ETV Bharat / bharat

తాలిబన్లతో జైషే, లష్కరే జట్టు- భారత్ పరిస్థితేంటి?

author img

By

Published : Jul 18, 2021, 11:35 AM IST

అఫ్గాన్​పై విరుచుకుపడుతున్న తాలిబన్లకు జైషే మహమ్మద్, లష్కరే తొయిబా ఉగ్రసంస్థలు మద్దతు పలుకుతున్నాయి. తమ ఉగ్రవాదులను తాలిబన్ల పోరాటంలో భాగం చేస్తున్నాయి. ఇది భారత్​కు కచ్చితంగా ఆందోళన కలిగించే విషయమని నిపుణులు చెబుతున్నారు.

Surge of Lashkar, Jaish terrorists in Taliban ominous sign for India
తాలిబన్లతో జైషే, లష్కరే జట్టు- భారత్ పరిస్థితేంటి?

అమెరికా సహా నాటో దళాల ఉపసంహరణతో అఫ్గానిస్థాన్​పై తాలిబన్లు తెగబడుతున్నారు. విధ్వంసం సృష్టిస్తూ దేశాన్ని క్రమంగా తమ అధీనంలోకి తెచ్చుకుంటున్నారు. రోజులు గడుస్తున్న కొద్దీ కీలకమైన భూభాగాలన్నీ తాలిబన్ల వశమైపోతున్నాయి.

లష్కరే తొయిబా, జైషే మహమ్మద్ తీవ్రవాదులు తాలిబన్లతో కలిసి పనిచేస్తుండటం ఇప్పుడు భారత్​కు ఆందోళనకరంగా మారింది.

"కొద్దిరోజుల నుంచి ఈ పోకడలను గమనిస్తున్నాం. జరుగుతున్న పరిణామాలను నిశితంగా పరిశీలిస్తున్నాం. భారత్​పై వీటి ప్రభావాన్నీ అంచనా వేస్తున్నాం. కచ్చితంగా ఇది ఆందోళకరమైన విషయం."

-భారత భద్రతా వ్యవహారాల వర్గాలు

ఈ రెండు ఉగ్రసంస్థలు తాలిబన్లకు మానవ వనరులను అందిస్తున్నాయి. పంజాబ్ ప్రావిన్స్ నుంచి 'పోరాట యోధుల'ను అఫ్గాన్​కు పంపుతున్నాయి. ఇటీవల తాలిబన్లు చేపట్టిన వివిధ ఆపరేషన్లలో జైషే, లష్కరే భాగమయ్యారని వార్తలు వస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో ముష్కరులు కనిపించినట్లు పలు కథనాలు వెలువడుతున్నాయి. ఐరాస భద్రతా మండలి నివేదిక సైతం ఈ విషయాన్ని ప్రస్తావించింది. ఈ రెండు సంస్థలు పాకిస్థాన్ నుంచే పనిచేయడం, భారత్​ను లక్ష్యంగా చేసుకొనే కార్యకలాపాలు సాగించడం గమనార్హం.

"లష్కరే, జైషే సంస్థలు పోరాట ఉగ్రవాదులను అఫ్గానిస్థాన్​కు పంపిస్తోంది. సలహాదారులు, శిక్షకులు, పేలుడు పదార్థాల తయారీలో నిపుణులు ఇందులో ఉంటున్నారు. ప్రభుత్వ అధికారులు, ఇతరులను లక్ష్యంగా చేసుకొని హతమార్చడం వెనక ఈ రెండు ఉగ్రసంస్థలదే హస్తం."

-ఐరాస భద్రతా మండలి

ఐరాస పత్రాల ప్రకారం.. నంగర్హార్ ప్రావిన్సులోనే 800 మంది లష్కరే తొయిబా, 200 మంది జైషే ముష్కరులు ఉన్నారు. మహమంద్ దరా, దుర్ బాబా, షెర్జాద్ జిల్లాల్లో వీరంతా మోహరించారు. కునార్ అనే మరో రాష్ట్రంలోనూ ఈ రెండు ముష్కర ముఠాలకు చెందిన ఉగ్రవాదులు భారీగా పోగయ్యారు. దీన్ని బట్టి నిధులు, ఆయుధాలు, రిక్రూట్​మెంట్ విషయంలో తాలిబన్లకు ఎలాంటి ఇబ్బందులు లేవని అర్థమవుతోందని ఐరాస భద్రతా మండలి పత్రాలు పేర్కొంటున్నాయి.

