ETV Bharat / bharat

'గెలుపుపై ధీమా ఉంటే రూ.కోట్లతో ప్రచారం ఎందుకు?'

author img

By

Published : Mar 30, 2021, 7:43 AM IST

అసోంలో అన్ని స్థానాలను గెలుస్థామనే ధీమా ఉన్నట్లయితే భాజపా తన ఎన్నికల ప్రకటనలకు కోట్లాది రూపాయలు వెచ్చించడం ఎందుకని కాంగ్రెస్​ ప్రశ్నించింది. ప్రకటనలను వార్తలుగా మభ్యపెట్టి ఎన్నికల ప్రవర్తనా నియమావళిని భాజపా ఉల్లఘించిందని ఆరోపించింది. ఈ అంశంపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసినట్లు తెలిపింది.

Why did BJP spend crores on newspaper ad if it's confident of winning all Upper Assam seats: Congress
'అన్ని స్థానాలను గెలిస్తే ప్రకటనలకు రూ.కోట్లేందుకు'

అసోం అసెంబ్లీ ఎన్నికల వేళ భాజపా వార్తా ప్రకటనలపై రాజకీయ దుమారం చెలరేగింది. పత్రికా ప్రకటనలను(అడ్వర్టైజ్​మెంట్) భాజపా.. వార్తలుగా మభ్యపెట్టిందని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. ఈ మేరకు అసోం సీఎం సర్బానంద సోనోవాల్ సహా.. భాజపా జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా, రాష్ట్రాధ్యక్షుడు రంజిత్​ కుమార్​ దాస్​పై ఫిర్యాదు చేసింది.

''ఎన్నికల్లో గెలుపుపై భాజపాలో ఏకాభిప్రాయం లేదు. ఫలితాలను అంచనా వేయలేకే పత్రికా ప్రకటనల ద్వారా వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. మొదటి దశలో ఎన్నికలు జరిగిన 46 స్థానాలను గెలుచుకుంటామని చెప్పారు. పత్రికా ప్రకటనల్లో 47 అని మరో నేత తెలిపారు. తరువాత భాజపా రాష్ట్రాధ్యక్షుడు 42 అన్నారు. చివరకు కేంద్ర హోం మంత్రి అమిత్​ షా 37 నియోజకవర్గాల్లో భాజపా విజయం సాధిస్తుందని ప్రకటించారు.''

-రిపున్​ బోరా, కాంగ్రెస్​ అధ్యక్షుడు.

ఎన్నికల ప్రవర్తనా నియమావళిని భాజపా ఉల్లఘించిందని అసోం కాంగ్రెస్ అధ్యక్షుడు రిపున్ బోరా ఆరోపించారు. ఎన్నికల ప్రకటనలకు కోట్లాది రూపాయలు ఖర్చు చేయాల్సిన అవసరం ఏముందని.. ప్రజలను తప్పుదోవ పట్టించేందుకే ఇలా చేస్తోందని మండిపడ్డారు.

ఈ అంశంపై ఎన్నికల ప్రధాన అధికారి నితిన్ ఖాడేకి ఫిర్యాదు చేసింది కాంగ్రెస్. వార్తాసంస్థలు ఈ అంశంపై నిజానిజాలు అంచనా వేశాయా లేదా అని ప్రశ్నించింది.

ఇవీ చదవండి: అసోం తొలి దశ పోలింగ్​ ప్రశాంతం

'బంగాల్, అసోం తొలి విడతలో భాజపాకే పట్టం'

'భాజపాకు బంగాల్​లో మెజారిటీ- అసోంలో అధికారం'

అసోం అసెంబ్లీ ఎన్నికల వేళ భాజపా వార్తా ప్రకటనలపై రాజకీయ దుమారం చెలరేగింది. పత్రికా ప్రకటనలను(అడ్వర్టైజ్​మెంట్) భాజపా.. వార్తలుగా మభ్యపెట్టిందని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. ఈ మేరకు అసోం సీఎం సర్బానంద సోనోవాల్ సహా.. భాజపా జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా, రాష్ట్రాధ్యక్షుడు రంజిత్​ కుమార్​ దాస్​పై ఫిర్యాదు చేసింది.

''ఎన్నికల్లో గెలుపుపై భాజపాలో ఏకాభిప్రాయం లేదు. ఫలితాలను అంచనా వేయలేకే పత్రికా ప్రకటనల ద్వారా వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. మొదటి దశలో ఎన్నికలు జరిగిన 46 స్థానాలను గెలుచుకుంటామని చెప్పారు. పత్రికా ప్రకటనల్లో 47 అని మరో నేత తెలిపారు. తరువాత భాజపా రాష్ట్రాధ్యక్షుడు 42 అన్నారు. చివరకు కేంద్ర హోం మంత్రి అమిత్​ షా 37 నియోజకవర్గాల్లో భాజపా విజయం సాధిస్తుందని ప్రకటించారు.''

-రిపున్​ బోరా, కాంగ్రెస్​ అధ్యక్షుడు.

ఎన్నికల ప్రవర్తనా నియమావళిని భాజపా ఉల్లఘించిందని అసోం కాంగ్రెస్ అధ్యక్షుడు రిపున్ బోరా ఆరోపించారు. ఎన్నికల ప్రకటనలకు కోట్లాది రూపాయలు ఖర్చు చేయాల్సిన అవసరం ఏముందని.. ప్రజలను తప్పుదోవ పట్టించేందుకే ఇలా చేస్తోందని మండిపడ్డారు.

ఈ అంశంపై ఎన్నికల ప్రధాన అధికారి నితిన్ ఖాడేకి ఫిర్యాదు చేసింది కాంగ్రెస్. వార్తాసంస్థలు ఈ అంశంపై నిజానిజాలు అంచనా వేశాయా లేదా అని ప్రశ్నించింది.

ఇవీ చదవండి: అసోం తొలి దశ పోలింగ్​ ప్రశాంతం

'బంగాల్, అసోం తొలి విడతలో భాజపాకే పట్టం'

'భాజపాకు బంగాల్​లో మెజారిటీ- అసోంలో అధికారం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.