ETV Bharat / bharat

వాజేను 'మహా' సర్కారే​ కాపాడుతోంది: ఫడణవీస్

author img

By

Published : Mar 17, 2021, 9:05 PM IST

ప్రముఖ వ్యాపారవేత్త ముకేశ్​ అంబానీ ఇంటి వద్ద పేలుడు పదార్థాల కేసులో పోలీసు అధికారి సచిన్​ వాజేను మహారాష్ట్ర ప్రభుత్వం కాపాడుతోందని.. ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్​ ఆరోపించారు. తాను సీఎంగా ఉన్నప్పుడు.. సస్పెన్షన్​కు గురైన సచిన్​ వాజేను మళ్లీ పదవిలో నియమించాలని శివసేన తనపై ఒత్తిడి తెచ్చిందని అన్నారు.

Uddhav had asked me to reinstate Waze when I was CM: Fadnavis
'సచిన్​ వాజేను మహరాష్ర సర్కార్​ కాపాడుతోంది'

అంబానీ ఇంటి వద్ద పేలుడు పదార్థాల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న పోలీసు అధికారి సచిన్‌ వాజేను మహారాష్ట్ర ప్రభుత్వం కాపాడుతోందని ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, భాజపా నేత దేవేంద్ర ఫడణవీస్‌ ఆరోపించారు. సస్పెన్షన్​కు గురైన వాజేకు తిరిగి పదవిని కేటాయించాలని 2018లో శివసేన తనపై ఒత్తిడి తెచ్చిందని అన్నారు.

"2018లో నేను మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా, హోం మంత్రిగా విధులు నిర్వర్తిస్తున్నప్పుడు.. శివసేన అధినేత ఉద్ధవ్​ ఠాక్రే.. నా వద్దకు వచ్చి, సచిన్​ వాజేకు పదవి తిరిగివ్వాలని కోరారు. శివసేన పార్టీకి చెందిన కొందరు మంత్రులు కూడా ఇదే విధంగా అభ్యర్థించారు. ఆ ప్రతిపాదన వచ్చినప్పుడు నేను అడ్వకేట్ జనరల్​ సలహా తీసుకున్నాను. బాంబే హైకోర్టు ఉత్తర్వుల ప్రకారం.. వాజేను సస్పెండ్​ చేసినందున ఆయనకు తిరిగి పోస్టింగ్​ ఇవ్వలేనని తేల్చి చెప్పాను.''

- దేవేంద్ర ఫడణవీస్​, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి

బాంబే హైకోర్టు ఉత్తర్వులు ఉన్నప్పటికీ.. సచిన్‌ వాజేను శివసేన ప్రభుత్వం మళ్లీ ఎందుకు నియమించిందని ఫడణవీస్​ ప్రశ్నించారు.

సచిన్​ వాజేను ఎన్​ఐఏ శనివారం అరెస్ట్​ చేసింది. ఎన్​ఐఏ ప్రత్యేక న్యాయస్థానం మార్చి 25 వరకు వాజేకు రిమాండ్​ విధించింది. పేలుడు పదార్థాలకు సంబంధించిన కేసులో.. పీపీఈ కిట్​ ధరించి, సీసీటీవీ కెమెరాలో చిక్కిన వ్యక్తి పోలీసు అధికారి సచిన్​ వాజేనే అని ఎన్​ఐఏ స్పష్టం చేసింది.

ఇదీ చూడండి:'అంబానీ ఇంటి వద్ద బాంబు'పై ఎన్​ఐఏ దర్యాప్తు

అంబానీ ఇంటి వద్ద పేలుడు పదార్థాల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న పోలీసు అధికారి సచిన్‌ వాజేను మహారాష్ట్ర ప్రభుత్వం కాపాడుతోందని ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, భాజపా నేత దేవేంద్ర ఫడణవీస్‌ ఆరోపించారు. సస్పెన్షన్​కు గురైన వాజేకు తిరిగి పదవిని కేటాయించాలని 2018లో శివసేన తనపై ఒత్తిడి తెచ్చిందని అన్నారు.

"2018లో నేను మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా, హోం మంత్రిగా విధులు నిర్వర్తిస్తున్నప్పుడు.. శివసేన అధినేత ఉద్ధవ్​ ఠాక్రే.. నా వద్దకు వచ్చి, సచిన్​ వాజేకు పదవి తిరిగివ్వాలని కోరారు. శివసేన పార్టీకి చెందిన కొందరు మంత్రులు కూడా ఇదే విధంగా అభ్యర్థించారు. ఆ ప్రతిపాదన వచ్చినప్పుడు నేను అడ్వకేట్ జనరల్​ సలహా తీసుకున్నాను. బాంబే హైకోర్టు ఉత్తర్వుల ప్రకారం.. వాజేను సస్పెండ్​ చేసినందున ఆయనకు తిరిగి పోస్టింగ్​ ఇవ్వలేనని తేల్చి చెప్పాను.''

- దేవేంద్ర ఫడణవీస్​, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి

బాంబే హైకోర్టు ఉత్తర్వులు ఉన్నప్పటికీ.. సచిన్‌ వాజేను శివసేన ప్రభుత్వం మళ్లీ ఎందుకు నియమించిందని ఫడణవీస్​ ప్రశ్నించారు.

సచిన్​ వాజేను ఎన్​ఐఏ శనివారం అరెస్ట్​ చేసింది. ఎన్​ఐఏ ప్రత్యేక న్యాయస్థానం మార్చి 25 వరకు వాజేకు రిమాండ్​ విధించింది. పేలుడు పదార్థాలకు సంబంధించిన కేసులో.. పీపీఈ కిట్​ ధరించి, సీసీటీవీ కెమెరాలో చిక్కిన వ్యక్తి పోలీసు అధికారి సచిన్​ వాజేనే అని ఎన్​ఐఏ స్పష్టం చేసింది.

ఇదీ చూడండి:'అంబానీ ఇంటి వద్ద బాంబు'పై ఎన్​ఐఏ దర్యాప్తు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.