ETV Bharat / bharat

కాంగ్రెస్​ పాలిత రాష్ట్రంలో 'బుల్​డోజర్'​ ట్రెండ్​.. 300ఏళ్ల నాటి గుడి కూల్చివేత!

author img

By

Published : Apr 22, 2022, 5:46 PM IST

ఉత్తర్​ప్రదేశ్​లో మొదలై దిల్లీ, మధ్యప్రదేశ్​కు విస్తరించిన బుల్​డోజర్​ ట్రెండ్​ కాంగ్రెస్​ పాలిత రాష్ట్రాలకూ పాకింది. రాజస్థాన్​ అల్వార్​లోని 3 పురాతన ఆలయాలు సహా దుకాణాలు, పలు నిర్మాణాలను కూల్చివేయడం చర్చనీయాంశంగా మారింది. అయితే.. మున్సిపల్​ బోర్డు ఆదేశాల మేరకు ఇలా జరిగిందని, ప్రభుత్వం స్పందించి చర్యలు చేపట్టిందని తెలిపారు రాజస్థాన్​ కాంగ్రెస్​ అధ్యక్షుడు.

Three 300-year-old temples have been demolished
Three 300-year-old temples have been demolished
కాంగ్రెస్​ పాలిత రాష్ట్రంలో ఆలయాలు కూల్చివేత

Bulldozer on Temples Rajgarh: దేశంలో ప్రస్తుతం బుల్​డోజర్ల ట్రెండ్​ నడుస్తోంది. అక్రమ నిర్మాణాలపై పలు రాష్ట్రాల్లో భాజపా ఎక్కుపెడుతున్న అస్త్రం ఇదే. తొలుత ఉత్తర్​ప్రదేశ్​లో మొదలైన ఈ కూల్చివేతలు క్రమంగా పలు రాష్ట్రాలకు విస్తరించాయి. ఇటీవల మధ్యప్రదేశ్​ సహా దిల్లీ జహంగీర్​పురీలో అక్రమ నిర్మాణాల కూల్చివేతలు వివాదాస్పదంగా మారాయి. ఈ వ్యవహారం సుప్రీంకోర్టుకు కూడా చేరింది.

ఇప్పుడు రాజస్థాన్​ అల్వార్​లో వందల ఏళ్ల నాటి 3 ఆలయాల్ని కూల్చివేయడం వివాదానికి దారితీసింది. సరాయి మొహల్లా ప్రాంతంలోని 300 సంవత్సరాల పురాతన శివాలయం సహా మరో రెండు ఆలయాలను బుల్డోజర్లతో కూల్చివేశారు అధికారులు. అక్కడే మరిన్ని దుకాణాలు, పలు నిర్మాణాలను కూడా ధ్వంసం చేశారు. ఈ కూల్చివేతలపై హిందూ సంఘాలు, స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనికి సంబంధించి రాజ్​గఢ్​ పోలీస్​ స్టేషన్​లో ఫిర్యాదు చేశారు.

ఆలయ కూల్చివేతలపై భాజపా మండిపడింది. నిజానిజాలను వెలికితీసేందుకు ఐదుగురు సభ్యులతో ఓ కమిటీని నియమిస్తున్నట్లు తెలిపారు రాజస్థాన్​ భాజపా అధ్యక్షుడు డా. సతీశ్​ పునియా. ఘటనా స్థలాన్ని పరిశీలించి, వాస్తవాలతో కూడిన నివేదిక తనకు అందించాలని ఆయన ఆదేశించారు. సిటీ అభివృద్ధి పనుల మాస్టర్​ ప్లాన్​లో భాగంగా కూల్చివేతలు చేపట్టినట్లు సమాచారం.

యథాతథ స్థితిలో విగ్రహాలు: ఆలయ కూల్చివేతలపై స్పందించిన రాజస్థాన్​ కాంగ్రెస్​ చీఫ్​ డోటాసరా.. ఇది భాజపా హయాంలోనే మొదలైందని అన్నారు. కూల్చివేతలకు కలెక్టర్​ అనుమతి తీసుకోలేదని, మున్సిపల్​ బోర్డు అధ్యక్షుడి ఆదేశాల మేరకు అధికారులు నిర్ణయం తీసుకున్నారని ఆయన అన్నారు. విషయం తెలిసిన వెంటనే తమ ప్రభుత్వం బాధ్యులపై చర్యలు తీసుకుందని, విగ్రహాలను యథాతథ స్థితిలో ఉంచాలని ఆదేశాలు ఇచ్చిందని స్పష్టం చేశారు.

