ETV Bharat / bharat

'సీపీఎం ముక్త్ భారత్ అని మోదీ అనరేం?'

author img

By

Published : Apr 3, 2021, 5:46 PM IST

కేరళ ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్న కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ.. ప్రధాని మోదీపై విమర్శలు గుప్పించారు. ఏళ్ల చరిత్ర ఉన్న కాంగ్రెస్​ పార్టీతోనే మోదీకి సమస్య ఉందని అన్నారు.

rahul on modi
'సీపీఎం ముక్త్ భారత్ అని మోదీ అనరేం?'

కేరళ ఎన్నికల ప్రచారంలో భాగంగా 'కాంగ్రెస్​ ముక్త్ భారత్​' అని మోదీ పలుమార్లు అనడాన్ని తప్పుపట్టారు ఆ పార్టీ నేత రాహుల్ గాంధీ. భాజపా, వామపక్షాలు సమాజాన్ని విచ్ఛిన్నం చేస్తాయని అన్నారు.

"ఎక్కడికెళ్లినా ప్రధాని మోదీ 'కాంగ్రెస్​ ముక్త్ భారత్'(కాంగ్రెస్ లేని భారతదేశం) అని నినదిస్తున్నారు. నిద్రలేచినప్పుడు, పడుకునేముందు కూడా కాంగ్రెస్​ ముక్త్ భారత్​ అనే అంటున్నారు. సీపీఎం ముక్త్ భారత్​ అని ఎందుకు అనరు?"

-రాహుల్ గాంధీ, కాంగ్రెస్​ నేత.

వామపక్షాలతో మోదీకి సమస్యేం లేదని, అయన సమస్యంతా కాంగ్రెస్​ పార్టీతోనే అని అన్నారు రాహుల్ గాంధీ. ఆర్​ఎస్​ఎస్​, వామపక్షాల భావజాలం ఒక్కటేనని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్.. ప్రజలందరినీ ఏకం చేస్తుందని అన్నారు. ప్రజలను ఏకతాటిపైకి తెచ్చేవారితోనే తమకు ముప్పు ఉందని ఆర్​ఎస్​ఎస్​ భావిస్తోందని విమర్శించారు.

ఇదీ చదవండి: బీజాపుర్​లో ఎన్​కౌంటర్​- జవాను మృతి

కేరళ ఎన్నికల ప్రచారంలో భాగంగా 'కాంగ్రెస్​ ముక్త్ భారత్​' అని మోదీ పలుమార్లు అనడాన్ని తప్పుపట్టారు ఆ పార్టీ నేత రాహుల్ గాంధీ. భాజపా, వామపక్షాలు సమాజాన్ని విచ్ఛిన్నం చేస్తాయని అన్నారు.

"ఎక్కడికెళ్లినా ప్రధాని మోదీ 'కాంగ్రెస్​ ముక్త్ భారత్'(కాంగ్రెస్ లేని భారతదేశం) అని నినదిస్తున్నారు. నిద్రలేచినప్పుడు, పడుకునేముందు కూడా కాంగ్రెస్​ ముక్త్ భారత్​ అనే అంటున్నారు. సీపీఎం ముక్త్ భారత్​ అని ఎందుకు అనరు?"

-రాహుల్ గాంధీ, కాంగ్రెస్​ నేత.

వామపక్షాలతో మోదీకి సమస్యేం లేదని, అయన సమస్యంతా కాంగ్రెస్​ పార్టీతోనే అని అన్నారు రాహుల్ గాంధీ. ఆర్​ఎస్​ఎస్​, వామపక్షాల భావజాలం ఒక్కటేనని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్.. ప్రజలందరినీ ఏకం చేస్తుందని అన్నారు. ప్రజలను ఏకతాటిపైకి తెచ్చేవారితోనే తమకు ముప్పు ఉందని ఆర్​ఎస్​ఎస్​ భావిస్తోందని విమర్శించారు.

ఇదీ చదవండి: బీజాపుర్​లో ఎన్​కౌంటర్​- జవాను మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.