గతంలోనూ..

తాలిబన్లతో జైషే, లష్కరే ముష్కరుల సంబంధాలు ప్రపంచానికి తెలియనివేం కాదు. 2020 ఏప్రిల్ 13-14 తేదీల్లో అఫ్గాన్ నేషనల్ డైరెక్టరేట్ ఆఫ్ సెక్యూరిటీ(ఎన్​డీఎస్) కమాండో బృందం.. పాక్ సరిహద్దుకు సమీపంలోని మొమంద్ దరాలో ఉన్న తాలిబన్ క్యాంప్​పై దాడి చేసింది. ఈ ఎన్​కౌంటర్​లో 15 మంది ఉగ్రవాదులు మరణిస్తే.. అందులో జైషేకు చెందిన ముష్కరులే 10 మంది ఉన్నారు. వీరంతా పాక్, పీఓకేకు చెందినవారే. కశ్మీర్​లో పోరాడేందుకు తాలిబన్లు వీరికి శిక్షణ ఇస్తున్నారు.

లక్ష్యం.. 'కశ్మీర్'

ఇక్కడి శిక్షణా మాడ్యూల్స్ అన్నీ కశ్మీర్ పరిస్థితులను పోలి ఉంటాయి. నంగర్హార్​లో నిర్మించిన క్యాంప్ సైతం నియంత్రణ రేఖ వద్ద ఉండే భూభాగాన్ని తలపించేలా ఉంటుంది. కశ్మీర్​ను భారత్ నుంచి విడగొట్టి పాక్​లో విలీనం చేయాలన్న సంకల్పంతోనే లష్కరే, జైషే సంస్థలు పనిచేస్తున్నాయి. భారత్​లో చాలా సార్లు దాడులకు తెగబడ్డాయి. 2001 భారత పార్లమెంట్​పై దాడి, 2008 ముంబయి దాడులు ఈ ఉగ్ర సంస్థల పనే.

ప్రమాదఘంటికే!

అఫ్గాన్ పొరుగు దేశాల్లో తాలిబన్లతో సంబంధాలు లేని ఏకైక ప్రధాన దేశం భారత్. ఈ నేపథ్యంలో భారత్​పై ఈ పరిణామాలు ఏ విధంగా ప్రభావం చూపిస్తాయనేది ఆసక్తికరంగా మారింది. కచ్చితంగా ఇది ప్రమాదఘంటికేనని తెలుస్తోంది.

(రచయిత- సంజీవ్ బారువా)

ఇవీ చదవండి:

అమెరికా సహా నాటో దళాల ఉపసంహరణతో అఫ్గానిస్థాన్​పై తాలిబన్లు తెగబడుతున్నారు. విధ్వంసం సృష్టిస్తూ దేశాన్ని క్రమంగా తమ అధీనంలోకి తెచ్చుకుంటున్నారు. రోజులు గడుస్తున్న కొద్దీ కీలకమైన భూభాగాలన్నీ తాలిబన్ల వశమైపోతున్నాయి.

లష్కరే తొయిబా, జైషే మహమ్మద్ తీవ్రవాదులు తాలిబన్లతో కలిసి పనిచేస్తుండటం ఇప్పుడు భారత్​కు ఆందోళనకరంగా మారింది.

"కొద్దిరోజుల నుంచి ఈ పోకడలను గమనిస్తున్నాం. జరుగుతున్న పరిణామాలను నిశితంగా పరిశీలిస్తున్నాం. భారత్​పై వీటి ప్రభావాన్నీ అంచనా వేస్తున్నాం. కచ్చితంగా ఇది ఆందోళకరమైన విషయం."

-భారత భద్రతా వ్యవహారాల వర్గాలు

ఈ రెండు ఉగ్రసంస్థలు తాలిబన్లకు మానవ వనరులను అందిస్తున్నాయి. పంజాబ్ ప్రావిన్స్ నుంచి 'పోరాట యోధుల'ను అఫ్గాన్​కు పంపుతున్నాయి. ఇటీవల తాలిబన్లు చేపట్టిన వివిధ ఆపరేషన్లలో జైషే, లష్కరే భాగమయ్యారని వార్తలు వస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో ముష్కరులు కనిపించినట్లు పలు కథనాలు వెలువడుతున్నాయి. ఐరాస భద్రతా మండలి నివేదిక సైతం ఈ విషయాన్ని ప్రస్తావించింది. ఈ రెండు సంస్థలు పాకిస్థాన్ నుంచే పనిచేయడం, భారత్​ను లక్ష్యంగా చేసుకొనే కార్యకలాపాలు సాగించడం గమనార్హం.