ఇవీ చూడండి: కోర్టు ఆవరణలో కాల్పులు - క్లయింట్ల మధ్య గొడవే కారణం

భారీ విధ్వంసానికి ఉగ్రవాదుల కుట్ర.. టార్గెట్ మోదీ​!

కాంగ్రెస్​ పాలిత రాష్ట్రంలో ఆలయాలు కూల్చివేత

Bulldozer on Temples Rajgarh: దేశంలో ప్రస్తుతం బుల్​డోజర్ల ట్రెండ్​ నడుస్తోంది. అక్రమ నిర్మాణాలపై పలు రాష్ట్రాల్లో భాజపా ఎక్కుపెడుతున్న అస్త్రం ఇదే. తొలుత ఉత్తర్​ప్రదేశ్​లో మొదలైన ఈ కూల్చివేతలు క్రమంగా పలు రాష్ట్రాలకు విస్తరించాయి. ఇటీవల మధ్యప్రదేశ్​ సహా దిల్లీ జహంగీర్​పురీలో అక్రమ నిర్మాణాల కూల్చివేతలు వివాదాస్పదంగా మారాయి. ఈ వ్యవహారం సుప్రీంకోర్టుకు కూడా చేరింది.

ఇప్పుడు రాజస్థాన్​ అల్వార్​లో వందల ఏళ్ల నాటి 3 ఆలయాల్ని కూల్చివేయడం వివాదానికి దారితీసింది. సరాయి మొహల్లా ప్రాంతంలోని 300 సంవత్సరాల పురాతన శివాలయం సహా మరో రెండు ఆలయాలను బుల్డోజర్లతో కూల్చివేశారు అధికారులు. అక్కడే మరిన్ని దుకాణాలు, పలు నిర్మాణాలను కూడా ధ్వంసం చేశారు. ఈ కూల్చివేతలపై హిందూ సంఘాలు, స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనికి సంబంధించి రాజ్​గఢ్​ పోలీస్​ స్టేషన్​లో ఫిర్యాదు చేశారు.

ఆలయ కూల్చివేతలపై భాజపా మండిపడింది. నిజానిజాలను వెలికితీసేందుకు ఐదుగురు సభ్యులతో ఓ కమిటీని నియమిస్తున్నట్లు తెలిపారు రాజస్థాన్​ భాజపా అధ్యక్షుడు డా. సతీశ్​ పునియా. ఘటనా స్థలాన్ని పరిశీలించి, వాస్తవాలతో కూడిన నివేదిక తనకు అందించాలని ఆయన ఆదేశించారు. సిటీ అభివృద్ధి పనుల మాస్టర్​ ప్లాన్​లో భాగంగా కూల్చివేతలు చేపట్టినట్లు సమాచారం.

యథాతథ స్థితిలో విగ్రహాలు: ఆలయ కూల్చివేతలపై స్పందించిన రాజస్థాన్​ కాంగ్రెస్​ చీఫ్​ డోటాసరా.. ఇది భాజపా హయాంలోనే మొదలైందని అన్నారు. కూల్చివేతలకు కలెక్టర్​ అనుమతి తీసుకోలేదని, మున్సిపల్​ బోర్డు అధ్యక్షుడి ఆదేశాల మేరకు అధికారులు నిర్ణయం తీసుకున్నారని ఆయన అన్నారు. విషయం తెలిసిన వెంటనే తమ ప్రభుత్వం బాధ్యులపై చర్యలు తీసుకుందని, విగ్రహాలను యథాతథ స్థితిలో ఉంచాలని ఆదేశాలు ఇచ్చిందని స్పష్టం చేశారు.

ఇవీ చూడండి: కోర్టు ఆవరణలో కాల్పులు - క్లయింట్ల మధ్య గొడవే కారణం

భారీ విధ్వంసానికి ఉగ్రవాదుల కుట్ర.. టార్గెట్ మోదీ​!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.