ETV Bharat / bharat

ట్విట్టర్ వరుస వివాదాలు- పొరపాట్లా? కవ్వింపులా?

author img

By

Published : Jun 28, 2021, 4:16 PM IST

Updated : Jun 28, 2021, 10:03 PM IST

నూతన ఐటీ నిబంధనల విషయంలో భారత ప్రభుత్వంతో.. వివాదాన్ని కొనసాగిస్తున్న ట్విట్టర్​.. సోమవారం మరో విపరీత చర్యకు పాల్పడింది. భారత్​లో అంతర్భాగమైన జమ్మకశ్మీర్​, లద్దాఖ్​ ప్రాంతాన్ని ప్రత్యేక దేశంగా చూపించింది. ఉపరాష్ట్రపతి వెంకయ్య వ్యక్తిగత ఖాతాకు బ్లూటిక్ విషయంలో గందరగోళం, కేంద్ర ఐటీ శాఖ మంత్రి రవిశంకర్​ ప్రసాద్​ ఖాతా తాత్కాలికంగా నిలిపివేత వంటి పరిణామాల నేపథ్యంలో ట్విట్టర్ తీరు సర్వత్రా చర్చనీయాంశమైంది.

twitter vs center
కేంద్ర ప్రభుత్వం వర్సెస్​ ట్విట్టర్​

నూతన ఐటీ చట్టాలపై కేంద్రానికి, సామాజిక మాధ్యమం ట్విట్టర్​కు మధ్య విభేదాలు కొనసాగుతున్న తరుణంలో.. సోమవారం ట్విట్టర్​ మరో కవ్వింపు చర్యకు పాల్పడింది. భారత్​ మ్యాప్​ను మరోసారి వక్రీకరించి చూపించింది ఆ సంస్థ. భారత్​లో అంతర్భాగమైన జమ్మకశ్మీర్​, లద్దాఖ్​ను ప్రత్యేక దేశంగా తన వెబ్​సైట్​లో చూపించటం..​ వివాదాస్పదంగా మారింది.

అసలింతకీ.. అమెరికాలో అధికారిక కార్యాలయం ఉన్న ఈ మైక్రోబ్లాగింగ్​ ప్లాట్​ఫామ్​కు.. భారత ప్రభుత్వానికి మధ్య పేచీ ఎక్కడ మొదలైంది? ట్విట్టర్​పై కేంద్రం తీసుకున్న చర్యలేంటి?

మొదటి నుంచి ససేమిరానే..

సామాజిక మాధ్యమాలపై నియంత్రణ పేరుతో.. మే 26 నుంచి కేంద్రం ప్రభుత్వం నూతన ఐటీ నిబంధనలను అమల్లోకి తెచ్చింది. దీని ప్రకారం.. నోడల్, గ్రీవెన్స్​, చీఫ్​​ కంప్లయన్స్​ అధికారిని 50 లక్షల ఫాలోవర్స్​ దాటిన అన్ని సామాజిక మాధ్యమాలు నియమించాలి. అయితే.. మిగతా సామాజిక మాధ్యమాలన్నీ ఈ నిబంధనలు పాటించేందుకు ముందుకురాగా.. ట్విట్టర్​ మాత్రం మొదటి నుంచి ససేమిరా అంటూనే ఉంది.

ఈ విషయంలో ట్విట్టర్​కు కేంద్రం ఎన్నోసార్లు నోటీసులు పంపింది. అయినా.. కేంద్రం మాటలను ఆ సంస్థ వినిపించుకోనేలేదు. ఆఖరి హెచ్చరికగా జూన్​ 5న మరోసారి నోటీసులు పంపుతూ.. నూతన డిజిటల్ నిబంధనలు పాటించకుంటే తీవ్రమైన పరిణామాలు ఉంటాయని హెచ్చరించింది కేంద్రం. ఐటీ, ఇతర చట్టాల ప్రకారం సంస్థపై చర్యలు తీసుకుంటామని తేల్చి చెప్పింది.

