ETV Bharat / bharat

కుమారుడి కోసం కిడ్నాపర్లకు రూ.3 కోట్లు ఇచ్చి...

ఓ రైస్​మిల్​ ఓనర్​ కుమారుడు కిడ్నాప్​ అయ్యాడు. దీంతో కిడ్నాపర్లు అడిగిన విధంగా ఆ తండ్రి రూ. మూడు కోట్లు చెల్లించి అతడ్ని విడిపించుకున్నారు. ఆపై పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఈ ఘటన తమిళనాడులో జరిగింది.

author img

By

Published : Aug 24, 2021, 3:41 PM IST

Son of a businessman was rescued
తమిళనాడులో కిడ్నాప్​ కలకలం

తమిళనాడు తిరుప్పుర్​ జిల్లాలోని ఈశ్వరమూర్తి అనే రైస్​ మిల్​ యజమాని కుమారుడు శివప్రసాద్​ను కొందరు గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్​ చేశారు. రూ. 3 కోట్లు చెల్లించి విడిపించుకోవాలని బెదిరించారు. దీనిపై పోలీసులకు ఎటువంటి సమాచారం ఇవ్వకుండా.. అడిగిన మొత్తాన్ని ఇచ్చి కొడుకును విడిపించుకున్నారు ఈశ్వర మూర్తి.

ఇదీ జరిగింది..

తమిళనాడు కంగేయంలోని గౌండన్​పాళెంకు చెందిన ఈశ్వరమూర్తి కుమారుడు శివ ప్రదీప్​(25)ను గుర్తు తెలియని వ్యక్తులు ఆగస్టు 22వ తేదీన కిడ్నాప్​ చేశారు. రూ. మూడు కోట్లు ఇస్తేకానీ ప్రదీప్​ను విడిచి పెట్టమని తేల్చి చెప్పారు. పోలీసులకు చెప్పకూడదని బెదిరించారు. దీంతో అధికారులకు ఎటువంటి సమాచారం ఇవ్వకుండా కిడ్నాపర్లు అడిగిన మొత్తాన్ని చెల్లించారు. దీంతో ప్రదీప్​ను మదురై సమీపంలో విడిచిపెట్టి వెళ్లింది ఆ ముఠా.

businessman son kidnap cases in tirupur
పోలీసుల అదుపులో నిందితులు

అనంతరం పోలీసులకు సమాచారం అందించారు ఈశ్వరమూర్తి. జిల్లా ఎస్​పీ కుమారేశన్​ ఆదేశాల మేరకు 8 ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి. ఈ ముఠాలో పది మంది సభ్యులు ఉండగా వారిలో నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి సుమారు రూ. కోటీ 89 లక్షలను స్వాధీనం చేసుకున్నారు.

ఇదీ చూడండి: 'చికెన్​ ఫ్రై' బాగా వండలేదని భార్యను చంపేశాడు!

తమిళనాడు తిరుప్పుర్​ జిల్లాలోని ఈశ్వరమూర్తి అనే రైస్​ మిల్​ యజమాని కుమారుడు శివప్రసాద్​ను కొందరు గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్​ చేశారు. రూ. 3 కోట్లు చెల్లించి విడిపించుకోవాలని బెదిరించారు. దీనిపై పోలీసులకు ఎటువంటి సమాచారం ఇవ్వకుండా.. అడిగిన మొత్తాన్ని ఇచ్చి కొడుకును విడిపించుకున్నారు ఈశ్వర మూర్తి.

ఇదీ జరిగింది..

తమిళనాడు కంగేయంలోని గౌండన్​పాళెంకు చెందిన ఈశ్వరమూర్తి కుమారుడు శివ ప్రదీప్​(25)ను గుర్తు తెలియని వ్యక్తులు ఆగస్టు 22వ తేదీన కిడ్నాప్​ చేశారు. రూ. మూడు కోట్లు ఇస్తేకానీ ప్రదీప్​ను విడిచి పెట్టమని తేల్చి చెప్పారు. పోలీసులకు చెప్పకూడదని బెదిరించారు. దీంతో అధికారులకు ఎటువంటి సమాచారం ఇవ్వకుండా కిడ్నాపర్లు అడిగిన మొత్తాన్ని చెల్లించారు. దీంతో ప్రదీప్​ను మదురై సమీపంలో విడిచిపెట్టి వెళ్లింది ఆ ముఠా.

businessman son kidnap cases in tirupur
పోలీసుల అదుపులో నిందితులు

అనంతరం పోలీసులకు సమాచారం అందించారు ఈశ్వరమూర్తి. జిల్లా ఎస్​పీ కుమారేశన్​ ఆదేశాల మేరకు 8 ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి. ఈ ముఠాలో పది మంది సభ్యులు ఉండగా వారిలో నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి సుమారు రూ. కోటీ 89 లక్షలను స్వాధీనం చేసుకున్నారు.

ఇదీ చూడండి: 'చికెన్​ ఫ్రై' బాగా వండలేదని భార్యను చంపేశాడు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.