ETV Bharat / bharat

చిన్నారుల కోసం యూనిసెఫ్​- ఫేస్​బుక్​ జట్టు

author img

By

Published : Aug 10, 2021, 11:05 AM IST

ప్రస్తుతం విద్యాసంస్థలు మూతపడిన నేపథ్యంలో చిన్నారులకు ఆన్​లైన్​ పాఠాలే శరణ్యమయ్యాయి. ఈ నేపథ్యంలో సురక్షితమైన ఆన్​లైన్ వాతావరణం ఎంతో ముఖ్యం. అందువల్ల ఆఫ్​లైన్​తో పాటు ఆన్​లైన్​లో చిన్నారులపై జరుగుతున్న హింసను కట్టడి చేయటం, సురక్షితమైన ఆన్​లైన్​ కోసం యూనిసెఫ్​ ఇండియా, సామాజిక మాధ్యమ దిగ్గజం ఫేస్​బుక్​ జట్టుకట్టాయి. ఏడాది పాటు వివిధ కార్యక్రమాలు చేపట్టనున్నాయి.

UNICEF India, Facebook
యూనిసెఫ్​, ఫేస్​బుక్​, చిన్నారులపై హింస

చిన్నారులపై జరుగుతున్న హింసను కట్టడి చేయటం, ముఖ్యంగా ఆన్​లైన్​ భద్రతపై ప్రత్యేకంగా దృష్టిసారించేందుకు జట్టుకట్టాయి ఐక్యరాజ్య సమితి చిన్న పిల్లల విభాగం.. యూనిసెఫ్​ ఇండియా, ఫేస్​బుక్​. ఈ అంశంపై ఏడాది పాటు కలిసి పనిచేయనున్నాయి.

ఆన్​లైన్​ సహా ఆఫ్​లైన్​లోనూ చిన్నారులకు సురక్షితమైన వాతావరణాన్ని కల్పించటమే ఈ భాగస్వామ్య ముఖ్య ఉద్దేశమని యూనిసెఫ్​ ప్రకటించింది. డిజిటల్​ ప్రపంచాన్ని సురక్షితంగా పొందేందుకు చిన్నారుల సామర్థ్యాన్ని పెంపొందించటం, చిన్నారులపై జరుగుతున్న హింస, పిల్లలు, కుటుంబాలు, సమాజం మీద దాని ప్రభావంపై అవగాహన కల్పించనున్నట్లు తెలిపింది. అలాగే.. చిన్నారుల హింసపై పోరాడుతున్న​ కార్యకర్తలు​, వివిధ విభాగాలకు నైపుణ్యాభివృద్ధితో సమస్యను మరింత సమర్థవంతంగా అడ్డుకోనున్నట్లు పేర్కొంది. ఈ భాగస్వామ్యంలో దేశవ్యాప్తంగా సామాజిక మాధ్యమాల ప్రచారం సహా.. ఆన్​లైన్​ భద్రత, డిజిటల్​ అక్షరాస్యత, మానసిక సామాజిక మద్దతుపై 1,00,000 మంది పాఠశాల విద్యార్థుల సామర్థ్యం పెంపునకు కృషి చేయనున్నట్లు తెలిపింది యూనిసెఫ్​.

వర్చువల్​గా జరిగిన ఈ కార్యక్రమానికి కేంద్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ సంయుక్త కార్యదర్శి ఆస్తా సక్సేనా, ఫేస్​బుక్​ ప్రతినిధి మధు సిరోహి, యూనిసెఫ్​ ఇండియా డిప్యూటీ ప్రతినిధి యాసుమాసా కిమురా హాజరయ్యారు.

" గత ఏడాదిన్నరలో చిన్నారుల చదువుల కోసం అంతర్జాలం వినియోగంలోకి వచ్చింది. సమయం, భౌగోళిక అండ్డంకులను తొలగించటం ద్వారా.. ఎక్కువ మంది చిన్నారులు వినియోగిస్తున్నారు. ఆన్​లైన్​లో ఉన్న వనరుల ద్వారా నైపుణ్యాలు సంపాదించేందుకు ప్రోత్సహిస్తున్న క్రమంలోనే.. ఆన్​లైన్​ ద్వారా ఎదురయ్యే ముప్పును కూడా మనం గ్రహించాలి. ఆన్​లైన్​, ఆఫ్​లైన్​ ద్వారా ఎదురయ్యే హింసను ఎదుర్కొనే అవకాశాలను కరోనా మహమ్మారి పెంచిందనే చెప్పాలి. చిన్నారులపై జరుగుతున్న హింసను కట్టడి చేసేందుకు ప్రయత్నాలను మనం గుర్తించాలి. అవగాహన కల్పించేందుకు వివిధ వర్గాలకు చెందిన వారు ఏకతాటిపైకి రావటం కీలకం,"- ఆస్తా, సక్సేనా, కేంద్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ సంయుక్త కార్యదర్శి.

ఆన్​లైన్​ ద్వారా ఎదురయ్యే ముప్పు నుంచి చిన్నారులను రక్షించుకోవటం మనందరి బాధ్యతగా పేర్కొన్నారు ఫేస్​బుక్​ ప్రతినిధి సిరోహి. ఈ బాధ్యతను తీవ్రంగా పరిగణించాలని సూచించారు. చిన్నారులకు సురక్షితమైన ఆన్​లైన్​ కోసం కొన్ని సంవత్సరాలుగా తల్లితండ్రులు, ప్రభుత్వాలు, నిపుణులతో కలిసి పని చేస్తున్నట్లు చెప్పారు.

ఇదీ చూడండి: పావు వంతు ఇళ్లకే ఇంటర్నెట్​ సౌకర్యం: యునిసెఫ్​

చిన్నారులపై జరుగుతున్న హింసను కట్టడి చేయటం, ముఖ్యంగా ఆన్​లైన్​ భద్రతపై ప్రత్యేకంగా దృష్టిసారించేందుకు జట్టుకట్టాయి ఐక్యరాజ్య సమితి చిన్న పిల్లల విభాగం.. యూనిసెఫ్​ ఇండియా, ఫేస్​బుక్​. ఈ అంశంపై ఏడాది పాటు కలిసి పనిచేయనున్నాయి.

ఆన్​లైన్​ సహా ఆఫ్​లైన్​లోనూ చిన్నారులకు సురక్షితమైన వాతావరణాన్ని కల్పించటమే ఈ భాగస్వామ్య ముఖ్య ఉద్దేశమని యూనిసెఫ్​ ప్రకటించింది. డిజిటల్​ ప్రపంచాన్ని సురక్షితంగా పొందేందుకు చిన్నారుల సామర్థ్యాన్ని పెంపొందించటం, చిన్నారులపై జరుగుతున్న హింస, పిల్లలు, కుటుంబాలు, సమాజం మీద దాని ప్రభావంపై అవగాహన కల్పించనున్నట్లు తెలిపింది. అలాగే.. చిన్నారుల హింసపై పోరాడుతున్న​ కార్యకర్తలు​, వివిధ విభాగాలకు నైపుణ్యాభివృద్ధితో సమస్యను మరింత సమర్థవంతంగా అడ్డుకోనున్నట్లు పేర్కొంది. ఈ భాగస్వామ్యంలో దేశవ్యాప్తంగా సామాజిక మాధ్యమాల ప్రచారం సహా.. ఆన్​లైన్​ భద్రత, డిజిటల్​ అక్షరాస్యత, మానసిక సామాజిక మద్దతుపై 1,00,000 మంది పాఠశాల విద్యార్థుల సామర్థ్యం పెంపునకు కృషి చేయనున్నట్లు తెలిపింది యూనిసెఫ్​.

వర్చువల్​గా జరిగిన ఈ కార్యక్రమానికి కేంద్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ సంయుక్త కార్యదర్శి ఆస్తా సక్సేనా, ఫేస్​బుక్​ ప్రతినిధి మధు సిరోహి, యూనిసెఫ్​ ఇండియా డిప్యూటీ ప్రతినిధి యాసుమాసా కిమురా హాజరయ్యారు.

" గత ఏడాదిన్నరలో చిన్నారుల చదువుల కోసం అంతర్జాలం వినియోగంలోకి వచ్చింది. సమయం, భౌగోళిక అండ్డంకులను తొలగించటం ద్వారా.. ఎక్కువ మంది చిన్నారులు వినియోగిస్తున్నారు. ఆన్​లైన్​లో ఉన్న వనరుల ద్వారా నైపుణ్యాలు సంపాదించేందుకు ప్రోత్సహిస్తున్న క్రమంలోనే.. ఆన్​లైన్​ ద్వారా ఎదురయ్యే ముప్పును కూడా మనం గ్రహించాలి. ఆన్​లైన్​, ఆఫ్​లైన్​ ద్వారా ఎదురయ్యే హింసను ఎదుర్కొనే అవకాశాలను కరోనా మహమ్మారి పెంచిందనే చెప్పాలి. చిన్నారులపై జరుగుతున్న హింసను కట్టడి చేసేందుకు ప్రయత్నాలను మనం గుర్తించాలి. అవగాహన కల్పించేందుకు వివిధ వర్గాలకు చెందిన వారు ఏకతాటిపైకి రావటం కీలకం,"- ఆస్తా, సక్సేనా, కేంద్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ సంయుక్త కార్యదర్శి.

ఆన్​లైన్​ ద్వారా ఎదురయ్యే ముప్పు నుంచి చిన్నారులను రక్షించుకోవటం మనందరి బాధ్యతగా పేర్కొన్నారు ఫేస్​బుక్​ ప్రతినిధి సిరోహి. ఈ బాధ్యతను తీవ్రంగా పరిగణించాలని సూచించారు. చిన్నారులకు సురక్షితమైన ఆన్​లైన్​ కోసం కొన్ని సంవత్సరాలుగా తల్లితండ్రులు, ప్రభుత్వాలు, నిపుణులతో కలిసి పని చేస్తున్నట్లు చెప్పారు.

ఇదీ చూడండి: పావు వంతు ఇళ్లకే ఇంటర్నెట్​ సౌకర్యం: యునిసెఫ్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.