హెచ్చరికల ఫలితంగా..

కేంద్రం పంపిన తుది హెచ్చరికల ఫలితంగా ట్విట్టర్​ దిగొచ్చింది. ప్రభుత్వం తీసుకువచ్చిన కొత్త నిబంధనలను పాటించేందుకు సిద్ధమేనని.. అయితే, వాటి అమలుకు మరికొంత సమయం కావాలని కోరింది. ఈ క్రమంలోనే.. ట్విట్టర్​కు ఇన్​ఫర్మేషన్​ అండ్ టెక్నాలజీ విభాగ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సమన్లు జారీ చేసింది. జూన్​ 18న సాయంత్రం 4లోపు తమ ఎదుట హాజరు కావాలని ఆదేశించింది.

ఈ పరిస్థితుల్లో స్పందించిన ట్విట్టర్​.. ట్వీట్ల పరంగా తమకు వచ్చే ఫిర్యాదుల పరిశీలనకు సంధానకర్తగా ఓ అధికారిని నియమించినట్లు జూన్ ​16న వెల్లడించింది. అయితే.. అదే రోజు ట్విట్టర్​కు కేంద్రం షాక్ ఇచ్చింది. నూతన నిబంధనలు పాటించని కారణంగా ట్విట్టర్​ మధ్యవర్తిత్వ వేదిక హోదాను కోల్పోయినట్లు ప్రకటించింది.

ఏమిటీ మధ్యవర్తిత్వ హోదా?

ఈ హోదా వల్ల.. సోషల్‌ మీడియాలో ఎవరైనా అభ్యంతరకర సమాచారం పెట్టినా.. దాన్ని తమ వేదికగా ప్రచారం చేసినా.. ఆ సంస్థకు ఏమీ కాదు. కేవలం పోస్టు పెట్టిన వారిపై మాత్రమే చర్యలు తీసుకునేవారు. అంటే యూజర్లకు మధ్యవర్తులుగానే ఈ ప్లాట్​ఫామ్​లను చూస్తారు. కానీ మధ్యవర్తి హోదా రద్దయితే ఆయా సోషల్‌ మీడియా సంస్థలు కూడా క్రిమినల్‌ చర్యలు ఎదుర్కోవటానికి ఆస్కారం ఉంటుంది.

ట్విట్టర్​పై యూపీ కేసు...

ఉత్తర్​ప్రదేశ్​కు చెందిన ఓ ముస్లిం వృద్ధుడిపై దాడి ఘటనకు సంబంధించి ట్విట్టర్​ ఇండియా ఎండీ మనీష్ మహేశ్వరికి యూపీలోని గాజియాబాద్ పోలీసులు నోటీసులు జారీచేశారు. మతవిద్వేషాలు రెచ్చగొట్టేందుకు కొంతమంది ట్విట్టర్​ను ఉపయోగించుకున్నారని తెలిపారు. యూపీ కేసుపై వారం రోజుల్లో వివరణ ఇవ్వాలని ఆదేశించారు.

అయితే.. ఈ కేసులో యూపీ పోలీసుల నోటీసులపై కర్ణాటక హైకోర్టును ఆశ్రయించారు మనీశ్​​ మహేశ్వరి. దీనిపై విచారించిన న్యాయస్థానం.. యూపీ పోలీసులు చర్యలు తీసుకోవద్దని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.

దేశచట్టాలే అత్యుత్తమైనవి...

పార్లమెంటరీ స్థాయి సంఘం పిలుపు మేరకు జూన్ 18న ట్విట్టర్​ సంస్థ ప్రతినిధులు.. హాజరయ్యారు. కొత్త నిబంధనలను ట్విట్టర్ ఇంకా పాటించకపోడాన్ని కాంగ్రెస్​ నేత శశి థరూర్​ నేతృత్వంలోని స్థాయీ సంఘం సభ్యులు తీవ్రంగా తప్పుబట్టింది. దేశ చట్టాలే అత్యత్తమైనవి తప్ప, సంస్థ విధివిధానాలు కాదని ట్విట్టర్​కు పార్లమెంటు సభ్యులు స్పష్టం చేశారు.

