రోజురోజుకూ పెరిగిపోతున్న అప్పుల వేధింపులను భరించలేక.. తమిళనాడులో ఓ వ్యాపారి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. నడిరోడ్డుపై ఒంటికి నిప్పుపొట్టుకుని బలవన్మరణానికి యత్నించాడు. కోయంబత్తూర్లో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ దృశ్యాలన్నీ అక్కడి సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి.
ఏం జరిగిందంటే?
స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. తమరైకుళంకు చెందిన విజయకుమార్.. జయప్రకాశ్ వద్ద రూ.20వేలు అప్పుగా తీసుకున్నాడు. మూణ్నెళ్ల తర్వాత జయప్రకాశ్కు రూ. 10వేలు, అతని భార్యకు మరో వెయ్యి రూపాయలు ఇచ్చాడు విజయ్. అయితే.. మిగిలిన సొమ్ము కోసం జయప్రకాశ్ బెదిరించాడని తెలిసింది. ఈ నేపథ్యంలో వారిద్దరి మధ్య ఓ టీ దుకాణం వద్ద వాగ్వాదం జరగ్గా.. విజయ్పై జయప్రకాశ్ ఉమ్మివేసినట్టు సమాచారం. ఈ అవమానాన్ని భరించలేని విజయ్ అక్కడే ఒంటికి నిప్పంటించుకున్నాడు. టీ షాపు యజమాని మంటలను ఆర్పగా.. జయప్రకాశ్ పరారయ్యాడు.
సమాచారం అందుకున్న పోలీసులు.. సంఘటనా స్థలానికి చేరుకుని తీవ్ర గాయాలపాలైన విజయ్ను కోయంబత్తూర్ ఆస్పత్రికి తరలించారు. పరారైన జయప్రకాశ్ను పట్టుకునేందుకు గాలింపు చర్యలు చేపట్టారు.
ఇదీ చదవండి: కీలక నేతల అధ్యక్షతన కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీలు