కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ నేతృత్వంలో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ(సీడబ్ల్యూసీ) సభ్యులు సమావేశమయ్యారు. ఇటీవల ముగిసిన.. నాలుగు రాష్ట్రాలు, ఓ కేంద్ర పాలిత ప్రాంత అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ వైఫల్యాలపై చర్చించడమే అజెండాగా సీడబ్ల్యూసీ సభ్యులతో భేటీ అయ్యారు సోనియా. తాజా ఓటమితో పాటు.. వచ్చే ఏడాది పలు రాష్ట్రాల్లో జరగనున్న ఎన్నికలపైనా కాంగ్రెస్ ఈ సమావేశంలో దృష్టిసారించనున్నారు.
వచ్చే ఏడాది జరిగే ఎన్నికలపై దృష్టి..
2019 లోక్సభ ఎన్నికల తర్వాత నుంచి హస్తం పార్టీ విఫలమవుతూనే ఉంది. నాటి సార్వత్రిక ఎన్నికల్లో.. అరుణాచల్ప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, హరియాణాలో ఘోర ఓటమి చవిచూసింది. గతేడాది జరిగిన దిల్లీ, బిహార్ అసెంబ్లీ పోరులోనూ విజయం సాధించలేకపోయింది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో.. తమిళనాడులో డీఎంకేతో పొత్తు పెట్టుకొని విజయం సాధించింది.
ఈ నేపథ్యంలో.. వచ్చే ఏడాది జరగనున్న ఎన్నికలపైనా కాంగ్రెస్ ఈ భేటీలో దృష్టిసారించనుంది కాంగ్రెస్. ఉత్తర్ప్రదేశ్, పంజాబ్, ఉత్తరాఖండ్, గోవా, మణిపుర్లో 2022లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో మంచి ప్రదర్శన చేయడంపై సీడబ్ల్యూసీ సమావేశంలో సభ్యులు ప్రధానంగా చర్చించనున్నారు.
మూడోదశ కరోనాపై సోనియా ఆందోళన..
ఈ సందర్భంగా.. కరోనా 3.0 గురించి కాంగ్రెస్ అధ్యక్షురాలి ఆందోళన వ్యక్తం చేశారు. కరోనా కట్టడిలో మోదీ సర్కారు ఘోరంగా విఫలమైందని సోనియా ఆరోపణలు చేశారు. టీకాలు వేసే బాధ్యత రాష్ట్రాలకు అప్పగించి, కేంద్రం చేతులు దులుపుకుందని ఆమె అన్నారు. అందరికీ ఉచితంగా వ్యాక్సిన్ అందిస్తే ఆర్థిక వ్యవస్థకు వచ్చిన ముప్పేమీ లేదని చెప్పారామె.
ఇదీ చదవండి: బంగాల్లో మంత్రివర్గ విస్తరణ- 43మంది ప్రమాణం