ఐటీ మంత్రి ఖాతానే బ్లాక్​...

ఈ విభేదాలు ఇంకా కొనసాగుతున్న తరుణంలోనే.. కేంద్ర ఐటీ శాఖ మంత్రి రవిశంకర్​ ప్రసాద్​కు శుక్రవారం ట్విట్టర్ షాక్​ ఇచ్చింది. అమెరికన్​ మిలీనియం కాపీరైట్​ చట్టాన్ని(డీఎంసీఏ) ఉల్లంఘించారని పేర్కొంటూ ఆయన ఖాతాను ట్విట్టర్​ నిలిపివేయడం సంచలనం రేపింది.

సొంత అజెండా కోసమే..

ముందస్తు నోటీసు ఇవ్వకుండా.. ఖాతాను నిలిపివేయటంపై రవిశంకర్​ ప్రసాద్ మండిపడ్డారు. "భావ ప్రకటన స్వేచ్ఛకు దూతగా చెప్పుకుంటూ తన సొంత అజెండాను అమలు చేసేందుకే ఆసక్తి చూపుతున్నట్లు ట్విట్టర్​ చర్యతో స్పష్టమైంది. వారి గీతను దాటింతే ఖాతాను ఏకపక్షంగా తొలగిస్తామని హెచ్చరికలు చేస్తున్నారు." అంటూ విరుచుకుపడ్డారు. ఐటీ నిబంధనలపై కేంద్రం రాజీపడే ప్రసక్తే లేదన్నారు. ఏ సామాజిక మధ్యమమైనా చట్టాన్ని అమలు చేయాల్సిందేనని స్పష్టం చేశారు.

ఐటీ మంత్రి ఖాతాను నిలిపివేసినట్లుగానే.. ఐటీ పార్లమెంటరీ స్థాయీ సంఘం ఛైర్మన్​ శశిథరూర్​ ఖాతాను కూడా ట్విట్టర్​ తాత్కాలికంగా నిలిపివేసింది. అయితే.. దీనిపై వివరణ ఇవ్వాలని ట్విట్టర్​ను తాము కోరతామని ఆయన చెప్పారు.

గ్రీవెన్స్​ అధికారి గుడ్​బై..

ఇదే క్రమంలో.. ట్విట్టర్ ఇండియా తాత్కాలిక రెసిడెంట్‌ గ్రీవెన్స్‌ అధికారి తన పదవికి గుడ్‌బై చెప్పారు. నూతన ఐటీ నిబంధనలకు అనుగుణంగా ఇటీవలే నియమితులైన ధర్మేంద్ర చతుర్‌ ఆ పదవి నుంచి వైదొలిగారు. అందుకు గల కారణాలు తెలియరాలేదు. దీనిపై స్పందించేందుకు ట్విట్టర్ సైతం నిరాకరించింది. ట్విట్టర్​కు, భారత ప్రభుత్వానికి మధ్య విభేదాలు నెలకొన్న తరుణంలో ఆయన రాజీనామా చర్చనీయాంశంగా మారింది.

ఏకంగా భారత పటాన్నే..

అంతటితో ఆగకుండా.. మరో వివాదాస్పద చర్యకు ట్విట్టర్ సోమవారం పాల్పడింది. భారతదేశ చిత్ర పటాన్ని మరోసారి వక్రీకరించింది. జమ్ముకశ్మీర్, లద్దాఖ్​ను తన వెబ్​సైట్​లో ప్రత్యేక దేశంగా చూపించింది. దీనిపై నెటిజన్లు తీవ్రంగా మండిపడ్డారు. ట్విట్టర్​కు వ్యతిరేకంగా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

భారత్ మ్యాప్​ను తప్పుగా చూపటం ట్విట్టర్​కు ఇదే మొదటిసారి కాదు. గతేడాది కూడా లేహ్​ ప్రాంతాన్ని చైనా మ్యాప్​లో చూపించి విమర్శలు మూటగట్టుకుంది. ఆ సమయంలో ట్విట్టర్​కు ప్రభుత్వం తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. దేశ సార్వభౌమత్వానికి భంగం కలిగించేలా ప్రవర్తిస్తే చర్యలు తప్పవని హెచ్చరించింది.

