ETV Bharat / bharat

Telangana Assembly Election Results 2023 live News : అనుకున్నదే జరిగింది - కొడంగల్​లో రేవంత్, గజ్వేల్​లో కేసీఆర్ గెలుపు

author img

By ETV Bharat Telugu Team

Published : Dec 3, 2023, 11:37 AM IST

Updated : Dec 3, 2023, 5:11 PM IST

Telangana Assembly Election Results 2023 live News : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఈసారి అందరి దృష్టిని ఆకర్షించిన నియోజకవర్గాలు ప్రధానంగా కామారెడ్డి, కొడంగల్, గజ్వేల్​, సిద్దిపేట, సిరిసిల్ల. ఈ నియోజకవర్గాల్లో ఎవరు గెలుస్తారా అని అందరూ ఉత్కంఠగా ఎదురు చూశారు. అందరి ఉత్కంఠకు తెరదించుతూ కామారెడ్డిలో బీజేపీ అభ్యర్థి కాటిపల్లి వెంకటరమణారెడ్డి విజయం సాధించారు. గజ్వేల్​లో కేసీఆర్​ గెలవగా, కొడంగల్​లో రేవంత్​ రెడ్డి భారీ మెజార్టీతో గెలుపొందారు. మిగతా నియోజకవర్గాల్లో పరిస్థితులు ఎలా ఉన్నాయంటే?

Telangana Assembly Election Results 2023
Telangana Assembly Election Results 2023 live News

Telangana Assembly Election Results 2023 live News : రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు దాదాపు కొలిక్కివచ్చాయి. పోస్టల్​ బ్యాలెట్లు సహా ఇప్పటి వరకు వెల్లడైన ఫలితాల్లో కాంగ్రెస్​ నేతలు ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఈసారి ఎన్నికల బరిలో దిగిన పలువురు ప్రముఖుల్లో కొందరు తమ విక్టరీని కొనసాగించగా, మరికొందరు అనూహ్యంగా విజయబావుటా ఎగురవేశారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

సీఎం కేసీఆర్ : బీఆర్​ఎస్​ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్​ ఈసారి తన సొంత నియోజకవర్గం సిద్దిపేట జిల్లా గజ్వేల్​తో పాటు కామారెడ్డి నుంచి బరిలో నిలిచారు. అయితే ఈ రెండింట్లో గజ్వేల్​లో ఎప్పటిలాగే తన హవా కొనసాగించగా, కామారెడ్డిలో మాత్రం తన మేజిక్​ను రిపీట్​ చేయలేకపోయారు. గజ్వేల్​లో ప్రత్యర్థి ఈటల రాజేందర్​పై పైచేయి సాధించిన కేసీఆర్, కామారెడ్డిలో మాత్రం తన మార్క్​ చూపించలేకపోయారు. ఇక్కడ బీజేపీ అభ్యర్థి కాటిపల్లి వెంకటరమణారెడ్డి విజయం సాధించారు. కేసీఆర్ రెండో స్థానంతో సరిపెట్టుకున్నారు.

రేవంత్​ రెడ్డి: గత అసెంబ్లీ ఎన్నికల్లో కొడంగల్​ నియోజకవర్గం నుంచి బరిలో దిగి ఓటమి చవిచూసిన టీపీసీసీ అధ్యక్షులు రేవంత్​ రెడ్డి ఈసారి మాత్రం భారీ మెజార్టీతో గెలుపొందారు. కొడంగల్​తో పాటు కామారెడ్డిలోనూ పోటీకి దిగిన రేవంత్ అక్కడ మూడో స్థానంలో నిలిచారు. రేవంత్​కు ప్రత్యర్థులుగా కొడంగల్​లో బీఆర్​ఎస్​ తరఫున పట్నం నరేందర్​ రెడ్డి, బీజేపీ తరఫున బంతు రమేశ్​కుమార్​ ఉన్నారు. ఇక కామారెడ్డిలో సీఎం కేసీఆర్​, బీజేపీ అభ్యర్థి కాటిపల్లి వెంకటరమణారెడ్డిలు బరిలో నిలిచారు.

