ఉత్తర్ప్రదేశ్లోని కాన్పుర్ దేహత్ జిల్లా జైతాపుర్ గ్రామంలో... సగం కాలిపోయిన పన్నెండేళ్ల చిన్నారి శవం బయటపడటం కలకలం రేపింది. బాలికను బుధవారం కొందరు దుండగులు కిడ్నాప్ చేశారని పోలీసులు తెలిపారు. బాలిక ఇంటికి 200 మీటర్ల దూరంలోని ఓ జామ తోటలో శవాన్ని గుర్తించినట్లు చెప్పారు.
తన కూతురిపై అత్యాచారం చేసి హత్య చేశారని బాధితురాలి తండ్రి ఆరోపించారు. ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కిడ్నాప్ అయిన ముందు రోజు రాత్రి ఇంటి ఆరుబయట బాలిక నిద్రపోయిందని, ఉదయం చూసేసరికి కనిపించలేదని కుటుంబ సభ్యులు చెప్పారు. చుట్టుపక్కల వెతకగా.. సగం కాలిన శవం అర్ధనగ్నంగా పడి ఉందని తెలిపారు. ఆ ప్రాంతంలో ఓ మంచం కూడా ఉందని చెప్పారు.
దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు ముమ్మరం చేశారు. బాధితురాలిపై అత్యాచారం జరిగిందో లేదో అన్న విషయం శవపరీక్షలో తెలుస్తుందని చెప్పారు. నిందితుల కోసం గాలింపు చేపట్టినట్లు తెలిపారు.
ఇదీ చదవండి: శునకాన్ని స్కూటీకి కట్టి ఈడ్చుకెళ్లిన మహిళలు