ETV Bharat / bharat

సుప్రీం ధర్మాసనంపై తెలుగు బిడ్డ.. జడ్జిగా జస్టిస్ సంజయ్ కుమార్ ప్రమాణం

తెలుగు బిడ్డ జస్టిస్ పులిగోరు వెంకట సంజయ్ కుమార్.. సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ప్రమాణస్వీకారం చేశారు. ఆయనతో పాటు మరో నలుగురు న్యాయమూర్తులతో ప్రమాణస్వీకారం చేయించారు సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్. వీరి రాకతో సుప్రీంకోర్టులో మొత్తం న్యాయమూర్తుల సంఖ్య 32కు చేరింది.

author img

By

Published : Feb 6, 2023, 11:22 AM IST

Supreme Court New Judges
సుప్రీం కోర్టు నూతన న్యాయమూర్తులు

సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ఎంపికైన తెలుగు బిడ్డ జస్టిస్‌ పులిగోరు వెంకట సంజయ్‌ కుమార్‌​తో భారత ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ ప్రమాణస్వీకారం చేయించారు. మరో నలుగురు న్యాయమూర్తులు జస్టిస్ పంకజ్ మిత్తల్, జస్టిస్ సంజయ్ కరోల్, జస్టిస్ అసనుద్దీన్ అమనుల్లా, మనోజ్ మిశ్రలు సైతం సుప్రీం జడ్జిలుగా ప్రమాణం చేశారు. సుప్రీంకోర్టు ప్రాంగణంలో ఈ కార్యక్రమం జరిగింది. వీరి రాకతో సుప్రీంకోర్టులో మొత్తం న్యాయమూర్తుల సంఖ్య 32కు చేరింది. మరో రెండు స్థానాలు ఖాళీగా ఉన్నాయి.

జస్టిస్‌ సంజయ్‌ కుమార్‌.. ఇదివరకు మణిపుర్‌ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా సేవలందించారు. సీజేఐ జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్‌ నేతృత్వంలోని కొలీజియం గత డిసెంబరు 13న.. జస్టిస్ సంజయ్ సహా అయిదుగురి పేర్లను కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. గతనెల 31న మరో ఇద్దరి పేర్లను సిఫార్సు చేస్తూ- తొలి అయిదుగురి నియామక ప్రకటనను ముందుగా విడుదల చేయాల్సిన విషయాన్ని గుర్తుచేసింది. ఈ నేపథ్యంలోనే వీరి నియామకానికి ఆమోదముద్ర వేస్తూ కేంద్రం ఇటీవలే ప్రకటన విడుదల చేసింది.

ధర్మాసనంపై రెండో తెలుగు వ్యక్తి..
ప్రస్తుతం సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా పనిచేస్తున్న జస్టిస్‌ పమిడిఘంటం శ్రీనరసింహ తర్వాత సర్వోన్నత న్యాయస్థాన ధర్మాసనంపై కూర్చున్న రెండో తెలుగు వ్యక్తి జస్టిస్‌ పులిగోరు వెంకట సంజయ్‌కుమార్‌. సుదీర్ఘకాలం ఏపీ అడ్వకేట్‌ జనరల్‌గా సేవలందించిన ఆయన తండ్రి పి.రామచంద్రారెడ్డిది చిత్తూరు జిల్లా. జస్టిస్‌ సంజయ్‌కుమార్‌ 1963 ఆగస్టు 14న హైదరాబాద్‌లో జన్మించారు. అక్కడే విద్యాభ్యాసం కొనసాగించారు. హైదరాబాద్‌ నిజాం కాలేజీలో డిగ్రీ, దిల్లీ విశ్వవిద్యాలయంలో న్యాయశాస్త్రం చదివారు. 1988లో న్యాయవాదిగా వృత్తి జీవితం ప్రారంభించారు. 2000 నుంచి 2003 వరకు ఉమ్మడి ఏపీ హైకోర్టులో ప్రభుత్వ న్యాయవాదిగా సేవలందించారు. 2008 ఆగస్టు 8న అక్కడే అదనపు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2010 జనవరి 20న శాశ్వత న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టారు. 2019 అక్టోబర్‌ 14న పంజాబ్‌-హరియాణా హైకోర్టుకు బదిలీ అయ్యారు. 2021 ఫిబ్రవరి 12న మణిపుర్‌ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు.

సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ఎంపికైన తెలుగు బిడ్డ జస్టిస్‌ పులిగోరు వెంకట సంజయ్‌ కుమార్‌​తో భారత ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ ప్రమాణస్వీకారం చేయించారు. మరో నలుగురు న్యాయమూర్తులు జస్టిస్ పంకజ్ మిత్తల్, జస్టిస్ సంజయ్ కరోల్, జస్టిస్ అసనుద్దీన్ అమనుల్లా, మనోజ్ మిశ్రలు సైతం సుప్రీం జడ్జిలుగా ప్రమాణం చేశారు. సుప్రీంకోర్టు ప్రాంగణంలో ఈ కార్యక్రమం జరిగింది. వీరి రాకతో సుప్రీంకోర్టులో మొత్తం న్యాయమూర్తుల సంఖ్య 32కు చేరింది. మరో రెండు స్థానాలు ఖాళీగా ఉన్నాయి.

జస్టిస్‌ సంజయ్‌ కుమార్‌.. ఇదివరకు మణిపుర్‌ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా సేవలందించారు. సీజేఐ జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్‌ నేతృత్వంలోని కొలీజియం గత డిసెంబరు 13న.. జస్టిస్ సంజయ్ సహా అయిదుగురి పేర్లను కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. గతనెల 31న మరో ఇద్దరి పేర్లను సిఫార్సు చేస్తూ- తొలి అయిదుగురి నియామక ప్రకటనను ముందుగా విడుదల చేయాల్సిన విషయాన్ని గుర్తుచేసింది. ఈ నేపథ్యంలోనే వీరి నియామకానికి ఆమోదముద్ర వేస్తూ కేంద్రం ఇటీవలే ప్రకటన విడుదల చేసింది.

ధర్మాసనంపై రెండో తెలుగు వ్యక్తి..
ప్రస్తుతం సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా పనిచేస్తున్న జస్టిస్‌ పమిడిఘంటం శ్రీనరసింహ తర్వాత సర్వోన్నత న్యాయస్థాన ధర్మాసనంపై కూర్చున్న రెండో తెలుగు వ్యక్తి జస్టిస్‌ పులిగోరు వెంకట సంజయ్‌కుమార్‌. సుదీర్ఘకాలం ఏపీ అడ్వకేట్‌ జనరల్‌గా సేవలందించిన ఆయన తండ్రి పి.రామచంద్రారెడ్డిది చిత్తూరు జిల్లా. జస్టిస్‌ సంజయ్‌కుమార్‌ 1963 ఆగస్టు 14న హైదరాబాద్‌లో జన్మించారు. అక్కడే విద్యాభ్యాసం కొనసాగించారు. హైదరాబాద్‌ నిజాం కాలేజీలో డిగ్రీ, దిల్లీ విశ్వవిద్యాలయంలో న్యాయశాస్త్రం చదివారు. 1988లో న్యాయవాదిగా వృత్తి జీవితం ప్రారంభించారు. 2000 నుంచి 2003 వరకు ఉమ్మడి ఏపీ హైకోర్టులో ప్రభుత్వ న్యాయవాదిగా సేవలందించారు. 2008 ఆగస్టు 8న అక్కడే అదనపు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2010 జనవరి 20న శాశ్వత న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టారు. 2019 అక్టోబర్‌ 14న పంజాబ్‌-హరియాణా హైకోర్టుకు బదిలీ అయ్యారు. 2021 ఫిబ్రవరి 12న మణిపుర్‌ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.