తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా.. ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీతో టీటీవీ దినకరన్ చేతులు కలిపారు.
మైనారిటీ ఓట్లపై దినకరన్కు చెందిన ఏఎంఎంకే దృష్టి సారించింది. డీఎంకే-కాంగ్రెస్ కూటమి బలం కూడా మైనారిటీ ఓట్లే కావడం గమనార్హం. ఈ క్రమంలో అసదుద్దీన్ పార్టీకి మూడు సీట్లు కేటాయించింది ఏఎంఎంకే. వానియంబడి, కృష్ణగిరి, శంకరపురం నియోజకవర్గాల్లో ఏఐఎంఐఎం బరిలో దిగనుంది. ముస్లిం ఓటర్లు ఎక్కువగా ఉండే 10-15 నియోజకవర్గాల్లో ఈ పొత్తు ప్రభావం ఉండొచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
రాష్ట్రంలో 234 సీట్లకు ఏప్రిల్ 6న ఎన్నికలు జరగనున్నాయి. మే 2న ఫలితాలు వెలువడనున్నాయి.
ఇదీ చూడండి:- చిన్నమ్మ నిర్ణయంపై దినకరన్ స్పందన