ETV Bharat / bharat

ఆ విమానాశ్రయాల్లో భద్రత కట్టుదిట్టం- కారణమదే?

author img

By

Published : Feb 1, 2021, 3:06 PM IST

బెదిరింపు ఫోన్​కాల్​తో తమిళనాడులోని తిరుచిరాపల్లి, చెన్నై విమానాశ్రయాల్లో భద్రతను మరింత పెంచారు అధికారులు. తిరుచిరాపల్లి విమానాశ్రయంలో బాంబు ఉన్నట్టు కాల్​ రాగా.. దాన్ని వెతికే క్రమంలో తక్షణమే ఆ ప్రాంగణాన్ని ఖాళీ చేయించారు.

Security stepped up at Tiruchirappally, Chennai airports after threat call
ఆ విమానాశ్రయాలలో భద్రత కట్టుదిట్టం- కారణమదే?

తమిళనాడులోని తిరుచిరాపల్లి విమానాశ్రయంలో బాంబు వార్త సోమవారం కలకలం రేపింది. దీంతో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు అధికారులు. విమానాశ్రయంలో బాంబు ఉన్నట్టు గుర్తుతెలియని వ్యక్తి నుంచి ఓ బెదిరింపు కాల్​​ రావడం వల్ల.. ఈ మేరకు చర్యలు తీసుకున్నారు. అనంతరం.. చెన్నై విమానాశ్రయంలోనూ భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు.

అప్రమత్తమైన అధికారులు.. విమానాశ్రయంలోని 200 మంది ప్రయాణికులను అక్కడి నుంచి తరలించారు. ప్రాంగణ ప్రాంతంలో కేంద్ర పారిశ్రామిక భద్రతా సిబ్బంది(సీఐఎస్​ఎఫ్​), పోలీసుల బృందంతో పాటు స్నైఫర్​ డాగ్స్​, మెటల్​ డిటెక్టర్లు భద్రతా చర్యలు చేపట్టాయి.

తమిళనాడులోని తిరుచిరాపల్లి విమానాశ్రయంలో బాంబు వార్త సోమవారం కలకలం రేపింది. దీంతో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు అధికారులు. విమానాశ్రయంలో బాంబు ఉన్నట్టు గుర్తుతెలియని వ్యక్తి నుంచి ఓ బెదిరింపు కాల్​​ రావడం వల్ల.. ఈ మేరకు చర్యలు తీసుకున్నారు. అనంతరం.. చెన్నై విమానాశ్రయంలోనూ భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు.

అప్రమత్తమైన అధికారులు.. విమానాశ్రయంలోని 200 మంది ప్రయాణికులను అక్కడి నుంచి తరలించారు. ప్రాంగణ ప్రాంతంలో కేంద్ర పారిశ్రామిక భద్రతా సిబ్బంది(సీఐఎస్​ఎఫ్​), పోలీసుల బృందంతో పాటు స్నైఫర్​ డాగ్స్​, మెటల్​ డిటెక్టర్లు భద్రతా చర్యలు చేపట్టాయి.

ఇదీ చదవండి: ఆర్నెల్లుగా బంధీగా వృద్ధ జంట- అసలేం జరిగింది?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.