ETV Bharat / bharat

వేర్వేరు ఎన్​కౌంటర్లలో నలుగురు మావోయిస్టులు మృతి - మధ్య ప్రదేశ్ మండ్లాలో ఎన్​కౌంటర్

మధ్యప్రదేశ్ మండ్ల జిల్లా మోతినాల ప్రాంతంలో జరిగిన ఎన్​కౌంటర్​లో ఇద్దరు మావోయిస్టులను పోలీసులు హతమార్చారు. శుక్రవారం అర్ధరాత్రి దాదాపు నాలుగు గంటలపాటు పోలీసులకు, నక్సలైట్లకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. మరో ప్రాంతంలో ఇద్దరు మహిళా నక్సలైట్లు మృతిచెందారు.

two-naxalites-died-in-encounter-in-mandla
మండ్లలో ఎన్​కౌంటర్​- ఇద్దరు మావోయిస్టులు మృతి
author img

By

Published : Feb 13, 2021, 12:42 PM IST

మధ్యప్రదేశ్ మండ్ల జిల్లా మోతినాల లాల్​పుర్ గ్రామ పరిధిలో శుక్రవారం అర్ధరాత్రి జరిగిన ఎన్​కౌంటర్​లో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందారు. మృతుల్లో ఒక మహిళా నక్సలైట్​ ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఇరువర్గాల మధ్య దాదాపు 4 గంటల పాటు కాల్పులు జరిగాయి.

బాలాఘాట్​లో..

అంతకుముందు బాలాఘాట్ జిల్లా కిర్నాపుర్ పోలీస్​ స్టేషన్ పరిధిలో బోర్వాన్​ అటవీ ప్రాంతంలోనూ ఎన్​కౌంటర్ జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు మహిళా మావోయిస్టులను పోలీసులు హతమార్చారు. వారి నుంచి 12 రైఫిల్స్, ఇతర మందు గుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. ఈ మహిళా మావోయిస్టులపై 20 లక్షల రివార్డు ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

మధ్యప్రదేశ్ మండ్ల జిల్లా మోతినాల లాల్​పుర్ గ్రామ పరిధిలో శుక్రవారం అర్ధరాత్రి జరిగిన ఎన్​కౌంటర్​లో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందారు. మృతుల్లో ఒక మహిళా నక్సలైట్​ ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఇరువర్గాల మధ్య దాదాపు 4 గంటల పాటు కాల్పులు జరిగాయి.

బాలాఘాట్​లో..

అంతకుముందు బాలాఘాట్ జిల్లా కిర్నాపుర్ పోలీస్​ స్టేషన్ పరిధిలో బోర్వాన్​ అటవీ ప్రాంతంలోనూ ఎన్​కౌంటర్ జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు మహిళా మావోయిస్టులను పోలీసులు హతమార్చారు. వారి నుంచి 12 రైఫిల్స్, ఇతర మందు గుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. ఈ మహిళా మావోయిస్టులపై 20 లక్షల రివార్డు ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.