ETV Bharat / bharat

ఇన్సూ​రెన్స్​ కంపెనీకి టోకరా.. రూ.1.60 కోట్లు కాజేసిన మహిళ!

ఓ మహిళ ఇన్సూ​రెన్స్​ కంపెనీని బురిడి కొట్టించింది. చనిపోయిన తన భర్త పేరు మీద ఇన్సూ​రెన్స్ పాలసీ తీసుకుని ఏకంగా రూ.1.60 కోట్లు కాజేసింది. ఆలస్యంగా మోసాన్ని తెలుసుకున్న సదరు బీమా సంస్థ కోర్టును ఆశ్రయించింది. కోర్టు ఆదేశాలతో పోలీసులు కేసు నమోదు చేశారు.

author img

By

Published : Nov 8, 2022, 9:37 AM IST

woman cheated insurance company
ఇన్స్​రెన్స్​ కంపెనీ టోకరా

చనిపోయిన భర్త బతికే ఉన్నాడని చెప్పి ఇన్సూ​రెన్స్​ తీసుకొని రూ.1.60 కోట్లను కాజేసింది ఓ మహిళ. భర్త బ్రతికే ఉన్నట్లుగా నకిలీ పత్రాలు సృష్టించి 25 సంవత్సరాలకు ఇన్సూ​రెన్స్ తీసుకుంది. ఆ తరువాత 14 రోజులకే చనిపోయాడని ఆ మొత్తం క్లైమ్​ చేసుకుని ఇన్సూ​రెన్స్ కంపెనీని బోల్తా కొట్టించింది. మోసాన్ని ఆలస్యంగా తెలుసుకున్న సదరు బీమా సంస్థ కోర్టును ఆశ్రయించింది.

ఇదీ జరిగింది
మధ్యప్రదేశ్​ ఇందోర్​కు చెందిన పూల్​భాయ్​ అనే మహిళ చనిపోయిన తన భర్త తుకారంపై 25 సంవత్సరాలకు 2012లో ఇన్స్​రెన్స్​ పాలసీ తీసుకుంది. తీసుకున్న 14 రోజులకే అతడు చనిపోయాడని చెప్పి ఇన్సూ​రెన్స్​​ కంపెనీ నుంచి రూ.1.60 కోట్లను క్లెయిమ్​ చేసుకుంది. భర్త చనిపోయిన విషయాన్ని కంపెనీకి తెలియకుండా జాగ్రత్త పడింది పూల్​భాయ్​. అందుకు ఇన్సూ​రెన్స్​​ ఏజెంట్ బద్రిలాల్​​ సహాయం తీసుకుంది. ఇద్దరు కలిసి తుకారం బ్రతికే ఉన్నట్లుగా నకిలీ పత్రాలు సృష్టించారు. వెరిఫికేషన్​ సమయంలో వాటిని ఇన్సూ​రెన్స్​​ కంపెనీకి సమర్పించారు. దీనిపై ఇన్సూ​రెన్స్​​ కంపెనీకి అనుమానం వచ్చి మరోసారి వెరిఫికేషన్ చేసుకుంది. దీంతో జరిగిన మోసం బయటపడింది. మహిళ మోసంపై ఆశ్చర్యపోయిన కంపెని మోసాన్ని గ్రహించి కోర్టుకెళ్లింది. కోర్టు ఆదేశాలతో ఈ అంశంపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.

చనిపోయిన భర్త బతికే ఉన్నాడని చెప్పి ఇన్సూ​రెన్స్​ తీసుకొని రూ.1.60 కోట్లను కాజేసింది ఓ మహిళ. భర్త బ్రతికే ఉన్నట్లుగా నకిలీ పత్రాలు సృష్టించి 25 సంవత్సరాలకు ఇన్సూ​రెన్స్ తీసుకుంది. ఆ తరువాత 14 రోజులకే చనిపోయాడని ఆ మొత్తం క్లైమ్​ చేసుకుని ఇన్సూ​రెన్స్ కంపెనీని బోల్తా కొట్టించింది. మోసాన్ని ఆలస్యంగా తెలుసుకున్న సదరు బీమా సంస్థ కోర్టును ఆశ్రయించింది.

ఇదీ జరిగింది
మధ్యప్రదేశ్​ ఇందోర్​కు చెందిన పూల్​భాయ్​ అనే మహిళ చనిపోయిన తన భర్త తుకారంపై 25 సంవత్సరాలకు 2012లో ఇన్స్​రెన్స్​ పాలసీ తీసుకుంది. తీసుకున్న 14 రోజులకే అతడు చనిపోయాడని చెప్పి ఇన్సూ​రెన్స్​​ కంపెనీ నుంచి రూ.1.60 కోట్లను క్లెయిమ్​ చేసుకుంది. భర్త చనిపోయిన విషయాన్ని కంపెనీకి తెలియకుండా జాగ్రత్త పడింది పూల్​భాయ్​. అందుకు ఇన్సూ​రెన్స్​​ ఏజెంట్ బద్రిలాల్​​ సహాయం తీసుకుంది. ఇద్దరు కలిసి తుకారం బ్రతికే ఉన్నట్లుగా నకిలీ పత్రాలు సృష్టించారు. వెరిఫికేషన్​ సమయంలో వాటిని ఇన్సూ​రెన్స్​​ కంపెనీకి సమర్పించారు. దీనిపై ఇన్సూ​రెన్స్​​ కంపెనీకి అనుమానం వచ్చి మరోసారి వెరిఫికేషన్ చేసుకుంది. దీంతో జరిగిన మోసం బయటపడింది. మహిళ మోసంపై ఆశ్చర్యపోయిన కంపెని మోసాన్ని గ్రహించి కోర్టుకెళ్లింది. కోర్టు ఆదేశాలతో ఈ అంశంపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.