రామభక్తులే పాలించాలని 800కి.మీ సైకిల్ యాత్ర! - West Bengal soil in Ramlala's court
బంగాల్కు చెందిన ఓ వ్యక్తి 800 కిలోమీటర్లు సైకిల్పై ప్రయాణించి అయోధ్యలో నిర్మిస్తున్న రామాలయానికి మట్టిని సమర్పించాడు. 2021 అసెంబ్లీ ఎన్నికల్లో హిందుత్వ భావజాలమున్న పార్టీ బంగాల్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని ప్రార్థించాడు.
![రామభక్తులే పాలించాలని 800కి.మీ సైకిల్ యాత్ర!](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10004904-thumbnail-3x2-up.jpg?imwidth=3840)
రాష్ట్రంలోని మట్టిని తీసుకుని 800 కిలోమీటర్లు సైకిల్పై ప్రయాణించి.. ఉత్తర్ప్రదేశ్లోని అయోధ్యలో నిర్మిస్తున్న రామాలయానికి సమర్పించాడు బంగాల్కు చెందిన సుబోధ్ కుమార్. రానున్న బంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో హిందుత్వ భావజాలాలున్న పార్టీ అధికారంలోకి రావాలని ప్రార్థించాడు.
సోమవారం(డిసెంబర్ 21) అయోధ్య చేరుకున్న సుబోధ్.. సరయూ నదిలో స్నానం చేసి.. హనుమాన్ ఆలయంలో పూజలు చేశాడు. అనంతరం రామ మందిరానికి బంగాల్ మట్టిని సమర్పించి.. రామ భక్తులే 2021 ఎన్నికల్లో విజయం సాధించి అధికారంలో రావాలని ప్రార్థించాడు.
'కరోనాను రాముడే అంతం చేస్తాడు'
ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న కరోనాను అంతం చేయాలని ప్రార్థించిన సుబోధ్.. "కరోనా వల్ల ఇప్పటికే చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రపంచ దేశాలు ఆర్థిక, ఆరోగ్య సంక్షోభంలో కూరుకుపోయాయి. అయితే శ్రీ రాముడు మాత్రమే మహమ్మారిని అంతం చేస్తాడు" అని అన్నాడు.
ఇదీ చూడండి: కమల్కు షాక్- భాజపాలోకి ఎంఎన్ఎం ప్రధాన కార్యదర్శి