ETV Bharat / bharat

మొబైల్​ టాయిలెట్లుగా పాత బస్సులు! - కర్ణాటక ఆర్టీసీ తాజా వార్తలు

పాత బస్సులను మొబైల్​ టాయిలెట్లుగా మార్చాలని నిర్ణయించింది కర్ణాటక ఆర్టీసీ. ఈ మేరకు తొలుత.. కొన్ని బస్సులను మహిళా మరుగుదొడ్లుగా మార్పులు చేసిన ఆర్టీసీ.. త్వరలోనే మరిన్ని బస్సులను సిద్ధం చేసేందుకు సన్నద్ధమవుతోంది. రాష్ట్రంలో ఏవైనా ఉత్సవాలు నిర్వహించినప్పుడు సుదూర ప్రాంతాల నుంచి వచ్చే మహిళలను దృష్టిలో ఉంచుకుని ఈ చర్యలు చేపట్టామని ఆర్టీసీ ఛైర్మన్​ తెలిపారు.

Mobile ladies Toilets
మహిళా​ మొబైల్​ టాయిలెట్లు
author img

By

Published : Apr 16, 2021, 8:19 PM IST

కాలం చెల్లిన బస్సులను పునరుద్ధరించి మహిళా మొబైల్​ టాయిలెట్లుగా మార్చాలని ఈశాన్య కర్ణాటక ట్రాన్స్​పోర్ట్​ కార్పొరేషన్(ఎన్​ఎస్​డబ్ల్యూఆర్టీసీ) నిర్ణయించింది. ఎన్​ఎస్​డబ్ల్యూఆర్టీసీ ప్రాంతీయ కార్యాలయం నుంచి తుది అనుమతి లభించగానే.. ఈ టాయిలెట్​ బస్సులు బహిరంగ వినియోగానికి రానున్నాయి.

ఎలా చేశారంటే?

బయటివైపు ఆకుపచ్చ, గులాబీ రంగులతో కూడిన ఈ బస్సు లోపలి భాగంలో.. రెండు భారతీయ సంప్రదాయ మరగుదొడ్లతో సహా మొత్తం నాలుగు టాయిలెట్లను ఏర్పాటుచేశారు. అంతే కాకుండా రెండు వాష్​ బేసిన్లు, ఓ అద్దం అమర్చారు. బస్సు వెనకాల వైపు.. పిల్లల సంరక్షణకు, విశ్రాంతి తీసుకునేందుకు వేరు వేరు గదులను రూపొందించారు. ఒక్క డ్రైవర్​ సీటు మినహా.. మిగిలినవన్నీ తొలగించేసి భారీ మార్పులు చేశారు. డ్రైవర్​ సీటు పక్కన ఓ నీటి ట్యాంకు ఉంచారు. విద్యుత్​ సరఫరా కోసం యూపీఎస్​ బ్యాటరీ, 4 మరుగుదొడ్లలో విడిగా ఎగ్జాస్ట్​ ఫ్యాన్​లను అమర్చారు.

ఇదీ చదవండి:కంటైనర్​లో మంటలు- ఇద్దరు సజీవ దహనం

ఉత్సవాల కోసం..

రాష్ట్రంలో ఏవైనా ఉత్సవాలు నిర్వహించినప్పుడు సుదూర ప్రాంతాల నుంచి వచ్చే మహిళలను దృష్టిలో ఉంచుకుని వారికి ఇబ్బంది కలగకుండా ఉండేందుకు వీటిని తయారు చేసినట్టు ఎన్​ఎస్​డబ్ల్యూఆర్టీసీ ఛైర్మన్​ వీఎస్​ పాటిల్​ తెలిపారు. ముఖ్యంగా.. పసిపిల్లలకు పాలిచ్చే తల్లులను దృష్టిలో ఉంచుకుని వీటిని రూపొందించామన్నారు. ఇవి వాడకంలోకి వచ్చాక వినియోగదారుల ప్రతిస్పందనను బట్టి.. రానున్న కాలంలో మరిన్ని బస్సులను మొబైల్​ టాయిలెట్లుగా మార్చేందుకు యోచిస్తామని ఆయన చెప్పారు.

ఇదీ చదవండి: ఓఎల్​ఎక్స్​లో రెమ్‌‌డెసివిర్‌ ఇంజెక్షన్లు

కాలం చెల్లిన బస్సులను పునరుద్ధరించి మహిళా మొబైల్​ టాయిలెట్లుగా మార్చాలని ఈశాన్య కర్ణాటక ట్రాన్స్​పోర్ట్​ కార్పొరేషన్(ఎన్​ఎస్​డబ్ల్యూఆర్టీసీ) నిర్ణయించింది. ఎన్​ఎస్​డబ్ల్యూఆర్టీసీ ప్రాంతీయ కార్యాలయం నుంచి తుది అనుమతి లభించగానే.. ఈ టాయిలెట్​ బస్సులు బహిరంగ వినియోగానికి రానున్నాయి.

ఎలా చేశారంటే?

బయటివైపు ఆకుపచ్చ, గులాబీ రంగులతో కూడిన ఈ బస్సు లోపలి భాగంలో.. రెండు భారతీయ సంప్రదాయ మరగుదొడ్లతో సహా మొత్తం నాలుగు టాయిలెట్లను ఏర్పాటుచేశారు. అంతే కాకుండా రెండు వాష్​ బేసిన్లు, ఓ అద్దం అమర్చారు. బస్సు వెనకాల వైపు.. పిల్లల సంరక్షణకు, విశ్రాంతి తీసుకునేందుకు వేరు వేరు గదులను రూపొందించారు. ఒక్క డ్రైవర్​ సీటు మినహా.. మిగిలినవన్నీ తొలగించేసి భారీ మార్పులు చేశారు. డ్రైవర్​ సీటు పక్కన ఓ నీటి ట్యాంకు ఉంచారు. విద్యుత్​ సరఫరా కోసం యూపీఎస్​ బ్యాటరీ, 4 మరుగుదొడ్లలో విడిగా ఎగ్జాస్ట్​ ఫ్యాన్​లను అమర్చారు.

ఇదీ చదవండి:కంటైనర్​లో మంటలు- ఇద్దరు సజీవ దహనం

ఉత్సవాల కోసం..

రాష్ట్రంలో ఏవైనా ఉత్సవాలు నిర్వహించినప్పుడు సుదూర ప్రాంతాల నుంచి వచ్చే మహిళలను దృష్టిలో ఉంచుకుని వారికి ఇబ్బంది కలగకుండా ఉండేందుకు వీటిని తయారు చేసినట్టు ఎన్​ఎస్​డబ్ల్యూఆర్టీసీ ఛైర్మన్​ వీఎస్​ పాటిల్​ తెలిపారు. ముఖ్యంగా.. పసిపిల్లలకు పాలిచ్చే తల్లులను దృష్టిలో ఉంచుకుని వీటిని రూపొందించామన్నారు. ఇవి వాడకంలోకి వచ్చాక వినియోగదారుల ప్రతిస్పందనను బట్టి.. రానున్న కాలంలో మరిన్ని బస్సులను మొబైల్​ టాయిలెట్లుగా మార్చేందుకు యోచిస్తామని ఆయన చెప్పారు.

ఇదీ చదవండి: ఓఎల్​ఎక్స్​లో రెమ్‌‌డెసివిర్‌ ఇంజెక్షన్లు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.