ETV Bharat / bharat

రాజీనామా చేస్తా అంటే మోదీ వద్దన్నారు: దేవెగౌడ

author img

By

Published : Dec 6, 2021, 7:03 AM IST

modi deve gowda: ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై అనేక రెట్లు గౌరవం పెరిగిందని చెప్పారు మాజీ ప్రధాని దేవె గౌడ. 2014లో భాజపా సొంత మెజారిటీతో అధికారంలోకి వస్తే రాజీనామా చేస్తానని సవాల్ చేసినట్లు గుర్తుచేసుకున్నారు. అనంతరం దానిని నిలబెట్టుకునేందుకు ముందుకు రాగా, మోదీ వద్దన్నారని వివరించారు.

modi deve gowda
నరేంద్ర మోదీ

modi deve gowda: లోక్‌సభకు రాజీనామా చేయాలన్న తన కోరికను తిరస్కరించడం వల్ల ప్రధాని నరేంద్ర మోదీపై గౌరవం ఎన్నో రెట్లు పెరిగిందన్నారు మాజీ ప్రధాని హెచ్‌డీ దేవెగౌడ. 276 సీట్లు గెలిచి భాజపా సొంతంగా అధికారంలోకి వస్తే తాను లోక్‌సభ సభ్యత్వానికి రాజీనామా చేస్తానని 2014 లోక్‌సభ ఎన్నికల సందర్భంగా మోదీకి సవాల్ విసిరినట్లు గౌడ గుర్తుచేసుకున్నారు.

"భాజపా 276 సీట్లు గెలిస్తే రాజీనామా చేస్తానని నేను చెప్పాను. ఇతరులతో పొత్తు పెట్టుకుని మీరు అధికారంలోకి రావొచ్చు. కానీ సొంతంగా 276 స్థానాలు గెలిస్తే నేను (లోక్‌సభకు) రాజీనామా చేస్తాను" అని గౌడ ఒక ప్రకటనలో అన్నారు.

అయితే ఆ ఎన్నికల్లో భాజపా ఘన విజయం సాధించి సొంతంగానే అధికారం చేపట్టడం వల్ల తన సవాల్ నిలబెట్టుకోవాలని భావించినట్లు దేవె గౌడ వెల్లడించారు. గెలిచిన తర్వాత ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరుకావాలని మోదీ స్వయంగా ఆహ్వానించారని చెప్పారు. వేడుకలు ముగిసిన తర్వాత మోదీతో వ్యక్తిగతంగా కలిసి రాజీనామా చేస్తానని అన్నట్లు గౌడ తెలిపారు.

అయితే "ఎన్నికల్లో చేసిన వ్యాఖ్యలను ఎందుకంత సీరియస్​గా తీసుకుంటున్నారు? అవసరమైనప్పుడల్లా మీతో (దేవె గౌడ) చర్చించాల్సి వస్తుంది." అని మోదీ బదులిచ్చినట్లు గౌడ వెల్లడించారు.

ఈ సంఘటన తర్వాత మోదీని ఆరేడు సార్లు కలిశానని, దీని వల్ల ఆయనపై మరింత గౌరవం పెరుగుతూ వస్తోందని గౌడ అన్నారు. గుజరాత్ ముఖ్యమంత్రి నుంచి దేశ ప్రధానమంత్రిగా ఎదిగే క్రమంలో మోదీలో చాలా మార్పు వచ్చిందని చెప్పారు. దీంతో మోదీపై తన అభిప్రాయం కూడా మారిందన్నారు.

ఇదీ చూడండి: పరువు నష్టం కేసులో మాజీ ప్రధానికి భారీ జరిమానా

modi deve gowda: లోక్‌సభకు రాజీనామా చేయాలన్న తన కోరికను తిరస్కరించడం వల్ల ప్రధాని నరేంద్ర మోదీపై గౌరవం ఎన్నో రెట్లు పెరిగిందన్నారు మాజీ ప్రధాని హెచ్‌డీ దేవెగౌడ. 276 సీట్లు గెలిచి భాజపా సొంతంగా అధికారంలోకి వస్తే తాను లోక్‌సభ సభ్యత్వానికి రాజీనామా చేస్తానని 2014 లోక్‌సభ ఎన్నికల సందర్భంగా మోదీకి సవాల్ విసిరినట్లు గౌడ గుర్తుచేసుకున్నారు.

"భాజపా 276 సీట్లు గెలిస్తే రాజీనామా చేస్తానని నేను చెప్పాను. ఇతరులతో పొత్తు పెట్టుకుని మీరు అధికారంలోకి రావొచ్చు. కానీ సొంతంగా 276 స్థానాలు గెలిస్తే నేను (లోక్‌సభకు) రాజీనామా చేస్తాను" అని గౌడ ఒక ప్రకటనలో అన్నారు.

అయితే ఆ ఎన్నికల్లో భాజపా ఘన విజయం సాధించి సొంతంగానే అధికారం చేపట్టడం వల్ల తన సవాల్ నిలబెట్టుకోవాలని భావించినట్లు దేవె గౌడ వెల్లడించారు. గెలిచిన తర్వాత ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరుకావాలని మోదీ స్వయంగా ఆహ్వానించారని చెప్పారు. వేడుకలు ముగిసిన తర్వాత మోదీతో వ్యక్తిగతంగా కలిసి రాజీనామా చేస్తానని అన్నట్లు గౌడ తెలిపారు.

అయితే "ఎన్నికల్లో చేసిన వ్యాఖ్యలను ఎందుకంత సీరియస్​గా తీసుకుంటున్నారు? అవసరమైనప్పుడల్లా మీతో (దేవె గౌడ) చర్చించాల్సి వస్తుంది." అని మోదీ బదులిచ్చినట్లు గౌడ వెల్లడించారు.

ఈ సంఘటన తర్వాత మోదీని ఆరేడు సార్లు కలిశానని, దీని వల్ల ఆయనపై మరింత గౌరవం పెరుగుతూ వస్తోందని గౌడ అన్నారు. గుజరాత్ ముఖ్యమంత్రి నుంచి దేశ ప్రధానమంత్రిగా ఎదిగే క్రమంలో మోదీలో చాలా మార్పు వచ్చిందని చెప్పారు. దీంతో మోదీపై తన అభిప్రాయం కూడా మారిందన్నారు.

ఇదీ చూడండి: పరువు నష్టం కేసులో మాజీ ప్రధానికి భారీ జరిమానా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.