ETV Bharat / bharat

కాంగ్రెస్ కమిటీ ముందు సిద్ధూ హాజరు

author img

By

Published : Jun 1, 2021, 7:13 PM IST

పంజాబ్ కాంగ్రెస్​లో ఏర్పడిన విభేదాలను తొలగించేందుకు హైకమాండ్ ఏర్పాటు చేసిన కమిటీ ముందు పార్టీ నేత నవ్​జోత్ సింగ్ సిద్ధూ హాజరయ్యారు. రాష్ట్రంలో పార్టీ కార్యకలాపాలపై హైకమాండ్​కు అన్ని వివరాలు తెలియజేసినట్లు చెప్పారు. తన వైఖరిలో ఎలాంటి మార్పు లేదని స్పష్టం చేశారు.

Truth can be oppressed, not defeated: Sidhu
కాంగ్రెస్ కమిటీ ముందు హాజరైన సిద్ధూ

పంజాబ్​ కాంగ్రెస్​లో వర్గపోరు సమస్య పరిష్కారం కోసం ఏర్పాటు చేసిన ముగ్గురు సభ్యుల కమిటీ ముందు ఆ పార్టీ నేత నవ్​జోత్ సింగ్ సిద్ధూ హాజరయ్యారు. సమస్యలపై తన వైఖరిలో ఎలాంటి మార్పు లేదని ఆయన స్పష్టం చేశారు. పంజాబ్ రాష్ట్రం సాధించే ఫలాలు ప్రతి పౌరుడికీ అందాలని పేర్కొన్నారు.

సిద్ధూ

"హైకమాండ్ పిలుపుతో నేనిక్కడికి(దిల్లీ) వచ్చాను. రాష్ట్రంలో పార్టీ కార్యకలాపాలపై హైకమాండ్​కు వివరించాను. పంజాబ్ ప్రజల గళాన్ని క్షేత్రస్థాయి నుంచి పార్టీ అధిష్ఠానానికి వివరించాను. నా వైఖరిలో ఎలాంటి మార్పు లేదు, ఉండబోదు. కమిటీ ముందు నిజాన్ని ఉంచాను. నిజాన్ని అణచివేయొచ్చేమో కానీ ఓడించలేరు. పంజాబ్ వ్యతిరేక శక్తులన్నింటినీ ఓడించాలి. ప్రజల అధికారం ప్రజలకే అప్పగించాలి. పంజాబ్ పురోగతిలో ప్రతి ఒక్క రాష్ట్ర పౌరుడిని భాగస్వామ్యం చేయాలి."

-నవ్​జోత్ సింగ్ సిద్ధూ, పంజాబ్ కాంగ్రెస్ నేత

గత కొంత కాలంగా పంజాబ్ సీఎం అమరీందర్ సింగ్, సిద్ధూ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. బహిరంగంగానే సర్కారుపై సిద్ధూ విమర్శలు చేస్తున్నారు. వాటికి అమరీందర్ సైతం దీటుగా స్పందిస్తున్నారు.

ఈ నేపథ్యంలో సమస్య పరిష్కారానికి కాంగ్రెస్ పార్టీ అంతర్గతంగా ముగ్గురు సభ్యుల కమిటీని ఏర్పాటు చేసింది. రాజ్యసభలో విపక్ష నేత మల్లికార్జున ఖర్గేకి కమిటీ నాయకత్వ బాధ్యతలు అప్పగించింది.

అసెంబ్లీ ఎన్నికలకు ముందే వివాదాన్ని పరిష్కరించాలని హైకమాండ్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. కమిటీ ఏర్పాటు చేసి సిద్ధూను బుజ్జగించే ప్రయత్నం చేస్తోందని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. ఎన్నికల్లో గెలిస్తే సిద్ధూకు ఉపముఖ్యమంత్రి పదవి కట్టబెట్టే అవకాశాలు ఉన్నాయని పేర్కొంటున్నాయి.

ఇదీ చదవండి- సీఎం X సిద్ధూ: సంక్షోభంలోకి పంజాబ్‌ కాంగ్రెస్‌!

పంజాబ్​ కాంగ్రెస్​లో వర్గపోరు సమస్య పరిష్కారం కోసం ఏర్పాటు చేసిన ముగ్గురు సభ్యుల కమిటీ ముందు ఆ పార్టీ నేత నవ్​జోత్ సింగ్ సిద్ధూ హాజరయ్యారు. సమస్యలపై తన వైఖరిలో ఎలాంటి మార్పు లేదని ఆయన స్పష్టం చేశారు. పంజాబ్ రాష్ట్రం సాధించే ఫలాలు ప్రతి పౌరుడికీ అందాలని పేర్కొన్నారు.

సిద్ధూ

"హైకమాండ్ పిలుపుతో నేనిక్కడికి(దిల్లీ) వచ్చాను. రాష్ట్రంలో పార్టీ కార్యకలాపాలపై హైకమాండ్​కు వివరించాను. పంజాబ్ ప్రజల గళాన్ని క్షేత్రస్థాయి నుంచి పార్టీ అధిష్ఠానానికి వివరించాను. నా వైఖరిలో ఎలాంటి మార్పు లేదు, ఉండబోదు. కమిటీ ముందు నిజాన్ని ఉంచాను. నిజాన్ని అణచివేయొచ్చేమో కానీ ఓడించలేరు. పంజాబ్ వ్యతిరేక శక్తులన్నింటినీ ఓడించాలి. ప్రజల అధికారం ప్రజలకే అప్పగించాలి. పంజాబ్ పురోగతిలో ప్రతి ఒక్క రాష్ట్ర పౌరుడిని భాగస్వామ్యం చేయాలి."

-నవ్​జోత్ సింగ్ సిద్ధూ, పంజాబ్ కాంగ్రెస్ నేత

గత కొంత కాలంగా పంజాబ్ సీఎం అమరీందర్ సింగ్, సిద్ధూ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. బహిరంగంగానే సర్కారుపై సిద్ధూ విమర్శలు చేస్తున్నారు. వాటికి అమరీందర్ సైతం దీటుగా స్పందిస్తున్నారు.

ఈ నేపథ్యంలో సమస్య పరిష్కారానికి కాంగ్రెస్ పార్టీ అంతర్గతంగా ముగ్గురు సభ్యుల కమిటీని ఏర్పాటు చేసింది. రాజ్యసభలో విపక్ష నేత మల్లికార్జున ఖర్గేకి కమిటీ నాయకత్వ బాధ్యతలు అప్పగించింది.

అసెంబ్లీ ఎన్నికలకు ముందే వివాదాన్ని పరిష్కరించాలని హైకమాండ్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. కమిటీ ఏర్పాటు చేసి సిద్ధూను బుజ్జగించే ప్రయత్నం చేస్తోందని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. ఎన్నికల్లో గెలిస్తే సిద్ధూకు ఉపముఖ్యమంత్రి పదవి కట్టబెట్టే అవకాశాలు ఉన్నాయని పేర్కొంటున్నాయి.

ఇదీ చదవండి- సీఎం X సిద్ధూ: సంక్షోభంలోకి పంజాబ్‌ కాంగ్రెస్‌!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.