ETV Bharat / bharat

ఆర్​ఎస్​ఎస్​ కార్యకర్త హత్యపై నిరసనలు హింసాయుతం

author img

By

Published : Feb 25, 2021, 6:54 PM IST

Updated : Feb 25, 2021, 7:45 PM IST

కేరళ అలప్పుజలో ఆర్​ఎస్​ఎస్​ నేత హత్యను నిరసిస్తూ భాజపా పిలుపునిచ్చిన సమ్మె​ తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. మాస్కు ధరించి ఉన్న కొందరు దుండగులు స్థానిక దుకాణాలకు నిప్పంటించారు.

Violence broke out during strike in Alappuzha
ఆర్​ఎస్​ఎస్​ కార్యకర్త హత్య-కేరళలో విధ్వంసం

కేరళ అలప్పుజలో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్​ నేత హత్యను నిరసిస్తూ భాజపా నేతలు తలపెట్టిన ఆందోళన... విధ్వంసానికి దారి తీసింది. మాస్క్ ధరించిన కొందరు దుండగులు స్థానిక దుకాణాలను ధ్వంసం చేశారు. ది సోషల్​ డెమొక్రటిక్​ పార్టీ ఆఫ్​ ఇండియా(ఎస్​డీపీఐ) కార్యకర్త మునీర్​కు సంబంధించిన ఓ దుకాణానికి నిప్పంటించారు.

హింసాయుతంగా మారిన నిరసనలు

ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నించారు. జిల్లాలోని పలు ప్రాంతాల్లోనూ అల్లర్లు చెలరేగడం వల్ల భద్రతను కట్టుదిట్టం చేశారు స్థానిక పోలీసులు.

Violence broke out during strike in Alappuzha
దుకాణాలకు నిప్పంటించిన దుండగులు
Violence broke out during strike in Alappuzha
ధ్వంసమైన వాహనం
Violence broke out during strike in Alappuzha
కారు అద్దాలు ధ్వంసం

అలప్పుజ జిల్లాలో బుధవారం రాత్రి చెర్తలకు సమీపంలోని నాగమ్​కులనగర్​లో ది సోషల్​ డెమొక్రటిక్​ పార్టీ ఆఫ్​ ఇండియా(ఎస్​డీపీఐ), ఆర్​ఎస్​ఎస్​ కార్యకర్తలకు మధ్య గొడవ జరిగింది. ఈ ఘటనలో రాహుల్​ కృష్ణ అలియాస్​ నందు అనే ఆర్​ఎస్​ఎస్​ కార్యకర్త మృతి చెందాడు.

Violence broke out during strike in Alappuzha
మంటలను అదుపుచేస్తోన్న అగ్నిమాపక సిబ్బంది
Violence broke out during strike in Alappuzha
ఘటనా స్థలంలో ఆయుధాలను పరిశీలిస్తోన్న అధికారులు

'ప్రభుత్వం వారికే మద్దతిస్తోంది'

ఎస్​డీపీఐ కార్యకర్తలు నందును హత్య చేశారని భాజపా ఆరోపించింది. ఈ విషయంలో కేరళ అధికార పార్టీ కూడా పాపులర్​ ఫ్రంట్​కే మద్దతుగా ఉంటోందని విమర్శలు చేసింది. ఈ నేపథ్యంలో పాపులర్​ ఫ్రంట్ ఆఫ్​ ఇండియా కార్యకలపాలను అడ్డుకోవాలని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కే సురేంద్రన్ అన్నారు. పీఎఫ్​ఐని ఉగ్రవాద సంస్థగా పేర్కొన్నారు.

ఇదీ చదవండి:'టీ కోసం భార్యపై దాడా? సమ్మతం కాదు'

కేరళ అలప్పుజలో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్​ నేత హత్యను నిరసిస్తూ భాజపా నేతలు తలపెట్టిన ఆందోళన... విధ్వంసానికి దారి తీసింది. మాస్క్ ధరించిన కొందరు దుండగులు స్థానిక దుకాణాలను ధ్వంసం చేశారు. ది సోషల్​ డెమొక్రటిక్​ పార్టీ ఆఫ్​ ఇండియా(ఎస్​డీపీఐ) కార్యకర్త మునీర్​కు సంబంధించిన ఓ దుకాణానికి నిప్పంటించారు.

హింసాయుతంగా మారిన నిరసనలు

ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నించారు. జిల్లాలోని పలు ప్రాంతాల్లోనూ అల్లర్లు చెలరేగడం వల్ల భద్రతను కట్టుదిట్టం చేశారు స్థానిక పోలీసులు.

Violence broke out during strike in Alappuzha
దుకాణాలకు నిప్పంటించిన దుండగులు
Violence broke out during strike in Alappuzha
ధ్వంసమైన వాహనం
Violence broke out during strike in Alappuzha
కారు అద్దాలు ధ్వంసం

అలప్పుజ జిల్లాలో బుధవారం రాత్రి చెర్తలకు సమీపంలోని నాగమ్​కులనగర్​లో ది సోషల్​ డెమొక్రటిక్​ పార్టీ ఆఫ్​ ఇండియా(ఎస్​డీపీఐ), ఆర్​ఎస్​ఎస్​ కార్యకర్తలకు మధ్య గొడవ జరిగింది. ఈ ఘటనలో రాహుల్​ కృష్ణ అలియాస్​ నందు అనే ఆర్​ఎస్​ఎస్​ కార్యకర్త మృతి చెందాడు.

Violence broke out during strike in Alappuzha
మంటలను అదుపుచేస్తోన్న అగ్నిమాపక సిబ్బంది
Violence broke out during strike in Alappuzha
ఘటనా స్థలంలో ఆయుధాలను పరిశీలిస్తోన్న అధికారులు

'ప్రభుత్వం వారికే మద్దతిస్తోంది'

ఎస్​డీపీఐ కార్యకర్తలు నందును హత్య చేశారని భాజపా ఆరోపించింది. ఈ విషయంలో కేరళ అధికార పార్టీ కూడా పాపులర్​ ఫ్రంట్​కే మద్దతుగా ఉంటోందని విమర్శలు చేసింది. ఈ నేపథ్యంలో పాపులర్​ ఫ్రంట్ ఆఫ్​ ఇండియా కార్యకలపాలను అడ్డుకోవాలని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కే సురేంద్రన్ అన్నారు. పీఎఫ్​ఐని ఉగ్రవాద సంస్థగా పేర్కొన్నారు.

ఇదీ చదవండి:'టీ కోసం భార్యపై దాడా? సమ్మతం కాదు'

Last Updated : Feb 25, 2021, 7:45 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.