ETV Bharat / bharat

నేరస్థుల గుండెల్లో బుల్​డోజర్లు.. హత్య కేసులో ఎస్​ఐ ఇల్లు కూల్చివేత

author img

By

Published : Apr 4, 2022, 6:51 AM IST

UP Bulldozer news: ఉత్తరప్రదేశ్​లో నేరస్థుల గుండెల్లో బుల్​డోజర్లు పరిగెడుతున్నాయి. తాజాగా ఓ వ్యాపారవేత్త హత్య కేసులో నిందితుడైన ఇన్‌స్పెక్టర్​కు చెందిన అక్రమ భవనాన్ని లఖ్​నవూ డెవలప్‌మెంట్ అథారిటీ (ఎల్‌డీఏ) బుల్‌డోజర్‌తో కూల్చివేసింది.

UP Bulldozer news
బుల్​డోజర్లు

UP Bulldozer news: గోరఖ్‌పుర్‌ వ్యాపారవేత్త హత్య కేసులో నిందితుడైన ఇన్‌స్పెక్టర్​కు చెందిన అక్రమ భవనాన్ని లఖ్​నవూ డెవలప్‌మెంట్ అథారిటీ (ఎల్‌డీఏ) బుల్‌డోజర్‌తో కూల్చివేసింది. 2021 సెప్టెంబర్‌లో గోరఖ్‌పుర్ హోటల్‌లో కాన్పుర్ వ్యాపారి మనీష్ గుప్తాను హత్య చేసిన కేసులో ఎస్​ఐ జగత్ నారాయణ్ సింగ్ నిందితుడు. ఈ కేసులో సీబీఐ చార్జిషీట్ దాఖలు చేసింది.

లఖ్​నవూలోని చిన్‌హట్ ప్రాంతంలో ఉన్న భవనాన్ని కోర్టు ఆదేశాల మేరకు ఆదివారం కూల్చివేశారు. 'సరైన పత్రాలు లేకుండా నిర్మించిన జగత్ నారాయణ్ సింగ్ పేరు మీద ఉన్న మూడు అంతస్తుల అక్రమ భవనాన్ని ఈ రోజు బుల్డోజర్‌తో కూలగొట్టాం.' అని ఎల్‌డీఏ జోనల్ ఆఫీసర్ అమిత్ రాఠోడ్ చెప్పారు. వారం వ్యవధిలోనే ఇలాంటి రెండు అక్రమ నిర్మాణాలను కూల్చివేశారు అధికారులు.

UP Bulldozer news: గోరఖ్‌పుర్‌ వ్యాపారవేత్త హత్య కేసులో నిందితుడైన ఇన్‌స్పెక్టర్​కు చెందిన అక్రమ భవనాన్ని లఖ్​నవూ డెవలప్‌మెంట్ అథారిటీ (ఎల్‌డీఏ) బుల్‌డోజర్‌తో కూల్చివేసింది. 2021 సెప్టెంబర్‌లో గోరఖ్‌పుర్ హోటల్‌లో కాన్పుర్ వ్యాపారి మనీష్ గుప్తాను హత్య చేసిన కేసులో ఎస్​ఐ జగత్ నారాయణ్ సింగ్ నిందితుడు. ఈ కేసులో సీబీఐ చార్జిషీట్ దాఖలు చేసింది.

లఖ్​నవూలోని చిన్‌హట్ ప్రాంతంలో ఉన్న భవనాన్ని కోర్టు ఆదేశాల మేరకు ఆదివారం కూల్చివేశారు. 'సరైన పత్రాలు లేకుండా నిర్మించిన జగత్ నారాయణ్ సింగ్ పేరు మీద ఉన్న మూడు అంతస్తుల అక్రమ భవనాన్ని ఈ రోజు బుల్డోజర్‌తో కూలగొట్టాం.' అని ఎల్‌డీఏ జోనల్ ఆఫీసర్ అమిత్ రాఠోడ్ చెప్పారు. వారం వ్యవధిలోనే ఇలాంటి రెండు అక్రమ నిర్మాణాలను కూల్చివేశారు అధికారులు.

ఇదీ చదవండి: 'యోగీ జీ.. 'బుల్డోజర్'​తో మా ఇల్లు కూల్చేయండి ప్లీజ్!'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.