ఈ తరుణంలో మరోసారి అలాంటి చర్యకే పాల్పడిన ట్విట్టర్​పై కేంద్రం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో వేచి చూడాలి.

ఇదీ చూడండి: 'ఐటీ నిబంధనలపై స్టే ఇవ్వలేం'

నూతన ఐటీ చట్టాలపై కేంద్రానికి, సామాజిక మాధ్యమం ట్విట్టర్​కు మధ్య విభేదాలు కొనసాగుతున్న తరుణంలో.. సోమవారం ట్విట్టర్​ మరో కవ్వింపు చర్యకు పాల్పడింది. భారత్​ మ్యాప్​ను మరోసారి వక్రీకరించి చూపించింది ఆ సంస్థ. భారత్​లో అంతర్భాగమైన జమ్మకశ్మీర్​, లద్దాఖ్​ను ప్రత్యేక దేశంగా తన వెబ్​సైట్​లో చూపించటం..​ వివాదాస్పదంగా మారింది.

అసలింతకీ.. అమెరికాలో అధికారిక కార్యాలయం ఉన్న ఈ మైక్రోబ్లాగింగ్​ ప్లాట్​ఫామ్​కు.. భారత ప్రభుత్వానికి మధ్య పేచీ ఎక్కడ మొదలైంది? ట్విట్టర్​పై కేంద్రం తీసుకున్న చర్యలేంటి?

మొదటి నుంచి ససేమిరానే..

సామాజిక మాధ్యమాలపై నియంత్రణ పేరుతో.. మే 26 నుంచి కేంద్రం ప్రభుత్వం నూతన ఐటీ నిబంధనలను అమల్లోకి తెచ్చింది. దీని ప్రకారం.. నోడల్, గ్రీవెన్స్​, చీఫ్​​ కంప్లయన్స్​ అధికారిని 50 లక్షల ఫాలోవర్స్​ దాటిన అన్ని సామాజిక మాధ్యమాలు నియమించాలి. అయితే.. మిగతా సామాజిక మాధ్యమాలన్నీ ఈ నిబంధనలు పాటించేందుకు ముందుకురాగా.. ట్విట్టర్​ మాత్రం మొదటి నుంచి ససేమిరా అంటూనే ఉంది.

ఈ విషయంలో ట్విట్టర్​కు కేంద్రం ఎన్నోసార్లు నోటీసులు పంపింది. అయినా.. కేంద్రం మాటలను ఆ సంస్థ వినిపించుకోనేలేదు. ఆఖరి హెచ్చరికగా జూన్​ 5న మరోసారి నోటీసులు పంపుతూ.. నూతన డిజిటల్ నిబంధనలు పాటించకుంటే తీవ్రమైన పరిణామాలు ఉంటాయని హెచ్చరించింది కేంద్రం. ఐటీ, ఇతర చట్టాల ప్రకారం సంస్థపై చర్యలు తీసుకుంటామని తేల్చి చెప్పింది.

హెచ్చరికల ఫలితంగా..

కేంద్రం పంపిన తుది హెచ్చరికల ఫలితంగా ట్విట్టర్​ దిగొచ్చింది. ప్రభుత్వం తీసుకువచ్చిన కొత్త నిబంధనలను పాటించేందుకు సిద్ధమేనని.. అయితే, వాటి అమలుకు మరికొంత సమయం కావాలని కోరింది. ఈ క్రమంలోనే.. ట్విట్టర్​కు ఇన్​ఫర్మేషన్​ అండ్ టెక్నాలజీ విభాగ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సమన్లు జారీ చేసింది. జూన్​ 18న సాయంత్రం 4లోపు తమ ఎదుట హాజరు కావాలని ఆదేశించింది.

