ETV Bharat / bharat

మీడియా ట్రైబ్యునల్ ఏర్పాటుపై కేంద్రానికి నోటీసులు

author img

By

Published : Jan 25, 2021, 4:59 PM IST

మీడియా ట్రైబ్యునల్​ ఏర్పాటుపై తమ అభిప్రాయం తెలపాలని కేంద్ర ప్రభుత్వం, భారత ప్రెస్​ కౌన్సిల్​ను ఆదేశిస్తూ నోటీసులు జారీ చేసింది సుప్రీంకోర్టు.

SC seeks Centre's reply on PIL seeking setting up of media tribunal
మీడియా ట్రైబ్యునల్ ఏర్పాటుపై కేంద్రానికి నోటీసులు

స్వతంత్ర, నియంత్రణ మీడియా ట్రైబ్యునల్ ఏర్పాటు చేయాలన్న పిటిషన్​పై తమ స్పందన తెలియజేయాలని కేంద్ర ప్రభుత్వం, ప్రెస్​ కౌన్సిల్​ ఆఫ్​ ఇండియా సహా ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది సుప్రీం కోర్టు.

మీడియా సంస్థలపై వీక్షకులు చేసే ఫిర్యాదులు వినేందుకు ట్రైబ్యునల్ ఏర్పాటు చేయాలని మహారాష్ట్రకు చెందిన సామాజిక కార్యకర్తలు నిలేష్ నవలఖా, నితిన్ మేమనే పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్​పై సోమవారం విచారణ జరిపిన భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్ఏ బొబ్డే నేతృత్వంలోని ధర్మాసనం ఈ మేరకు ఆదేశించింది.

మీడియా అదుపుతప్పి వ్యవహరిస్తోందని, భావప్రకటనా స్వేచ్ఛా హక్కుకు లోబడేలా దానిని నియంత్రించాల్సిన అవసరం ఉందని పిటిషనర్లు పేర్కొన్నారు. అందుకోసం భారత మాజీ ప్రధాన న్యాయమూర్తి లేదా సుప్రీంకోర్టు జడ్జి అధ్యక్షతన ఓ స్వతంత్ర కమిటీ ఏర్పాటు చేసి న్యాయపరమైన మార్గదర్శకాలను రూపొందించాలని కోరారు. తమ ఉద్దేశం మీడియా హక్కులను అణచివేయడం కాదని తెలిపారు. తప్పుడు సమాచారం, గోప్యత ఉల్లంఘనకు బాధ్యత వహించేలా చేయడమేనని అన్నారు.

ఇదీ చూడండి: దక్షిణాదిలో సుప్రీం ధర్మాసనం అవసరం

స్వతంత్ర, నియంత్రణ మీడియా ట్రైబ్యునల్ ఏర్పాటు చేయాలన్న పిటిషన్​పై తమ స్పందన తెలియజేయాలని కేంద్ర ప్రభుత్వం, ప్రెస్​ కౌన్సిల్​ ఆఫ్​ ఇండియా సహా ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది సుప్రీం కోర్టు.

మీడియా సంస్థలపై వీక్షకులు చేసే ఫిర్యాదులు వినేందుకు ట్రైబ్యునల్ ఏర్పాటు చేయాలని మహారాష్ట్రకు చెందిన సామాజిక కార్యకర్తలు నిలేష్ నవలఖా, నితిన్ మేమనే పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్​పై సోమవారం విచారణ జరిపిన భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్ఏ బొబ్డే నేతృత్వంలోని ధర్మాసనం ఈ మేరకు ఆదేశించింది.

మీడియా అదుపుతప్పి వ్యవహరిస్తోందని, భావప్రకటనా స్వేచ్ఛా హక్కుకు లోబడేలా దానిని నియంత్రించాల్సిన అవసరం ఉందని పిటిషనర్లు పేర్కొన్నారు. అందుకోసం భారత మాజీ ప్రధాన న్యాయమూర్తి లేదా సుప్రీంకోర్టు జడ్జి అధ్యక్షతన ఓ స్వతంత్ర కమిటీ ఏర్పాటు చేసి న్యాయపరమైన మార్గదర్శకాలను రూపొందించాలని కోరారు. తమ ఉద్దేశం మీడియా హక్కులను అణచివేయడం కాదని తెలిపారు. తప్పుడు సమాచారం, గోప్యత ఉల్లంఘనకు బాధ్యత వహించేలా చేయడమేనని అన్నారు.

ఇదీ చూడండి: దక్షిణాదిలో సుప్రీం ధర్మాసనం అవసరం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.