బండి సంజయ్​: బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు, కరీంనగర్​ ఎంపీ బండి సంజయ్​ ఈసారి అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచారు. అధిష్ఠానం ఆదేశం మేరకు కరీంనగర్​ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసిన ఆయన ప్రధాన ప్రత్యర్థి గంగుల కమలాకర్​ చేతిలో ఓటమి పాలయ్యారు. ఈసారి కోరుట్ల నుంచి ఎమ్మెల్యేగా తన అదృష్టాన్ని పరీక్షించుకున్న ధర్మపురి అర్వింద్​కూ చేదు ఫలితమే ఎదురైంది.

హరీశ్​రావు: సిద్దిపేటలో బీఆర్​ఎస్​ అభ్యర్థిగా బరిలో నిలిచిన ఆరడుగుల బుల్లెట్ మంత్రి హరీశ్​రావు తన హిస్టరీని రిపీట్​ చేశారు. దాదాపు 50 వేల మెజార్టీతో గెలుపొందారు. ప్రత్యర్థులు పూజల హరికృష్ణ కాంగ్రెస్, డి.శ్రీకాంత్​రెడ్డి బీజేపీలకు అందనంత లీడ్​లో దూసుకెళ్లారు.

కేటీఆర్ వన్స్​మోర్: మంత్రి కేటీఆర్​ సైతం మరోమారు గెలిచారు. ఇప్పటికే ఈ నియోజకవర్గం నుంచి 4 సార్లు గెలిచిన కేటీఆర్​కు ఇది ఐదో విజయం. అయితే ఆధిక్యం మాత్రం గత రెండు ఎన్నికలతో పోలిస్తే ఈసారి చాలా తక్కువగా రావడం గమనార్హం.

మంత్రుల ఓటమి: ధర్మపురి అభ్యర్థి కొప్పుల ఈశ్వర్, నిర్మల్ అభ్యర్థి ఇంద్రకరణ్ ​రెడ్డి, బాల్కొండ అభ్యర్థి వేముల ప్రశాంత్​ రెడ్డి, ఖమ్మంలో పువ్వాడ అజయ్ కుమార్, పాలకుర్తిలో ఎర్రబెల్లి దయాకర్ ​రావు, వనపర్తిలో సింగిరెడ్డి నిరంజన్​ రెడ్డిలు ఓటమి పాలయ్యారు.

ఇదిలా ఉండగా రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్​ గాలి వీస్తోంది. అత్యధిక స్థానాల్లో ఆ పార్టీ అభ్యర్థులు ముందంజలో కొనసాగుతున్నారు. ఇప్పటి వరకు వెల్లడైన ఫలితాల ప్రకారం కాంగ్రెస్​ పార్టీ మేజిక్​ ఫిగర్​ 60 దాటేయగా, 39 సీట్లతో బీఆర్​ఎస్​ రెండో స్థానంలో కొనసాగుతోంది. ఆ తర్వాతి స్థానాల్లో బీజేపీ, ఏఐఎంఐఎం ఉన్నాయి.

Telangana Assembly Election Results 2023 live News : రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు దాదాపు కొలిక్కివచ్చాయి. పోస్టల్​ బ్యాలెట్లు సహా ఇప్పటి వరకు వెల్లడైన ఫలితాల్లో కాంగ్రెస్​ నేతలు ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఈసారి ఎన్నికల బరిలో దిగిన పలువురు ప్రముఖుల్లో కొందరు తమ విక్టరీని కొనసాగించగా, మరికొందరు అనూహ్యంగా విజయబావుటా ఎగురవేశారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

సీఎం కేసీఆర్ : బీఆర్​ఎస్​ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్​ ఈసారి తన సొంత నియోజకవర్గం సిద్దిపేట జిల్లా గజ్వేల్​తో పాటు కామారెడ్డి నుంచి బరిలో నిలిచారు. అయితే ఈ రెండింట్లో గజ్వేల్​లో ఎప్పటిలాగే తన హవా కొనసాగించగా, కామారెడ్డిలో మాత్రం తన మేజిక్​ను రిపీట్​ చేయలేకపోయారు. గజ్వేల్​లో ప్రత్యర్థి ఈటల రాజేందర్​పై పైచేయి సాధించిన కేసీఆర్, కామారెడ్డిలో మాత్రం తన మార్క్​ చూపించలేకపోయారు. ఇక్కడ బీజేపీ అభ్యర్థి కాటిపల్లి వెంకటరమణారెడ్డి విజయం సాధించారు. కేసీఆర్ రెండో స్థానంతో సరిపెట్టుకున్నారు.

