ETV Bharat / bharat

పాతికేళ్ల ప్రాయంలోనే చెదిరిన కలలు.. విధి ఆడిన వింతనాటకానికి బలైన ప్రాణాలు

author img

By

Published : Mar 17, 2023, 1:23 PM IST

Secunderabad Swapna lok fire accident: పాతికేళ్లైనా నిండని ప్రాయంలోనే సొంతకాళ్లపై నిలబడాలనే తాపత్రయం. పిన్నవయసులోనే కుటుంబ బాధ్యతలు భుజానకెత్తుకుని తోటివారికి స్ఫూర్తిగా నిలిచే ఆదర్శప్రాయం. పుట్టిన ఊళ్ల నుంచి ఎన్నో కలలతో నగరానికి వచ్చి.. విధి ఆడిన వింతనాటకానికి బలైన విషాదాంతం. సికింద్రాబాద్‌ స్వప్నలోక్ అగ్నిప్రమాదంలో ప్రాణాలు కోల్పోయి తమ వారికి తీరని వేదన మిగిల్చిన ఆరుగురు యువతీయువకుల చివరి క్షణాలు అత్యంత విషాదంగా ముగిశాయి.

Etv Bharat
Etv Bharat

Secunderabad Swapna lok fire accident: కనుచూపు మేరల్లో కమ్మేసిన పొగ. అగ్నికీలల్లా ఎగిసిపడుతున్న మంటలు. పారిపోయే దారిలేదు. సాయం చేసే నాథుడు లేడు. ఇలాంటి నిస్సహాయ స్థితిలో ప్రాణాలు కాపాడుకునేందుకు గదిలో దాక్కుని ప్రాణాలు పోగొట్టుకున్నారు. ఆరుగురు యువతీయువకులు నిన్న సాయంత్రం ఉద్యోగులంతా విధులు ముగించుకుని తిరిగి వెళ్లే సమయంలో సికింద్రాబాద్‌ స్వప్నలోక్‌లో చెలరేగిన మంటల్లో దాదాపు అందరూ ప్రాణాలతో బయటపడినా.. ఓ 15మంది మాత్రం పైఅంతస్తుల్లోనే ఉండిపోయారు.

Secunderabad Swapna lok fire accident Victims : భారీ క్రేన్ల సాయంతో పైకివెళ్లిన అగ్నిమాపక సిబ్బంది అతి కష్టం మీద వారిని బయటికి తీసుకువచ్చినా బాత్‌రూంలో దాక్కున్న ఆరుగురు యువతీయువకులు ప్రమీల, శివ, వెన్నెల, త్రివేణి, శ్రావణి, ప్రశాంత్‌ మాత్రం అప్పటికే అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారు. వీరందరిని క్రేన్ల సాయంతో కిందకు తీసుకువచ్చిన అగ్నిమాపక సిబ్బంది హుటాహుటీని గాంధీ ఆస్పత్రికి తరలించారు. కానీ అప్పటికే పరిస్థితి చేయిదాటిపోయింది. దట్టమైన పొగ కారణంగా ఊపిరి ఆడకపోవటంతో అప్పటికే ఆరుగురు చనిపోయినట్లు వైద్యులు వెల్లడించారు.

యువతీయువకుల వివరాలు: మృతిచెందిన వారిలో వరంగల్‌ జిల్లా నర్సంపేట్‌ ప్రాంతానికి చెందిన ముగ్గురు వ్యక్తులు ఉండగా మహబూబాబాద్‌కు చెందిన ఇద్దరు మరొకరు ఖమ్మం జిల్లాకు చెందిన వారున్నారు. వరంగల్ జిల్లా ఖానాపురం మండలం టేకులతండాకు చెందిన శ్రావణి, దుగ్గొండి మండలం మర్రిపల్లికి చెందిన వెన్నెల, నర్సంపేట మండలం చంద్రయ్యపల్లికి చెందిన ఉప్పల శివ, మహబూబాబాద్ జిల్లా గూడురు మండలం సురేశ్‌నగర్‌ తండాకు చెందిన ప్రమీల, కేసముద్రం మండలం ఇంటికన్నె గ్రామానికి చెందిన ప్రశాంత్‌తో పాటు ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం శుద్ధపల్లికి చెందిన త్రివేణి పాతికేళ్ల లోపే వయసున్న ఈ యువతీయువకులంతా స్వప్నలోక్‌లో ఉన్న కాల్ సెంటర్ BM-5 కార్యాలయంలో విధులు నిర్వర్తిస్తున్నారు. త్రివేణి తండ్రి ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తుండగా.. కుటుంబానికి చేదోడుగా ఉండేందుకు తాను ఉద్యోగం హైదరాబాద్‌లో ఉద్యోగం చేస్తోంది.