ఈ పరిస్థితుల్లో స్పందించిన ట్విట్టర్​.. ట్వీట్ల పరంగా తమకు వచ్చే ఫిర్యాదుల పరిశీలనకు సంధానకర్తగా ఓ అధికారిని నియమించినట్లు జూన్ ​16న వెల్లడించింది. అయితే.. అదే రోజు ట్విట్టర్​కు కేంద్రం షాక్ ఇచ్చింది. నూతన నిబంధనలు పాటించని కారణంగా ట్విట్టర్​ మధ్యవర్తిత్వ వేదిక హోదాను కోల్పోయినట్లు ప్రకటించింది.

ఏమిటీ మధ్యవర్తిత్వ హోదా?

ఈ హోదా వల్ల.. సోషల్‌ మీడియాలో ఎవరైనా అభ్యంతరకర సమాచారం పెట్టినా.. దాన్ని తమ వేదికగా ప్రచారం చేసినా.. ఆ సంస్థకు ఏమీ కాదు. కేవలం పోస్టు పెట్టిన వారిపై మాత్రమే చర్యలు తీసుకునేవారు. అంటే యూజర్లకు మధ్యవర్తులుగానే ఈ ప్లాట్​ఫామ్​లను చూస్తారు. కానీ మధ్యవర్తి హోదా రద్దయితే ఆయా సోషల్‌ మీడియా సంస్థలు కూడా క్రిమినల్‌ చర్యలు ఎదుర్కోవటానికి ఆస్కారం ఉంటుంది.

ట్విట్టర్​పై యూపీ కేసు...

ఉత్తర్​ప్రదేశ్​కు చెందిన ఓ ముస్లిం వృద్ధుడిపై దాడి ఘటనకు సంబంధించి ట్విట్టర్​ ఇండియా ఎండీ మనీష్ మహేశ్వరికి యూపీలోని గాజియాబాద్ పోలీసులు నోటీసులు జారీచేశారు. మతవిద్వేషాలు రెచ్చగొట్టేందుకు కొంతమంది ట్విట్టర్​ను ఉపయోగించుకున్నారని తెలిపారు. యూపీ కేసుపై వారం రోజుల్లో వివరణ ఇవ్వాలని ఆదేశించారు.

అయితే.. ఈ కేసులో యూపీ పోలీసుల నోటీసులపై కర్ణాటక హైకోర్టును ఆశ్రయించారు మనీశ్​​ మహేశ్వరి. దీనిపై విచారించిన న్యాయస్థానం.. యూపీ పోలీసులు చర్యలు తీసుకోవద్దని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.

దేశచట్టాలే అత్యుత్తమైనవి...

పార్లమెంటరీ స్థాయి సంఘం పిలుపు మేరకు జూన్ 18న ట్విట్టర్​ సంస్థ ప్రతినిధులు.. హాజరయ్యారు. కొత్త నిబంధనలను ట్విట్టర్ ఇంకా పాటించకపోడాన్ని కాంగ్రెస్​ నేత శశి థరూర్​ నేతృత్వంలోని స్థాయీ సంఘం సభ్యులు తీవ్రంగా తప్పుబట్టింది. దేశ చట్టాలే అత్యత్తమైనవి తప్ప, సంస్థ విధివిధానాలు కాదని ట్విట్టర్​కు పార్లమెంటు సభ్యులు స్పష్టం చేశారు.

ఐటీ మంత్రి ఖాతానే బ్లాక్​...

ఈ విభేదాలు ఇంకా కొనసాగుతున్న తరుణంలోనే.. కేంద్ర ఐటీ శాఖ మంత్రి రవిశంకర్​ ప్రసాద్​కు శుక్రవారం ట్విట్టర్ షాక్​ ఇచ్చింది. అమెరికన్​ మిలీనియం కాపీరైట్​ చట్టాన్ని(డీఎంసీఏ) ఉల్లంఘించారని పేర్కొంటూ ఆయన ఖాతాను ట్విట్టర్​ నిలిపివేయడం సంచలనం రేపింది.