రేవంత్​ రెడ్డి: గత అసెంబ్లీ ఎన్నికల్లో కొడంగల్​ నియోజకవర్గం నుంచి బరిలో దిగి ఓటమి చవిచూసిన టీపీసీసీ అధ్యక్షులు రేవంత్​ రెడ్డి ఈసారి మాత్రం భారీ మెజార్టీతో గెలుపొందారు. కొడంగల్​తో పాటు కామారెడ్డిలోనూ పోటీకి దిగిన రేవంత్ అక్కడ మూడో స్థానంలో నిలిచారు. రేవంత్​కు ప్రత్యర్థులుగా కొడంగల్​లో బీఆర్​ఎస్​ తరఫున పట్నం నరేందర్​ రెడ్డి, బీజేపీ తరఫున బంతు రమేశ్​కుమార్​ ఉన్నారు. ఇక కామారెడ్డిలో సీఎం కేసీఆర్​, బీజేపీ అభ్యర్థి కాటిపల్లి వెంకటరమణారెడ్డిలు బరిలో నిలిచారు.

బండి సంజయ్​: బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు, కరీంనగర్​ ఎంపీ బండి సంజయ్​ ఈసారి అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచారు. అధిష్ఠానం ఆదేశం మేరకు కరీంనగర్​ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసిన ఆయన ప్రధాన ప్రత్యర్థి గంగుల కమలాకర్​ చేతిలో ఓటమి పాలయ్యారు. ఈసారి కోరుట్ల నుంచి ఎమ్మెల్యేగా తన అదృష్టాన్ని పరీక్షించుకున్న ధర్మపురి అర్వింద్​కూ చేదు ఫలితమే ఎదురైంది.

హరీశ్​రావు: సిద్దిపేటలో బీఆర్​ఎస్​ అభ్యర్థిగా బరిలో నిలిచిన ఆరడుగుల బుల్లెట్ మంత్రి హరీశ్​రావు తన హిస్టరీని రిపీట్​ చేశారు. దాదాపు 50 వేల మెజార్టీతో గెలుపొందారు. ప్రత్యర్థులు పూజల హరికృష్ణ కాంగ్రెస్, డి.శ్రీకాంత్​రెడ్డి బీజేపీలకు అందనంత లీడ్​లో దూసుకెళ్లారు.

కేటీఆర్ వన్స్​మోర్: మంత్రి కేటీఆర్​ సైతం మరోమారు గెలిచారు. ఇప్పటికే ఈ నియోజకవర్గం నుంచి 4 సార్లు గెలిచిన కేటీఆర్​కు ఇది ఐదో విజయం. అయితే ఆధిక్యం మాత్రం గత రెండు ఎన్నికలతో పోలిస్తే ఈసారి చాలా తక్కువగా రావడం గమనార్హం.

మంత్రుల ఓటమి: ధర్మపురి అభ్యర్థి కొప్పుల ఈశ్వర్, నిర్మల్ అభ్యర్థి ఇంద్రకరణ్ ​రెడ్డి, బాల్కొండ అభ్యర్థి వేముల ప్రశాంత్​ రెడ్డి, ఖమ్మంలో పువ్వాడ అజయ్ కుమార్, పాలకుర్తిలో ఎర్రబెల్లి దయాకర్ ​రావు, వనపర్తిలో సింగిరెడ్డి నిరంజన్​ రెడ్డిలు ఓటమి పాలయ్యారు.

ఇదిలా ఉండగా రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్​ గాలి వీస్తోంది. అత్యధిక స్థానాల్లో ఆ పార్టీ అభ్యర్థులు ముందంజలో కొనసాగుతున్నారు. ఇప్పటి వరకు వెల్లడైన ఫలితాల ప్రకారం కాంగ్రెస్​ పార్టీ మేజిక్​ ఫిగర్​ 60 దాటేయగా, 39 సీట్లతో బీఆర్​ఎస్​ రెండో స్థానంలో కొనసాగుతోంది. ఆ తర్వాతి స్థానాల్లో బీజేపీ, ఏఐఎంఐఎం ఉన్నాయి.

Last Updated : Dec 3, 2023, 5:11 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.