోలిస్​కు (ఐటీబీపీ) చెందిన వీరు తుపాకులు చేతపట్టి ఆ ప్రాంతాన్ని పర్యవేక్షిస్తూ స్థానికులకు రక్షణ కల్పిస్తున్నారు.

Women in Indian Army
ఇండో టిబెటన్​ బార్డర్​ పోలీస్​కు చెందిన మహిళా జవాన్లు
Women in Indian Army
అరుణాచల్​ ప్రదేశ్​లోని భారత్​ చైనా సరిహద్దు వద్ద మహిళా బలగాల గస్తీ

'నారీశక్తికి నా సెల్యూట్​' ​

మహిళా దినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ట్విట్టర్​ ద్వారా మహిళలకు అభినందనలు తెలిపారు. 'వివిధ రంగాల్లో విజయాలు సాధిస్తున్న మహిళా శక్తికి నా వందనాలు' అని పేర్కొన్నారు. వివిధ పధకాల ద్వారా మహిళా సాధికారికత కోసం ప్రభుత్వం తన కృషిని కొనసాగిస్తూనే ఉంటుందని తెలిపారు.

"ఆర్థిక సాయం, సామాజిక భద్రత, ఆరోగ్య సేవలు, విద్య, వ్యాపారం ఇలా వివిధ రంగాల్లో నారీశక్తిని ఉన్నత స్థానంలో నిలబెట్టేందుకు కేంద్రం కృషి చేస్తోంది. భవిష్యత్తులో ఈ కృషిని మరింత ఉన్నతస్థాయికి తీసుకెళ్తాం."

-నరేంద్ర మోదీ, ప్రధాని

ఆ సత్తా మహిళలకు ఉంది..

సమాజాన్ని మార్చగలిగే సత్తా మహిళలకు ఉందన్నారు కాంగ్రెస్​ అగ్రనేత రాహుల్ గాంధీ. మహిళా దినోత్సవం సందర్భంగా ఆయన అభినందనలు తెలిపారు.

"మీ ఆలోచనలు, ధైర్యం, సత్తా, దయాగుణంతో సమాజ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్న అక్కాచెల్లెళ్లకు నా వందనాలు. ఈ మహిళ దినోత్సవంతో పాటు ప్రతిరోజు మీకు మరింత శక్తి కలగాలని ఆశిస్తున్నాను. మహిళలు అధికారం చేపడితే.. అవినీతి, వివక్ష, అణచివేతకు అవకాశం ఉండదు."

-రాహుల్​ గాంధీ, కాంగ్రెస్​ అగ్రనేత

ఇవీ చూడండి :

సరిహద్దుల్లో ఐటీబీపీ మహిళా జవాన్లు

Women in Indian Army: భారత భద్రతా బలగాల్లో మహిళలు కీలక పాత్ర పోషిస్తున్నారు. పురుషులకు దీటుగా సేవలు అందిస్తున్న మహిళా జవాన్లు.. ప్రాణాలను పణంగా పెట్టి సరిహద్దుల్లో గస్తీ కాస్తూ దేశ భద్రతకు ముప్పు కలగకుండా చూసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా అరుణాచల్​ ప్రదేశ్​లోని భారత్​ చైనా సరిహద్దు వద్ద మహిళా బలగాలు గస్తీ కాస్తున్న వీడియోను ఐటీబీపీ సోషల్​ మీడియాలో షేర్​ చేసింది. ఇండో-టిబెటన్​ బార్డర్​ పోలిస్​కు (ఐటీబీపీ) చెందిన వీరు తుపాకులు చేతపట్టి ఆ ప్రాంతాన్ని పర్యవేక్షిస్తూ స్థానికులకు రక్షణ కల్పిస్తున్నారు.

Women in Indian Army
ఇండో టిబెటన్​ బార్డర్​ పోలీస్​కు చెందిన మహిళా జవాన్లు
Women in Indian Army
అరుణాచల్​ ప్రదేశ్​లోని భారత్​ చైనా సరిహద్దు వద్ద మహిళా బలగాల గస్తీ

'నారీశక్తికి నా సెల్యూట్​' ​

మహిళా దినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ట్విట్టర్​ ద్వారా మహిళలకు అభినందనలు తెలిపారు. 'వివిధ రంగాల్లో విజయాలు సాధిస్తున్న మహిళా శక్తికి నా వందనాలు' అని పేర్కొన్నారు. వివిధ పధకాల ద్వారా మహిళా సాధికారికత కోసం ప్రభుత్వం తన కృషిని కొనసాగిస్తూనే ఉంటుందని తెలిపారు.

"ఆర్థిక సాయం, సామాజిక భద్రత, ఆరోగ్య సేవలు, విద్య, వ్యాపారం ఇలా వివిధ రంగాల్లో నారీశక్తిని ఉన్నత స్థానంలో నిలబెట్టేందుకు కేంద్రం కృషి చేస్తోంది. భవిష్యత్తులో ఈ కృషిని మరింత ఉన్నతస్థాయికి తీసుకెళ్తాం."

-నరేంద్ర మోదీ, ప్రధాని

ఆ సత్తా మహిళలకు ఉంది..

సమాజాన్ని మార్చగలిగే సత్తా మహిళలకు ఉందన్నారు కాంగ్రెస్​ అగ్రనేత రాహుల్ గాంధీ. మహిళా దినోత్సవం సందర్భంగా ఆయన అభినందనలు తెలిపారు.

"మీ ఆలోచనలు, ధైర్యం, సత్తా, దయాగుణంతో సమాజ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్న అక్కాచెల్లెళ్లకు నా వందనాలు. ఈ మహిళ దినోత్సవంతో పాటు ప్రతిరోజు మీకు మరింత శక్తి కలగాలని ఆశిస్తున్నాను. మహిళలు అధికారం చేపడితే.. అవినీతి, వివక్ష, అణచివేతకు అవకాశం ఉండదు."

-రాహుల్​ గాంధీ, కాంగ్రెస్​ అగ్రనేత

ఇవీ చూడండి :

Last Updated : Mar 8, 2022, 12:15 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.