తల్లిదండ్రుల ఆవేదన: ప్రశాంత్‌ ఆర్మీ ఉద్యోగానికి ఎంపికైనప్పటికీ వెళ్లకుండా స్థానికంగా పోలీస్‌ ఉద్యోగాలకు సన్నద్ధమయ్యే వారికి శిక్షణ ఇస్తుండేవాడు. ఈ క్రమంలోనే తానూ ఇక్కడే ఉద్యోగంలో చేరాడు.హైదరాబాద్‌లో ఉద్యోగం చేస్తున్న యువతీయువకులు నిన్న అగ్ని ప్రమాదంలో మృతిచెందటంతో వారి స్వగ్రామాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి. సమాచారం తెలిసిన వెంటనే హైదరాబాద్‌కు చేరుకున్న వారి కుటుంబసభ్యులు గాంధీ ఆస్పత్రి మార్చురీలో విగతజీవులాగా పడి ఉన్న తమబిడ్డలను చూసి గుండెలుబాదుకున్నారు.

ఐదు లక్షలు పరిహారం: యువతీయువకుల మృతదేహాలను కుటుంబసభ్యులకు అప్పగించే వేళ గాంధీ ఆస్పత్రిలో ఉద్విగ్న వాతావరణం నెలకొంది. అగ్నిప్రమాద ఘటనపై ముఖ్యమంత్రి కేసీఆర్​ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపిన ఆయన వారికి ఆర్థిక సాయం ప్రకటించారు. ఒక్కో కుటుంబానికి రూ.5 లక్షలు పరిహారం అందిస్తామని మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ వెల్లడించారు. కాగా ఈ యువతీయువకుల మృతికి ప్రధాన కారణం వారు బాత్‌రూంలో దాక్కోవటమేనని అగ్నిమాపకశాఖ అధికారులు చెబుతున్నారు. విపత్తువేళ ఇరుకైన గదిలోకి వెళ్లటంతో ఊపిరి ఆడలేదని ఇలాంటి సమయంలో వీలైనంత వరకు బయటికి వచ్చేందుకు ప్రయత్నించాలని సూచిస్తున్నారు.

ఇవీ చదవండి:

Secunderabad Swapna lok fire accident: కనుచూపు మేరల్లో కమ్మేసిన పొగ. అగ్నికీలల్లా ఎగిసిపడుతున్న మంటలు. పారిపోయే దారిలేదు. సాయం చేసే నాథుడు లేడు. ఇలాంటి నిస్సహాయ స్థితిలో ప్రాణాలు కాపాడుకునేందుకు గదిలో దాక్కుని ప్రాణాలు పోగొట్టుకున్నారు. ఆరుగురు యువతీయువకులు నిన్న సాయంత్రం ఉద్యోగులంతా విధులు ముగించుకుని తిరిగి వెళ్లే సమయంలో సికింద్రాబాద్‌ స్వప్నలోక్‌లో చెలరేగిన మంటల్లో దాదాపు అందరూ ప్రాణాలతో బయటపడినా.. ఓ 15మంది మాత్రం పైఅంతస్తుల్లోనే ఉండిపోయారు.

