ఉత్తరాఖండ్ మసూరీలో నిర్వహించిన హెరిటేజ్ హిమాలయన్ కార్ ర్యాలీలో (Vintage car rally 2021) వింటేజ్ కార్లు ఆకట్టుకున్నాయి. 92కు పైగా పాతకాలం నాటి డిజైన్ కార్లు ఈ ర్యాలీలో (Vintage car rally 2021) కనువిందు చేశాయి. ఉత్తరాఖండ్ టూరిజం మంత్రి సత్పాల్ మహరాజ్, మరో మంత్రి గణేశ్ జోషి, రచయిత రస్కిన్ బాండ్.. జెండా ఊపి ఈ ర్యాలీని (Mussoorie news) ప్రారంభించారు.
ఫోక్స్వాగన్ బీటిల్, 1950-60లకు చెందిన ఇటాలియన్ ఫియట్ సహా పలు వింటేజ్ కార్లు ర్యాలీకి (Himalayan car rally 2021) ఆకర్షణగా నిలిచాయి. సాధారణ కార్లు సైతం ర్యాలీలో పాల్గొన్నాయి.
ఇండియన్ ఆటోమోటివ్ రేసింగ్ క్లబ్ వ్యవస్థాపకుడు, ఫెడరేషన్ ఆఫ్ మోటార్ స్పోర్ట్స్ క్లబ్స్ ఆఫ్ ఇండియా మాజీ అధ్యక్షుడు నాజిర్ హుస్సేన్ జ్ఞాపకార్థం ఈ ర్యాలీ నిర్వహిస్తున్నారు. ఈ ర్యాలీని 'నాజిర్ హుస్సేన్ మెమోరియల్ డ్రైవ్'గా పిలుస్తున్నారు.
ప్రస్తుతం నిర్వహిస్తున్న ర్యాలీకి వచ్చిన ఆదరణ చూసి నిర్వాహకులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. వచ్చే ఏడాది మరోసారి ర్యాలీ నిర్వహిస్తామని చెబుతున్నారు.
ఇదీ చదవండి: