ETV Bharat / bharat

Sanjay Singh ED Case : 'కోర్టులో అనవసర మాటలు వద్దు.. స్పీచ్​లు ఇవ్వాలనుకుంటే..'.. ఆప్ ఎంపీకి కోర్టు చురకలు

author img

By ETV Bharat Telugu Team

Published : Oct 13, 2023, 10:44 PM IST

Sanjay Singh ED Case Delhi Court : దిల్లీ ఎంపీ సంజయ్ సింగ్​కు న్యాయస్థానంలో అనుకోని పరిణామం ఎదురైంది. అదానీ గురించి ప్రస్తావించిన ఆయన్ను.. న్యాయమూర్తి అడ్డుకొని సున్నితంగా హెచ్చరించారు. కోర్టులో అనవసర స్పీచ్​లు వద్దంటూ స్పష్టం చేశారు.

AAP MP SANJAY SINGH COURT
AAP MP SANJAY SINGH COURT

Sanjay Singh ED Case Delhi Court : దిల్లీ లిక్కర్ పాలసీకి సంబంధించిన మనీ లాండరింగ్‌ కేసులో అరెస్టు అయిన ఆమ్‌ ఆద్మీ పార్టీ ఎంపీ సంజయ్‌ సింగ్‌ కస్టడీని మరోసారి పొడిగించింది దిల్లీ కోర్టు. సంజయ్ జ్యుడీషియల్ కస్టడీని అక్టోబర్‌ 27 వరకు పొడిగిస్తూ దిల్లీలోని రౌస్‌ అవెన్యూ కోర్టు నిర్ణయం వెలువరించింది. ఈ క్రమంలో న్యాయస్థానంలో ఓ అనూహ్య పరిణామం జరిగింది. విచారణ సందర్భంగా అదానీ అంశంపై సంజయ్‌ సింగ్‌ మాట్లాడారు. దీంతో ఆయన్ను అడ్డుకున్న న్యాయస్థానం.. అనవసర విషయాలపై న్యాయస్థానంలో ప్రసంగాలు ఇవ్వొద్దని స్పష్టం చేసింది.

AAP Sanjay Singh Latest News : దిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో మనీలాండరింగ్‌ ఆరోపణలకు సంబంధించి ఆప్‌ ఎంపీ సంజయ్‌ సింగ్‌ను ఎన్​ఫోర్స్​మెంట్ డైరెక్టరేట్ కస్టడీకి తీసుకుంది. ఈ క్రమంలో ఆయన్ను సుమారు ఏడు రోజుల పాటు ప్రశ్నించింది. కస్టడీ గడువు ముగిసిన నేపథ్యంలో.. ఈడీ ఆయన్ను కోర్టులో హాజరుపరిచింది. ఈ నేపథ్యంలో సంజయ్ సింగ్ మాట్లాడారు. తాను గౌతమ్ అదానీపై ఫిర్యాదు చేశానని, ఆ కోణంలో మాత్రం ఈడీ దృష్టిసారించడం లేదని వ్యాఖ్యానించారు. అదానీపై ఫిర్యాదుకు సంబంధించిన ప్రశ్నలను తనను అడగడం లేదని న్యాయస్థానం దృష్టికి తీసుకువచ్చారు.

Delhi Liquor Scam : దిల్లీ లిక్కర్ స్కామ్​లో ట్విస్ట్.. అప్రూవర్​గా మారిన శరత్‌చంద్రారెడ్డి

'ఆ స్పీచ్​లు ఇవ్వాలనుకుంటే..'
ఈ క్రమంలో ప్రత్యేక న్యాయమూర్తి ఎంకే నాగ్‌పాల్‌ జోక్యం చేసుకున్నారు. న్యాయస్థానంలో అనవసర విషయాలు ప్రస్తావించొద్దని సంజయ్ సింగ్​కు హితవు పలికారు. 'అదానీ, ఇతరుల గురించి స్పీచ్‌ ఇవ్వాలనుకుంటే.. ఇక నుంచి మిమ్మల్ని వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా హాజరు పరచాలని ఆదేశిస్తాం' అని న్యాయమూర్తి స్పష్టం చేశారు.

దిల్లీ మద్యం కేసులో మనీలాండరింగ్‌ జరిగినట్లు ఆరోపణలపై ఈడీ దర్యాప్తు చేస్తోంది. ఈ నేపథ్యంలో సంజయ్‌ సింగ్‌ను అక్టోబరు 4న ఈడీ అధికారులు అరెస్టు చేశారు. ఆ మరుసటి రోజు సంజయ్​ను.. దిల్లీలోని రౌస్‌ అవెన్యూ కోర్టులో హాజరు పరిచారు. అనంతరం కస్టడీ కోరగా.. అక్టోబరు 13 వరకు కస్టడీకి అనుమతించింది. తాజాగా ఆ గడువు ముగియడంతో జ్యుడీషియల్‌ కస్టడీని అక్టోబర్‌ 27 వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది.

