మహారాష్ట్రలో కొత్త కేసుల సంఖ్య తగ్గింది. అయినప్పటికీ.. మరణాలు మాత్రం భారీగానే నమోదయ్యాయి. తాజాగా 51,880 కేసులు నమోదవగా.. 891 మంది ప్రాణాలు కోల్పోయారు. ఒక్కరోజే 65,934 మంది కోలుకోవడం విశేషం.
కర్ణాటకలోనూ కొవిడ్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. ఒక్కరోజే 44,631 మంది వైరస్ బారిన పడ్డారు. మరో 292 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 24 మందికిపైగా వైరస్ను జయించారు. ఫలితంగా రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 17 లక్షలకు చేరువైంది.
వివిధ రాష్ట్రాల్లో కేసులు, మరణాల వివరాలు..
- కేరళలో తాజాగా 37,190 మందికి పాజిటివ్గా తేలింది. మరో 118 మంది చనిపోయారు.
- తమిళనాడులో ఒక్కరోజే 21,228 మందికి వైరస్ సోకగా.. మరో 144 మంది మృతి చెందారు.
- రాజస్థాన్లో కొత్తగా 16,984 కేసులు నమోదవగా.. మరో 154 మంది మరణించారు.
- ఉత్తర్ప్రదేశ్లో తొలిసారిగా 350పైగా కొవిడ్ మరణాలు నమోదయ్యాయి. మరో 12,500 మంది కరోనా బారినపడ్డారు.
- బంగాల్లో మరో 17,639 మంది పాజిటివ్గా తేలగా.. మరో 107 మంది ప్రాణాలు కోల్పోయారు.
ఇదీ చూడండి: సామాజిక ఉద్యమకారుడు ట్రాఫిక్ రామస్వామి కన్నుమూత