Secunderabad Swapna lok fire accident Victims : భారీ క్రేన్ల సాయంతో పైకివెళ్లిన అగ్నిమాపక సిబ్బంది అతి కష్టం మీద వారిని బయటికి తీసుకువచ్చినా బాత్‌రూంలో దాక్కున్న ఆరుగురు యువతీయువకులు ప్రమీల, శివ, వెన్నెల, త్రివేణి, శ్రావణి, ప్రశాంత్‌ మాత్రం అప్పటికే అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారు. వీరందరిని క్రేన్ల సాయంతో కిందకు తీసుకువచ్చిన అగ్నిమాపక సిబ్బంది హుటాహుటీని గాంధీ ఆస్పత్రికి తరలించారు. కానీ అప్పటికే పరిస్థితి చేయిదాటిపోయింది. దట్టమైన పొగ కారణంగా ఊపిరి ఆడకపోవటంతో అప్పటికే ఆరుగురు చనిపోయినట్లు వైద్యులు వెల్లడించారు.

యువతీయువకుల వివరాలు: మృతిచెందిన వారిలో వరంగల్‌ జిల్లా నర్సంపేట్‌ ప్రాంతానికి చెందిన ముగ్గురు వ్యక్తులు ఉండగా మహబూబాబాద్‌కు చెందిన ఇద్దరు మరొకరు ఖమ్మం జిల్లాకు చెందిన వారున్నారు. వరంగల్ జిల్లా ఖానాపురం మండలం టేకులతండాకు చెందిన శ్రావణి, దుగ్గొండి మండలం మర్రిపల్లికి చెందిన వెన్నెల, నర్సంపేట మండలం చంద్రయ్యపల్లికి చెందిన ఉప్పల శివ, మహబూబాబాద్ జిల్లా గూడురు మండలం సురేశ్‌నగర్‌ తండాకు చెందిన ప్రమీల, కేసముద్రం మండలం ఇంటికన్నె గ్రామానికి చెందిన ప్రశాంత్‌తో పాటు ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం శుద్ధపల్లికి చెందిన త్రివేణి పాతికేళ్ల లోపే వయసున్న ఈ యువతీయువకులంతా స్వప్నలోక్‌లో ఉన్న కాల్ సెంటర్ BM-5 కార్యాలయంలో విధులు నిర్వర్తిస్తున్నారు. త్రివేణి తండ్రి ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తుండగా.. కుటుంబానికి చేదోడుగా ఉండేందుకు తాను ఉద్యోగం హైదరాబాద్‌లో ఉద్యోగం చేస్తోంది.

తల్లిదండ్రుల ఆవేదన: ప్రశాంత్‌ ఆర్మీ ఉద్యోగానికి ఎంపికైనప్పటికీ వెళ్లకుండా స్థానికంగా పోలీస్‌ ఉద్యోగాలకు సన్నద్ధమయ్యే వారికి శిక్షణ ఇస్తుండేవాడు. ఈ క్రమంలోనే తానూ ఇక్కడే ఉద్యోగంలో చేరాడు.హైదరాబాద్‌లో ఉద్యోగం చేస్తున్న యువతీయువకులు నిన్న అగ్ని ప్రమాదంలో మృతిచెందటంతో వారి స్వగ్రామాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి. సమాచారం తెలిసిన వెంటనే హైదరాబాద్‌కు చేరుకున్న వారి కుటుంబసభ్యులు గాంధీ ఆస్పత్రి మార్చురీలో విగతజీవులాగా పడి ఉన్న తమబిడ్డలను చూసి గుండెలుబాదుకున్నారు.

ఐదు లక్షలు పరిహారం: యువతీయువకుల మృతదేహాలను కుటుంబసభ్యులకు అప్పగించే వేళ గాంధీ ఆస్పత్రిలో ఉద్విగ్న వాతావరణం నెలకొంది. అగ్నిప్రమాద ఘటనపై ముఖ్యమంత్రి కేసీఆర్​ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపిన ఆయన వారికి ఆర్థిక సాయం ప్రకటించారు. ఒక్కో కుటుంబానికి రూ.5 లక్షలు పరిహారం అందిస్తామని మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ వెల్లడించారు. కాగా ఈ యువతీయువకుల మృతికి ప్రధాన కారణం వారు బాత్‌రూంలో దాక్కోవటమేనని అగ్నిమాపకశాఖ అధికారులు చెబుతున్నారు. విపత్తువేళ ఇరుకైన గదిలోకి వెళ్లటంతో ఊపిరి ఆడలేదని ఇలాంటి సమయంలో వీలైనంత వరకు బయటికి వచ్చేందుకు ప్రయత్నించాలని సూచిస్తున్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.