Delhi Liquor Scam Case AAP MP Arrest : లిక్కర్​ స్కామ్​ కేసులో ఎంపీ సంజయ్​ అరెస్టు.. ఆప్​లో మూడో కీలక నేత..

లిక్కర్ స్కామ్ విలువ రూ.2వేల కోట్ల పైనే.. రాజకీయ నేతలు, బ్యూరోక్రాట్ల హస్తం

Sanjay Singh ED Case Delhi Court : దిల్లీ లిక్కర్ పాలసీకి సంబంధించిన మనీ లాండరింగ్‌ కేసులో అరెస్టు అయిన ఆమ్‌ ఆద్మీ పార్టీ ఎంపీ సంజయ్‌ సింగ్‌ కస్టడీని మరోసారి పొడిగించింది దిల్లీ కోర్టు. సంజయ్ జ్యుడీషియల్ కస్టడీని అక్టోబర్‌ 27 వరకు పొడిగిస్తూ దిల్లీలోని రౌస్‌ అవెన్యూ కోర్టు నిర్ణయం వెలువరించింది. ఈ క్రమంలో న్యాయస్థానంలో ఓ అనూహ్య పరిణామం జరిగింది. విచారణ సందర్భంగా అదానీ అంశంపై సంజయ్‌ సింగ్‌ మాట్లాడారు. దీంతో ఆయన్ను అడ్డుకున్న న్యాయస్థానం.. అనవసర విషయాలపై న్యాయస్థానంలో ప్రసంగాలు ఇవ్వొద్దని స్పష్టం చేసింది.

AAP Sanjay Singh Latest News : దిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో మనీలాండరింగ్‌ ఆరోపణలకు సంబంధించి ఆప్‌ ఎంపీ సంజయ్‌ సింగ్‌ను ఎన్​ఫోర్స్​మెంట్ డైరెక్టరేట్ కస్టడీకి తీసుకుంది. ఈ క్రమంలో ఆయన్ను సుమారు ఏడు రోజుల పాటు ప్రశ్నించింది. కస్టడీ గడువు ముగిసిన నేపథ్యంలో.. ఈడీ ఆయన్ను కోర్టులో హాజరుపరిచింది. ఈ నేపథ్యంలో సంజయ్ సింగ్ మాట్లాడారు. తాను గౌతమ్ అదానీపై ఫిర్యాదు చేశానని, ఆ కోణంలో మాత్రం ఈడీ దృష్టిసారించడం లేదని వ్యాఖ్యానించారు. అదానీపై ఫిర్యాదుకు సంబంధించిన ప్రశ్నలను తనను అడగడం లేదని న్యాయస్థానం దృష్టికి తీసుకువచ్చారు.

Delhi Liquor Scam : దిల్లీ లిక్కర్ స్కామ్​లో ట్విస్ట్.. అప్రూవర్​గా మారిన శరత్‌చంద్రారెడ్డి

'ఆ స్పీచ్​లు ఇవ్వాలనుకుంటే..'
ఈ క్రమంలో ప్రత్యేక న్యాయమూర్తి ఎంకే నాగ్‌పాల్‌ జోక్యం చేసుకున్నారు. న్యాయస్థానంలో అనవసర విషయాలు ప్రస్తావించొద్దని సంజయ్ సింగ్​కు హితవు పలికారు. 'అదానీ, ఇతరుల గురించి స్పీచ్‌ ఇవ్వాలనుకుంటే.. ఇక నుంచి మిమ్మల్ని వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా హాజరు పరచాలని ఆదేశిస్తాం' అని న్యాయమూర్తి స్పష్టం చేశారు.

దిల్లీ మద్యం కేసులో మనీలాండరింగ్‌ జరిగినట్లు ఆరోపణలపై ఈడీ దర్యాప్తు చేస్తోంది. ఈ నేపథ్యంలో సంజయ్‌ సింగ్‌ను అక్టోబరు 4న ఈడీ అధికారులు అరెస్టు చేశారు. ఆ మరుసటి రోజు సంజయ్​ను.. దిల్లీలోని రౌస్‌ అవెన్యూ కోర్టులో హాజరు పరిచారు. అనంతరం కస్టడీ కోరగా.. అక్టోబరు 13 వరకు కస్టడీకి అనుమతించింది. తాజాగా ఆ గడువు ముగియడంతో జ్యుడీషియల్‌ కస్టడీని అక్టోబర్‌ 27 వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది.

Delhi Liquor Scam Case AAP MP Arrest : లిక్కర్​ స్కామ్​ కేసులో ఎంపీ సంజయ్​ అరెస్టు.. ఆప్​లో మూడో కీలక నేత..

లిక్కర్ స్కామ్ విలువ రూ.2వేల కోట్ల పైనే.. రాజకీయ నేతలు, బ్యూరోక్రాట్ల హస్తం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.