ETV Bharat / bharat

'సచివాలయం' రాళ్ల కోసం రాజస్థాన్​కు తెలంగాణ మంత్రి - తెలంగాణ మంత్రి ప్రశాంత్​ రెడ్డి రాజస్థాన్​ పర్యటన

రాజస్థాన్​లో పర్యటించారు తెలంగాణ మంత్రి ప్రశాంత్​ రెడ్డి. తెలంగాణలో కొత్తగా నిర్మిస్తున్న సచివాలయం కోసం అనువైన రాళ్లను పరిశీలించేందుకు రాతి నిపుణుల బృందంతో పాటు రాజస్థాన్​ వెళ్లారు.

Telangana building minister visits Dhaulpur, observes sandstone mines
రాజస్థాన్​లో పర్యటించిన తెలంగాణ మంత్రి
author img

By

Published : Feb 20, 2021, 9:16 PM IST

Updated : Feb 20, 2021, 9:36 PM IST

తెలంగాణలో కొత్తగా నిర్మిస్తున్న సచివాలయం కోసం అనువైన రాళ్లను పరిశీలించేందుకు రాష్ట్ర రోడ్డు, భవనాల శాఖ మంత్రి ప్రశాంత్​ రెడ్డితో కూడిన రాతి నిపుణుల బృందం రాజస్థాన్​లోని ధౌల్​పుర్​కు వెళ్లింది. ఎరుపు, గులాబీ రంగుల్లో ఉండే రాళ్లకు ప్రసిద్ధిగాంచిన సరమతురా డాంగ్ ప్రాంతంలోని గనుల్లో కలియతిరిగింది. బృందంలోని నిపుణులు రాళ్ల నాణ్యతను నిశితంగా పరిశీలించారు. ఈ పర్యటనలో మంత్రి ప్రశాంత్​రెడ్డి సుమారు అరడజను గనులను సందర్శించినట్లు అధికారులు తెలిపారు. అక్కడ లభ్యమయ్యే ప్రత్యేక రాళ్ల గురించి స్థానికులను అడిగి తెలుసుకున్నట్లు వెల్లడించారు.

Telangana building minister visits Dhaulpur, observes sandstone mines
వివరాలు అడిగి తెలుసుకుంటున్న మంత్రి
Telangana building minister visits Dhaulpur, observes sandstone mines
రాళ్లను పరిశీలిస్తున్న మంత్రి
Telangana building minister visits Dhaulpur, observes sandstone mines
ప్రశాంత్​ రెడ్డితో నిపుణుల బృందం

ఈ క్రమంలో మంత్రి ప్రశాంత్​ రెడ్డి స్థానిక మీడియాతో మాట్లాడారు. నూతనంగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో నిర్మించనున్న సచివాలయానికి కావాల్సిన ఎరుపు, తెలుపు రాళ్లను ధౌల్​పుర్​ నుంచి కొనుగోలు చేయనున్నట్లు తెలిపారు.

"పార్లమెంట్​ భవన నిర్మాణం ధౌల్​పుర్​లో లభ్యమయ్యే తెలుపు, ఎరుపు రాళ్లతోనే జరిగిందని తెలుసుకున్నాం. తెలంగాణలో నిర్మించే సచివాలయం కోసం ఈ రాళ్లనే ఉపయోగించాలని నిర్ణయించాం. వాటి కొనుగోలుకు ఇక్కడకు వచ్చాం. ఈ రాళ్ల నాణ్యతకు మరొకటి సాటి రాదు. మా ముఖ్యమంత్రి చంద్రశేఖర్​రావు సచివాలయాన్ని వాస్తు ప్రకారం నిర్మిస్తున్నారు. ఇందుకుగానూ అనేక ఆకృతులను కూడా మా బృందం పరిశీలిస్తోంది."

-ప్రశాంత్​ రెడ్డి, తెలంగాణ రాష్ట్ర రోడ్డు, భవనాల శాఖ మంత్రి

ఇదీ చూడండి: 'రామమందిరాన్ని వ్యతిరేకించేవారు రావణుని పార్టీనే'

తెలంగాణలో కొత్తగా నిర్మిస్తున్న సచివాలయం కోసం అనువైన రాళ్లను పరిశీలించేందుకు రాష్ట్ర రోడ్డు, భవనాల శాఖ మంత్రి ప్రశాంత్​ రెడ్డితో కూడిన రాతి నిపుణుల బృందం రాజస్థాన్​లోని ధౌల్​పుర్​కు వెళ్లింది. ఎరుపు, గులాబీ రంగుల్లో ఉండే రాళ్లకు ప్రసిద్ధిగాంచిన సరమతురా డాంగ్ ప్రాంతంలోని గనుల్లో కలియతిరిగింది. బృందంలోని నిపుణులు రాళ్ల నాణ్యతను నిశితంగా పరిశీలించారు. ఈ పర్యటనలో మంత్రి ప్రశాంత్​రెడ్డి సుమారు అరడజను గనులను సందర్శించినట్లు అధికారులు తెలిపారు. అక్కడ లభ్యమయ్యే ప్రత్యేక రాళ్ల గురించి స్థానికులను అడిగి తెలుసుకున్నట్లు వెల్లడించారు.

Telangana building minister visits Dhaulpur, observes sandstone mines
వివరాలు అడిగి తెలుసుకుంటున్న మంత్రి
Telangana building minister visits Dhaulpur, observes sandstone mines
రాళ్లను పరిశీలిస్తున్న మంత్రి
Telangana building minister visits Dhaulpur, observes sandstone mines
ప్రశాంత్​ రెడ్డితో నిపుణుల బృందం

ఈ క్రమంలో మంత్రి ప్రశాంత్​ రెడ్డి స్థానిక మీడియాతో మాట్లాడారు. నూతనంగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో నిర్మించనున్న సచివాలయానికి కావాల్సిన ఎరుపు, తెలుపు రాళ్లను ధౌల్​పుర్​ నుంచి కొనుగోలు చేయనున్నట్లు తెలిపారు.

"పార్లమెంట్​ భవన నిర్మాణం ధౌల్​పుర్​లో లభ్యమయ్యే తెలుపు, ఎరుపు రాళ్లతోనే జరిగిందని తెలుసుకున్నాం. తెలంగాణలో నిర్మించే సచివాలయం కోసం ఈ రాళ్లనే ఉపయోగించాలని నిర్ణయించాం. వాటి కొనుగోలుకు ఇక్కడకు వచ్చాం. ఈ రాళ్ల నాణ్యతకు మరొకటి సాటి రాదు. మా ముఖ్యమంత్రి చంద్రశేఖర్​రావు సచివాలయాన్ని వాస్తు ప్రకారం నిర్మిస్తున్నారు. ఇందుకుగానూ అనేక ఆకృతులను కూడా మా బృందం పరిశీలిస్తోంది."

-ప్రశాంత్​ రెడ్డి, తెలంగాణ రాష్ట్ర రోడ్డు, భవనాల శాఖ మంత్రి

ఇదీ చూడండి: 'రామమందిరాన్ని వ్యతిరేకించేవారు రావణుని పార్టీనే'

Last Updated : Feb 20, 2021, 9:36 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.