ETV Bharat / bharat

'దీదీని ఓడించేందుకు బంగాల్​ ప్రజలంతా ఏకం'

author img

By

Published : Apr 3, 2021, 10:11 AM IST

బంగాల్​లో మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్​ను ఓడించాలని ప్రజలంతా ఏకమయ్యారని భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అన్నారు. బంగాల్​లో భాజపా అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. నందిగ్రామ్​లో మమత ఓడిపోతారనే.. మరో స్థానంలో పోటీ చేయాలని ఆమె భావిస్తున్నారని అన్నారు.

Nadda
జేపీ నడ్డా

మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్​ను ఓడించాలనే కృత నిశ్చయంతో బంగాల్​ ప్రజలంతా ఉన్నారని భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అన్నారు. బంగాల్​లో భాజపా అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.

నందిగ్రామ్​లో మమతా బెనర్జీ కచ్చితంగా ఓడిపోతారని నడ్డా జోస్యం చెప్పారు. అక్కడ భాజపా అభ్యర్థి సువేందు అధికారి విజయం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. అందుకే ఆమె వేరే స్థానం నుంచి పోటీ చేయాలని భావిస్తున్నారని ఆరోపించారు. మమత వేరే స్థానం నుంచి పోటీ చేయబోతున్నారనే విషయం తృణమూల్​ కార్యకర్తల నుంచే తనకు తెలిసిందని అన్నారు. రెండు దశల పోలింగ్​లో భాజపా అత్యధిక స్థానాల్ని కైవసం చేసుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు.

బంగాల్​లో 8 విడతల్లో పోలింగ్ నిర్వహిస్తున్నారు. తొలి విడత, రెండో విడత పూర్తయ్యాయి. మూడో దఫా పోలింగ్​ ఏప్రిల్​6 జరగనుంది.

ఇదీ చదవండి: నందిగ్రామ్ రణం: రోజంతా వార్​ రూమ్​లోనే దీదీ!

మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్​ను ఓడించాలనే కృత నిశ్చయంతో బంగాల్​ ప్రజలంతా ఉన్నారని భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అన్నారు. బంగాల్​లో భాజపా అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.

నందిగ్రామ్​లో మమతా బెనర్జీ కచ్చితంగా ఓడిపోతారని నడ్డా జోస్యం చెప్పారు. అక్కడ భాజపా అభ్యర్థి సువేందు అధికారి విజయం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. అందుకే ఆమె వేరే స్థానం నుంచి పోటీ చేయాలని భావిస్తున్నారని ఆరోపించారు. మమత వేరే స్థానం నుంచి పోటీ చేయబోతున్నారనే విషయం తృణమూల్​ కార్యకర్తల నుంచే తనకు తెలిసిందని అన్నారు. రెండు దశల పోలింగ్​లో భాజపా అత్యధిక స్థానాల్ని కైవసం చేసుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు.

బంగాల్​లో 8 విడతల్లో పోలింగ్ నిర్వహిస్తున్నారు. తొలి విడత, రెండో విడత పూర్తయ్యాయి. మూడో దఫా పోలింగ్​ ఏప్రిల్​6 జరగనుంది.

ఇదీ చదవండి: నందిగ్రామ్ రణం: రోజంతా వార్​ రూమ్​లోనే దీదీ!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.