ETV Bharat / bharat

కాలేజీకి వెళ్లిన విద్యార్థినిని ఎత్తుకెళ్లి గ్యాంగ్​ రేప్​

author img

By

Published : Mar 7, 2022, 2:24 PM IST

UP Gang rape news: ఆటోలో వచ్చిన ముగ్గురు దుండగులు కళాశాల నుంచి వస్తున్న విద్యార్థినిని అపహరించి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ దుశ్చర్యను వీడియో తీశారు. బాధితురాలి వద్ద ఉన్న నగదును లాక్కుని ఊరి సమీపంలో వదిలేసి పారిపోయారు. ఈ దుర్ఘటన ఉత్తర్​ప్రదేశ్​, ఆగ్రా జిల్లాలో ఆదివారం జరిగింది.

Gang rape
అత్యాచారం

UP Gang rape news: కళాశాలకు వెళ్లి తిరిగి వస్తున్న విద్యార్థినిని అపహరించి ముగ్గురు దుండగులు సామూహిక అత్యాచారానికి పాల్పడిన దుర్ఘటన ఉత్తర్​ప్రదేశ్​, ఆగ్రా జిల్లాలో ఎత్మాదపుర్​ పోలీస్​ స్టేషన్​ పరిధిలో జరిగింది. ఆటోలో వచ్చిన దుండగులు ఈ దుశ్చర్యకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు.

ఇదీ జరిగింది..

ఫిరోజాబాద్​​ జిల్లాలోని ఓ గ్రామానికి చెందిన బాధితురాలు బీకామ్​ చదువుతోంది. దరఖాస్తు సమర్పించేందుకు ఆదివారం ఆగ్రా జిల్లాలోని కళాశాలకు వెళ్లింది. కానీ, కాలేజీ మూసి ఉండటం వల్ల తిరుగు పయనమైంది. ఈ క్రమంలో ముగ్గురు వ్యక్తులు ఆటోలో వచ్చి విద్యార్థినిని అపహరించారు. అక్కడి నుంచి సమీపంలోని అటవీ ప్రాంతానికి తీసుకెళ్లి.. సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. వారి దుశ్చర్యను వీడియో తీశారు.

ఆ తర్వాత టూండ్లా పోలీస్​ స్టేషన్​ పరిధిలోని బాధితురాలి గ్రామం సమీపంలో వదిలేసి పారిపోయారు. అక్కడి నుంచి ఇల్లు చేరిన బాధితురాలు తనపై జరిగిన అఘాయిత్యాన్ని కుటుంబ సభ్యులకు వివరించింది. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు బాధితురాలి తండ్రి. సమాచారం అందుకున్న ఆగ్రా ఎస్పీ సత్యజిత్​ గుప్తా.. ఘటనాస్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. బాధితురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు ముగ్గురిపై ఆదివారం రాత్రి కేసు నమోదు చేశారు.

నిందితుల్లో ఒకరి చేతిపై భూరా యాదవ్​ అని రాసి ఉందని, నిందితులను తాను గుర్తుపడతానని బాధితురాలు చెప్పినట్లు ఎస్పీ తెలిపారు. అఘాయిత్యానికి పాల్పడి వీడియో తీసి, ఆమె నుంచి డబ్బులు లాక్కున్నారని చెప్పారు. బాధితురాలిని చికిత్స కోసం పంపించామన్నారు. నిందితులను పట్టుకునేందుకు మూడు బృందాలను ఏర్పాటు చేసి గాలిస్తున్నామని చెప్పారు.

ఇదీ చూడండి: ఆరేళ్ల బాలికపై 14 ఏళ్ల బాలుడు అత్యాచారం

UP Gang rape news: కళాశాలకు వెళ్లి తిరిగి వస్తున్న విద్యార్థినిని అపహరించి ముగ్గురు దుండగులు సామూహిక అత్యాచారానికి పాల్పడిన దుర్ఘటన ఉత్తర్​ప్రదేశ్​, ఆగ్రా జిల్లాలో ఎత్మాదపుర్​ పోలీస్​ స్టేషన్​ పరిధిలో జరిగింది. ఆటోలో వచ్చిన దుండగులు ఈ దుశ్చర్యకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు.

ఇదీ జరిగింది..

ఫిరోజాబాద్​​ జిల్లాలోని ఓ గ్రామానికి చెందిన బాధితురాలు బీకామ్​ చదువుతోంది. దరఖాస్తు సమర్పించేందుకు ఆదివారం ఆగ్రా జిల్లాలోని కళాశాలకు వెళ్లింది. కానీ, కాలేజీ మూసి ఉండటం వల్ల తిరుగు పయనమైంది. ఈ క్రమంలో ముగ్గురు వ్యక్తులు ఆటోలో వచ్చి విద్యార్థినిని అపహరించారు. అక్కడి నుంచి సమీపంలోని అటవీ ప్రాంతానికి తీసుకెళ్లి.. సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. వారి దుశ్చర్యను వీడియో తీశారు.

ఆ తర్వాత టూండ్లా పోలీస్​ స్టేషన్​ పరిధిలోని బాధితురాలి గ్రామం సమీపంలో వదిలేసి పారిపోయారు. అక్కడి నుంచి ఇల్లు చేరిన బాధితురాలు తనపై జరిగిన అఘాయిత్యాన్ని కుటుంబ సభ్యులకు వివరించింది. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు బాధితురాలి తండ్రి. సమాచారం అందుకున్న ఆగ్రా ఎస్పీ సత్యజిత్​ గుప్తా.. ఘటనాస్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. బాధితురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు ముగ్గురిపై ఆదివారం రాత్రి కేసు నమోదు చేశారు.

నిందితుల్లో ఒకరి చేతిపై భూరా యాదవ్​ అని రాసి ఉందని, నిందితులను తాను గుర్తుపడతానని బాధితురాలు చెప్పినట్లు ఎస్పీ తెలిపారు. అఘాయిత్యానికి పాల్పడి వీడియో తీసి, ఆమె నుంచి డబ్బులు లాక్కున్నారని చెప్పారు. బాధితురాలిని చికిత్స కోసం పంపించామన్నారు. నిందితులను పట్టుకునేందుకు మూడు బృందాలను ఏర్పాటు చేసి గాలిస్తున్నామని చెప్పారు.

ఇదీ చూడండి: ఆరేళ్ల బాలికపై 14 ఏళ్ల బాలుడు అత్యాచారం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.