కరోనా ఉద్ధృతంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో సివిల్ సర్వీసెస్ పరీక్ష-2020 ఇంటర్వ్యూలను వాయిదా వేస్తున్నట్లు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రకటించింది. వాటిని తిరిగి ఎప్పుడు నిర్వహించేది తర్వాత తెలియజేస్తామంది.
వచ్చే నెల 9న జరగాల్సిన ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (ఈఓ/ఏఓ) నియామక పరీక్ష-2020 కూడా వాయిదా పడినట్లు యూపీఎస్సీ ప్రకటనలో పేర్కొంది.
ఇదీ చూడండి: ప్రస్తుతం ఆ దేశాలకు మాత్రమే విమాన ప్రయాణం