"లష్కరే, జైషే సంస్థలు పోరాట ఉగ్రవాదులను అఫ్గానిస్థాన్​కు పంపిస్తోంది. సలహాదారులు, శిక్షకులు, పేలుడు పదార్థాల తయారీలో నిపుణులు ఇందులో ఉంటున్నారు. ప్రభుత్వ అధికారులు, ఇతరులను లక్ష్యంగా చేసుకొని హతమార్చడం వెనక ఈ రెండు ఉగ్రసంస్థలదే హస్తం."

-ఐరాస భద్రతా మండలి

ఐరాస పత్రాల ప్రకారం.. నంగర్హార్ ప్రావిన్సులోనే 800 మంది లష్కరే తొయిబా, 200 మంది జైషే ముష్కరులు ఉన్నారు. మహమంద్ దరా, దుర్ బాబా, షెర్జాద్ జిల్లాల్లో వీరంతా మోహరించారు. కునార్ అనే మరో రాష్ట్రంలోనూ ఈ రెండు ముష్కర ముఠాలకు చెందిన ఉగ్రవాదులు భారీగా పోగయ్యారు. దీన్ని బట్టి నిధులు, ఆయుధాలు, రిక్రూట్​మెంట్ విషయంలో తాలిబన్లకు ఎలాంటి ఇబ్బందులు లేవని అర్థమవుతోందని ఐరాస భద్రతా మండలి పత్రాలు పేర్కొంటున్నాయి.

గతంలోనూ..

తాలిబన్లతో జైషే, లష్కరే ముష్కరుల సంబంధాలు ప్రపంచానికి తెలియనివేం కాదు. 2020 ఏప్రిల్ 13-14 తేదీల్లో అఫ్గాన్ నేషనల్ డైరెక్టరేట్ ఆఫ్ సెక్యూరిటీ(ఎన్​డీఎస్) కమాండో బృందం.. పాక్ సరిహద్దుకు సమీపంలోని మొమంద్ దరాలో ఉన్న తాలిబన్ క్యాంప్​పై దాడి చేసింది. ఈ ఎన్​కౌంటర్​లో 15 మంది ఉగ్రవాదులు మరణిస్తే.. అందులో జైషేకు చెందిన ముష్కరులే 10 మంది ఉన్నారు. వీరంతా పాక్, పీఓకేకు చెందినవారే. కశ్మీర్​లో పోరాడేందుకు తాలిబన్లు వీరికి శిక్షణ ఇస్తున్నారు.

లక్ష్యం.. 'కశ్మీర్'

ఇక్కడి శిక్షణా మాడ్యూల్స్ అన్నీ కశ్మీర్ పరిస్థితులను పోలి ఉంటాయి. నంగర్హార్​లో నిర్మించిన క్యాంప్ సైతం నియంత్రణ రేఖ వద్ద ఉండే భూభాగాన్ని తలపించేలా ఉంటుంది. కశ్మీర్​ను భారత్ నుంచి విడగొట్టి పాక్​లో విలీనం చేయాలన్న సంకల్పంతోనే లష్కరే, జైషే సంస్థలు పనిచేస్తున్నాయి. భారత్​లో చాలా సార్లు దాడులకు తెగబడ్డాయి. 2001 భారత పార్లమెంట్​పై దాడి, 2008 ముంబయి దాడులు ఈ ఉగ్ర సంస్థల పనే.

ప్రమాదఘంటికే!

అఫ్గాన్ పొరుగు దేశాల్లో తాలిబన్లతో సంబంధాలు లేని ఏకైక ప్రధాన దేశం భారత్. ఈ నేపథ్యంలో భారత్​పై ఈ పరిణామాలు ఏ విధంగా ప్రభావం చూపిస్తాయనేది ఆసక్తికరంగా మారింది. కచ్చితంగా ఇది ప్రమాదఘంటికేనని తెలుస్తోంది.

(రచయిత- సంజీవ్ బారువా)

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.