ETV Bharat / bharat

కట్నంగా ఆక్సిజన్​ కాన్సన్​ట్రేటర్లు- వధూవరుల కీలక నిర్ణయం!

author img

By

Published : Jul 5, 2021, 1:12 PM IST

మధ్యప్రదేశ్​లోని ఉజ్జయిని​కి చెందిన ఓ కుటుంబం తమ కుమార్తె వివాహం సందర్భంగా వరుడికి వినూత్న కట్నం ఇచ్చింది. ప్రస్తుత కొవిడ్​ మహమ్మారి సమయంలో అత్యవసరంగా మారిన ఆక్సిజన్​ కాన్సన్​ట్రేటర్లను అందించింది.

oxygen concentrator dowry ujjain, కట్నంగా ఆక్సిజన్ కాన్సెన్​ట్రేటర్లు
కట్నంగా ఆక్సిజన్​ కాన్సెన్​ట్రేటర్లు!
కట్నంగా ఆక్సిజన్​ కాన్సెన్​ట్రేటర్లు!

కొవిడ్​ మహమ్మారి కారణంగా ఆక్సిజన్​ ఎంత ముఖ్యమో ప్రతిఒక్కరికి అర్థమైంది. ఈ నేపథ్యంలో మధ్యప్రదేశ్​లోని ఉజ్జయినికి చెందిన ఓ కుటుంబం వినూత్నంగా ఆలోచించింది. తమ కూతురు పెళ్లిలో వరుడికి కట్నంగా రెండు ఆక్సిజన్​ కాన్సన్​ట్రేటర్లను అందించింది. కట్నంగా అందిన ఆ కాన్సన్​ట్రేటర్లను అవసరమైన వారికి ఉచితంగా అందిస్తామని ప్రతిజ్ఞ చేశారు వధూవరులు.

ఉజ్జయినిలో సేవాధామ్​ అనే ఆశ్రమం స్థాపించి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు సుధీర్​ గోయల్​. తన కుమార్తె వివాహాన్ని కూడా తన సేవా కార్యక్రమాలకు వేదికగా చేయాలనుకున్నారు. తనకు వచ్చిన ఆలోచనను ఆచరణలో పెట్టారు. వరుడుకి ఎనిమిది హామీలు ఇచ్చారు. అందులో రెండు ఆక్సిజన్​ కాన్సన్​ట్రేటర్లు సైతం ఇస్తానని తెలిపారు గోయల్​.

హామీలో భాగంగా పెళ్లి మండపంలోనే కట్నంగా రూ.1.40 లక్షలు విలువ చేసే రెండు ఆక్సిజన్​ కాన్సెన్​ట్రేటర్లను అందించారు.

కరోనా విజృంభిస్తున్న వేళ గోయల్​ కుటుంబం చేపట్టిన ఈ చర్యకు అక్కడి వారు హర్షం వ్యక్తం చేశారు.

ఇదీ చదవండి : కేరళ డ్రైవర్​కు రూ. 40కోట్ల జాక్​పాట్​

కట్నంగా ఆక్సిజన్​ కాన్సెన్​ట్రేటర్లు!

కొవిడ్​ మహమ్మారి కారణంగా ఆక్సిజన్​ ఎంత ముఖ్యమో ప్రతిఒక్కరికి అర్థమైంది. ఈ నేపథ్యంలో మధ్యప్రదేశ్​లోని ఉజ్జయినికి చెందిన ఓ కుటుంబం వినూత్నంగా ఆలోచించింది. తమ కూతురు పెళ్లిలో వరుడికి కట్నంగా రెండు ఆక్సిజన్​ కాన్సన్​ట్రేటర్లను అందించింది. కట్నంగా అందిన ఆ కాన్సన్​ట్రేటర్లను అవసరమైన వారికి ఉచితంగా అందిస్తామని ప్రతిజ్ఞ చేశారు వధూవరులు.

ఉజ్జయినిలో సేవాధామ్​ అనే ఆశ్రమం స్థాపించి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు సుధీర్​ గోయల్​. తన కుమార్తె వివాహాన్ని కూడా తన సేవా కార్యక్రమాలకు వేదికగా చేయాలనుకున్నారు. తనకు వచ్చిన ఆలోచనను ఆచరణలో పెట్టారు. వరుడుకి ఎనిమిది హామీలు ఇచ్చారు. అందులో రెండు ఆక్సిజన్​ కాన్సన్​ట్రేటర్లు సైతం ఇస్తానని తెలిపారు గోయల్​.

హామీలో భాగంగా పెళ్లి మండపంలోనే కట్నంగా రూ.1.40 లక్షలు విలువ చేసే రెండు ఆక్సిజన్​ కాన్సెన్​ట్రేటర్లను అందించారు.

కరోనా విజృంభిస్తున్న వేళ గోయల్​ కుటుంబం చేపట్టిన ఈ చర్యకు అక్కడి వారు హర్షం వ్యక్తం చేశారు.

ఇదీ చదవండి : కేరళ డ్రైవర్​కు రూ. 40కోట్ల జాక్​పాట్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.