సొంత అజెండా కోసమే..

ముందస్తు నోటీసు ఇవ్వకుండా.. ఖాతాను నిలిపివేయటంపై రవిశంకర్​ ప్రసాద్ మండిపడ్డారు. "భావ ప్రకటన స్వేచ్ఛకు దూతగా చెప్పుకుంటూ తన సొంత అజెండాను అమలు చేసేందుకే ఆసక్తి చూపుతున్నట్లు ట్విట్టర్​ చర్యతో స్పష్టమైంది. వారి గీతను దాటింతే ఖాతాను ఏకపక్షంగా తొలగిస్తామని హెచ్చరికలు చేస్తున్నారు." అంటూ విరుచుకుపడ్డారు. ఐటీ నిబంధనలపై కేంద్రం రాజీపడే ప్రసక్తే లేదన్నారు. ఏ సామాజిక మధ్యమమైనా చట్టాన్ని అమలు చేయాల్సిందేనని స్పష్టం చేశారు.

ఐటీ మంత్రి ఖాతాను నిలిపివేసినట్లుగానే.. ఐటీ పార్లమెంటరీ స్థాయీ సంఘం ఛైర్మన్​ శశిథరూర్​ ఖాతాను కూడా ట్విట్టర్​ తాత్కాలికంగా నిలిపివేసింది. అయితే.. దీనిపై వివరణ ఇవ్వాలని ట్విట్టర్​ను తాము కోరతామని ఆయన చెప్పారు.

గ్రీవెన్స్​ అధికారి గుడ్​బై..

ఇదే క్రమంలో.. ట్విట్టర్ ఇండియా తాత్కాలిక రెసిడెంట్‌ గ్రీవెన్స్‌ అధికారి తన పదవికి గుడ్‌బై చెప్పారు. నూతన ఐటీ నిబంధనలకు అనుగుణంగా ఇటీవలే నియమితులైన ధర్మేంద్ర చతుర్‌ ఆ పదవి నుంచి వైదొలిగారు. అందుకు గల కారణాలు తెలియరాలేదు. దీనిపై స్పందించేందుకు ట్విట్టర్ సైతం నిరాకరించింది. ట్విట్టర్​కు, భారత ప్రభుత్వానికి మధ్య విభేదాలు నెలకొన్న తరుణంలో ఆయన రాజీనామా చర్చనీయాంశంగా మారింది.

ఏకంగా భారత పటాన్నే..

అంతటితో ఆగకుండా.. మరో వివాదాస్పద చర్యకు ట్విట్టర్ సోమవారం పాల్పడింది. భారతదేశ చిత్ర పటాన్ని మరోసారి వక్రీకరించింది. జమ్ముకశ్మీర్, లద్దాఖ్​ను తన వెబ్​సైట్​లో ప్రత్యేక దేశంగా చూపించింది. దీనిపై నెటిజన్లు తీవ్రంగా మండిపడ్డారు. ట్విట్టర్​కు వ్యతిరేకంగా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

భారత్ మ్యాప్​ను తప్పుగా చూపటం ట్విట్టర్​కు ఇదే మొదటిసారి కాదు. గతేడాది కూడా లేహ్​ ప్రాంతాన్ని చైనా మ్యాప్​లో చూపించి విమర్శలు మూటగట్టుకుంది. ఆ సమయంలో ట్విట్టర్​కు ప్రభుత్వం తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. దేశ సార్వభౌమత్వానికి భంగం కలిగించేలా ప్రవర్తిస్తే చర్యలు తప్పవని హెచ్చరించింది.

ఈ తరుణంలో మరోసారి అలాంటి చర్యకే పాల్పడిన ట్విట్టర్​పై కేంద్రం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో వేచి చూడాలి.

ఇదీ చూడండి: 'ఐటీ నిబంధనలపై స్టే ఇవ్వలేం'

Last Updated : Jun 28, 2021, 10:03 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.