కరోనా టీకా ధరను 150 రూపాయలుగా కేంద్రం నిర్ణయించింది. సర్వీస్ ఛార్జీ రూ.100తో కలిపి టీకా డోసు ధర 250 రూపాయలకు మించొద్దని ఆదేశించింది. ప్రభుత్వ ఆస్పత్రుల్లో వేసే టీకా ఉచితం కాగా..ప్రైవేటు ఆస్పత్రుల్లో టీకా ధరను ప్రజలే చెల్లించాలని కేంద్రం స్పష్టం చేసింది.
గుజరాత్ డిప్యూటీ సీఎం నితిన్ పటేల్ రాష్ట్ర ప్రజలు ప్రైవేటు ఆస్పత్రుల్లో టీకా తీసుకోవాలనుకుంటే 250 రూపాయలు చెల్లించాలని చెప్పారు. వంద రూపాయలు రిజిస్ట్రేషన్కు.. డోసుకు 150 రూపాయలు చెల్లించాలని సూచించారు. మరోవైపు మార్చి 1 నుంచి రెండోవిడత కొవిడ్ వ్యాక్సినేషన్ ప్రారంభమవుతుందని కేంద్రం తెలిపింది. రెండో విడతలో 60 ఏళ్లు పైబడిన వారికి టీకాలు అందించనున్నట్లు వెల్లడించింది.