ETV Bharat / bharat

Viral Video: జైలులో ఖైదీల మందు పార్టీ.. వీడియో వైరల్!​

author img

By

Published : Aug 26, 2021, 9:17 AM IST

కారాగారంలో ఉన్న ఖైదీలు(Priosoners) మద్యం సేవిస్తూ, స్నాక్స్​ తింటూ జాలీగా గడపుతున్న వీడియో.. సామాజిక మాధ్యమాల్లో వైరల్​(Viral Video)గా మారింది. ఈ సంఘటన దిల్లీలోని జైలులో జరిగినట్లుగా తెలుస్తోంది.

prisoners drinking alcohol
జైలులో ఖైదీలు

జైలు అంటే.. నాలుగు గోడలు.. కఠిన నిబంధనలు.. చప్పిడి తిండితో ఉంటుందని మనకు తెలుసు. కానీ, ఓ కారాగారంలో ఇందుకు భిన్నమైన దృశ్యాలు కనిపించాయి. లాకప్​లోని ఖైదీలు(Prisoners) జాలీగా గడుపుతున్న వీడియో.. సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా(Viral Video) మారింది. ఈ సంఘటన దిల్లీ జైలులో జరిగినట్లుగా తెలుస్తోంది.

జైలులో మద్యం తాగుతున్న ఖైదీలు

మద్యం సేవిస్తూ..

లాకప్​లో ఉన్న ఖైదీలు.. సిగరెట్లు, స్నాక్స్​ తింటూ మద్యం సేవించడం(Alcohol drinking prisoners) ఆ వీడియోలో కనిపించింది. వారిలోని ఓ వ్యక్తి తన ఫోన్​లో ఈ తతంగాన్ని రికార్డు చేశాడు. దీంతో ఈ ఖైదీల వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఈ ఖైదీలు నీరజ్​ బవానియా గ్యాంగ్​కు చెందిన షూటర్లుగా తెలుస్తోంది. కొన్నిరోజుల క్రితం వీరిని అరెస్టు చేసిన దిల్లీలోని మండోలి జైలు ప్రత్యేక విభాగం పోలీసులు.. రిమాండ్​ కోసం లోధీ కాలనీ కార్యాలయానికి తరలించారు. ఆ తర్వాతే ఈ వీడియో బయటకు వచ్చింది. అయితే.. ఇది జైలులో జరిగిందా? లేక ప్రత్యేక విభాగం కార్యాలయంలో జరిగిందా? అనేది తెలియలేదు.

'పరిశీలిస్తాం'

ఈ విషయాన్ని జైళ్ల శాఖ డీజీపీ సందీప్​ గోయల్​ దృష్టికి తీసుకువెళ్లగా.. తాము పరిశీలించాల్సిన అవసరం ఉందని చెప్పారు. అయితే.. ఈ వీడియో కచ్చితత్వంపై ఎలాంటి ఆధారాలు లేవు.

ఇదీ చూడండి: సతి వెంటే పతి- భార్య చితిలో దూకి భర్త మృతి

ఇదీ చూడండి: మిత్రుడి ప్రాణాలు కాపాడబోయి.. మరో ముగ్గురు కూడా..

జైలు అంటే.. నాలుగు గోడలు.. కఠిన నిబంధనలు.. చప్పిడి తిండితో ఉంటుందని మనకు తెలుసు. కానీ, ఓ కారాగారంలో ఇందుకు భిన్నమైన దృశ్యాలు కనిపించాయి. లాకప్​లోని ఖైదీలు(Prisoners) జాలీగా గడుపుతున్న వీడియో.. సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా(Viral Video) మారింది. ఈ సంఘటన దిల్లీ జైలులో జరిగినట్లుగా తెలుస్తోంది.

జైలులో మద్యం తాగుతున్న ఖైదీలు

మద్యం సేవిస్తూ..

లాకప్​లో ఉన్న ఖైదీలు.. సిగరెట్లు, స్నాక్స్​ తింటూ మద్యం సేవించడం(Alcohol drinking prisoners) ఆ వీడియోలో కనిపించింది. వారిలోని ఓ వ్యక్తి తన ఫోన్​లో ఈ తతంగాన్ని రికార్డు చేశాడు. దీంతో ఈ ఖైదీల వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఈ ఖైదీలు నీరజ్​ బవానియా గ్యాంగ్​కు చెందిన షూటర్లుగా తెలుస్తోంది. కొన్నిరోజుల క్రితం వీరిని అరెస్టు చేసిన దిల్లీలోని మండోలి జైలు ప్రత్యేక విభాగం పోలీసులు.. రిమాండ్​ కోసం లోధీ కాలనీ కార్యాలయానికి తరలించారు. ఆ తర్వాతే ఈ వీడియో బయటకు వచ్చింది. అయితే.. ఇది జైలులో జరిగిందా? లేక ప్రత్యేక విభాగం కార్యాలయంలో జరిగిందా? అనేది తెలియలేదు.

'పరిశీలిస్తాం'

ఈ విషయాన్ని జైళ్ల శాఖ డీజీపీ సందీప్​ గోయల్​ దృష్టికి తీసుకువెళ్లగా.. తాము పరిశీలించాల్సిన అవసరం ఉందని చెప్పారు. అయితే.. ఈ వీడియో కచ్చితత్వంపై ఎలాంటి ఆధారాలు లేవు.

ఇదీ చూడండి: సతి వెంటే పతి- భార్య చితిలో దూకి భర్త మృతి

ఇదీ చూడండి: మిత్రుడి ప్రాణాలు కాపాడబోయి.. మరో ముగ్గురు కూడా..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.