himachal pradesh boys marriage: హిమాచల్ప్రదేశ్లో వింత వివాహం జరిగింది. ఉనా నగరంలో ఇద్దరు అబ్బాయిలు పెళ్లి చేసుకున్నారు. ఉత్తరాఖండ్కు చెందిన అబ్బాయికి స్థానిక యువకుడు(24) తాళి కట్టాడు. ఆ రాష్ట్రంలో అబ్బాయిలు ఇద్దరు పెళ్లి చేసుకోవడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. ఈ విషయం ఆనోటా ఈనోటా వెళ్లి.. పోలీసుల వద్దకు చేరింది. అయితే, దీనిపై ఏ విధంగా ముందుకెళ్లాలని పోలీసులు మదనపడుతున్నారు.
ఉనాకు చెందిన యువకుడు.. తన తమ్ముడితో కలిసి ఉంటున్నాడు. కొద్దిరోజుల క్రితం ఉత్తరాఖండ్ నుంచి ఓ యువకుడు వచ్చి వీరితో కలిశాడు. అయితే, వీరిద్దరి మధ్య ఉన్న అనుబంధం చూసి అనుమానించిన యువకుడి తమ్ముడు.. కుటుంబ సభ్యులకు విషయం చెప్పాడు. దీంతో కుటుంబ సభ్యులు.. ఈ విషయంపై గొడవ చేశారు. తమ కుమారుడికి ఓ యువతితో పెళ్లి చేయాలని నిర్ణయించారు. వెంటనే యువకులు ఇద్దరూ పోలీసులను ఆశ్రయించారు.
ఏడాదిన్నర క్రితమే వివాహం: ఫేస్బుక్ ద్వారా యువకులిద్దరికీ పరిచయం ఏర్పడింది. ఈ పరిచయమే క్రమంగా ప్రేమగా మారింది. దీంతో ఏడాదిన్నర క్రితం వివాహం చేసుకున్నారు. దిల్లీలోని ఓ గుడిలో పెళ్లి చేసుకున్నట్లు యువకులు తెలిపారు. అనంతరం ఉనాకు చెందిన యువకుడు తన ఇంటికి వెళ్లిపోయాడు. ఆ తర్వాత కొద్దిరోజులకు ఉత్తరాఖండ్ యువకుడు.. హిమాచల్లోని ఉనాకు చేరుకున్నాడు.
ఈ విషయం ఇప్పుడు పోలీసులకు తలనొప్పిగా మారింది. యువకులు తమను ఆశ్రయించిన నేపథ్యంలో ఏం చేయాలో తోచక పోలీసులు తలలు పట్టుకున్నారు. ఇద్దరం కలిసే ఉంటామని యువకులు చెబుతున్నారని స్థానిక పోలీసు అవుట్పోస్ట్ ఇంఛార్జ్ జగ్వీర్ సింగ్ తెలిపారు. యువకుల తల్లిదండ్రులను పిలిచి మాట్లాడనున్నట్లు చెప్పారు. వారితో చర్చించిన తర్వాతే ఈ విషయంపై ముందుకు వెళ్లగలమని అన్నారు.
ఇదీ చదవండి:
ధగధగలాడే 'గోల్డ్ మాస్క్'.. ధర ఎంతంటే...
గుజరాత్లోనూ బుల్డోజర్లు.. అల్లర్లు జరిగిన ప్రాంతాల్లో కూల్చివేతలు