ETV Bharat / bharat

సగం కాలిపోయి.. అర్ధనగ్నంగా బాలిక మృతదేహం - కాన్పుర్ రేప్ కేసు

ముందురోజు కనిపించకుండాపోయిన ఓ పన్నెండేళ్ల బాలిక శవమై తేలింది. ఓ జామ తోటలో బాలిక మృతదేహం అర్ధనగ్నంగా కనిపించింది. బాలికపై అత్యాచారం జరిగి ఉంటుందని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.

Uttar Pradesh: Half burnt body of minor girl found in Kanpur Dehat
సగం కాలిపోయి.. అర్ధనగ్నంగా బాలిక శవం
author img

By

Published : Jul 1, 2021, 8:31 PM IST

Updated : Jul 1, 2021, 9:50 PM IST

ఉత్తర్​ప్రదేశ్​లోని కాన్పుర్​ దేహత్ జిల్లా జైతాపుర్​ గ్రామంలో... సగం కాలిపోయిన పన్నెండేళ్ల చిన్నారి శవం బయటపడటం కలకలం రేపింది. బాలికను బుధవారం కొందరు దుండగులు కిడ్నాప్ చేశారని పోలీసులు తెలిపారు. బాలిక ఇంటికి 200 మీటర్ల దూరంలోని ఓ జామ తోటలో శవాన్ని గుర్తించినట్లు చెప్పారు.

Uttar Pradesh: Half burnt body of minor girl found in Kanpur Dehat
బాలిక శవం
Uttar Pradesh: Half burnt body of minor girl found in Kanpur Dehat
శవం దొరికిన ప్రాంతాన్ని తనిఖీ చేస్తున్న పోలీసులు

తన కూతురిపై అత్యాచారం చేసి హత్య చేశారని బాధితురాలి తండ్రి ఆరోపించారు. ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కిడ్నాప్ అయిన ముందు రోజు రాత్రి ఇంటి ఆరుబయట బాలిక నిద్రపోయిందని, ఉదయం చూసేసరికి కనిపించలేదని కుటుంబ సభ్యులు చెప్పారు. చుట్టుపక్కల వెతకగా.. సగం కాలిన శవం అర్ధనగ్నంగా పడి ఉందని తెలిపారు. ఆ ప్రాంతంలో ఓ మంచం కూడా ఉందని చెప్పారు.

Uttar Pradesh: Half burnt body of minor girl found in Kanpur Dehat
ఘటనా ప్రాంతంలో పోలీసులు

దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు ముమ్మరం చేశారు. బాధితురాలిపై అత్యాచారం జరిగిందో లేదో అన్న విషయం శవపరీక్షలో తెలుస్తుందని చెప్పారు. నిందితుల కోసం గాలింపు చేపట్టినట్లు తెలిపారు.

ఇదీ చదవండి: శునకాన్ని స్కూటీకి కట్టి ఈడ్చుకెళ్లిన మహిళలు

ఉత్తర్​ప్రదేశ్​లోని కాన్పుర్​ దేహత్ జిల్లా జైతాపుర్​ గ్రామంలో... సగం కాలిపోయిన పన్నెండేళ్ల చిన్నారి శవం బయటపడటం కలకలం రేపింది. బాలికను బుధవారం కొందరు దుండగులు కిడ్నాప్ చేశారని పోలీసులు తెలిపారు. బాలిక ఇంటికి 200 మీటర్ల దూరంలోని ఓ జామ తోటలో శవాన్ని గుర్తించినట్లు చెప్పారు.

Uttar Pradesh: Half burnt body of minor girl found in Kanpur Dehat
బాలిక శవం
Uttar Pradesh: Half burnt body of minor girl found in Kanpur Dehat
శవం దొరికిన ప్రాంతాన్ని తనిఖీ చేస్తున్న పోలీసులు

తన కూతురిపై అత్యాచారం చేసి హత్య చేశారని బాధితురాలి తండ్రి ఆరోపించారు. ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కిడ్నాప్ అయిన ముందు రోజు రాత్రి ఇంటి ఆరుబయట బాలిక నిద్రపోయిందని, ఉదయం చూసేసరికి కనిపించలేదని కుటుంబ సభ్యులు చెప్పారు. చుట్టుపక్కల వెతకగా.. సగం కాలిన శవం అర్ధనగ్నంగా పడి ఉందని తెలిపారు. ఆ ప్రాంతంలో ఓ మంచం కూడా ఉందని చెప్పారు.

Uttar Pradesh: Half burnt body of minor girl found in Kanpur Dehat
ఘటనా ప్రాంతంలో పోలీసులు

దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు ముమ్మరం చేశారు. బాధితురాలిపై అత్యాచారం జరిగిందో లేదో అన్న విషయం శవపరీక్షలో తెలుస్తుందని చెప్పారు. నిందితుల కోసం గాలింపు చేపట్టినట్లు తెలిపారు.

ఇదీ చదవండి: శునకాన్ని స్కూటీకి కట్టి ఈడ్చుకెళ్లిన మహిళలు

Last Updated : Jul 1, 2021, 9:50 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.