ETV Bharat / bharat

'అమ్మమ్మే నా భార్య.. తల్లి నా కూతురు'.. చనిపోయి మళ్లీ పుట్టానంటున్న బాలుడు! - ఉత్తర ప్రదేశ్​లో బాలుడి పునర్జన్మ

ఓ ఎనిమిదేళ్ల బాలుడు.. తన పూర్వజన్మ గురించి చెబుతున్నాడు. తన అమ్మమ్మ గత జన్మలో తన భార్య అని, తల్లి తన కూతురని చెప్పుకొచ్చాడు. ఉత్తర్​ప్రదేశ్​లో ఈ వింత ఘటన వెలుగులోకి వచ్చింది.

reincarnation-of-eight-year-old-boy-in-uttarprdesh
పూర్వజన్మ గురించి చెబుతున్న బాలుడు
author img

By

Published : Jun 17, 2023, 6:53 PM IST

Updated : Jun 17, 2023, 9:03 PM IST

ఉత్తర్​ప్రదేశ్​లోని మైన్​పురి జిల్లాలో ఓ వింత ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ తొమ్మిదేళ్ల కుర్రాడు తన పూర్వజన్మ గురించి చెబుతున్నాడు. తన తల్లిని కూతురిగా.. అమ్మమ్మను తన భార్యగా చెప్పుకుంటున్నాడు. మేనమామలిద్దరూ గత జన్మలో తన కుమారులని పేర్కొంటున్నాడు. ఆ బాలుడి చెప్పే మాటలతో కుటుంబ సభ్యులంతా ఆశ్చర్యానికి గురవుతున్నారు.

కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం 2015 జనవరి 9న బాలుడి తాత మనోజ్ మిశ్ర చనిపోయాడు. రతన్​పుర్​లో ఉండే అతడు.. పొలంలో నీరు పారించేందుకు వెళ్లి పాముకాటుకు గురై ప్రాణాలు కోల్పోయాడు. అదే సమయంలో మనోజ్ కుమార్తె రంజన.. గర్భంతో ఉంది. మనోజ్ చనిపోయిన 20 రోజులకే ఆమె మగబిడ్డకు జన్మనిచ్చింది. ఆ బాలుడికి ఆర్యన్ అని పేరు పెట్టుకున్నారు. అయితే, ఆ బాలుడే ఇప్పుడు తన గత జన్మ గురించి చెబుతున్నాడు. రతన్​పుర్ గ్రామం గురించి ప్రస్తావిస్తున్న అతడు.. తానే మనోజ్ మిశ్ర అని అంటున్నాడు.

reincarnation-of-eight-year-old-boy-in-uttarprdesh
చనిపోయిన మనోజ్​

జూన్​ 15న​ తన అమ్మమ్మ ఇంటికి వెళ్లిన ఆర్యన్.. విచిత్రంగా ప్రవర్తించాడు. ఆమె కాళ్లను మొక్కుతూ.. గత జన్మలో 'నువ్వు నా భార్యవి' అని అమ్మమ్మతో చెప్పాడు. తన పేరును మనోజ్​గా చెప్పుకున్న ఆర్యన్​.. తల్లి రంజనను తన కూతురని వివరించాడు. మేనమామలైన అజయ్​, అనుజ్​లను తన కొడుకులని చెప్పుకొచ్చాడు. అది చూసిన ఆర్యన్ మేనమామలు.. కన్నీరు మున్నీరై విలపించారు. తన పేరు మీద బ్యాంకులో డబ్బులు కూడా ఉన్నాయని ఆర్యన్​ వెల్లడించాడు. ఈ వార్త విన్న గ్రామస్థులంతా.. ఆర్యన్ ఇంటికి పెద్ద ఎత్తున చేరుకున్నారు. అతడు చెప్పే మాటలు విని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

reincarnation-of-eight-year-old-boy-in-uttarprdesh
బాలుడు ఆర్యన్​

'గత జన్మ గుర్తొచ్చింది.. లీవ్ ఇస్తే ఆ పని చేస్తా'.. బాస్​కు సబ్​ ఇంజినీర్​ లేఖ..
కొద్ది రోజుల క్రితం కూడా.. మధ్యప్రదేశ్​కు చెందిన ఓ సబ్ ఇంజినీర్​ వింత కారణాలతో తన పైఅధికారులకు దరఖాస్తులు ఇవ్వడం చర్చనీయాంశమైంది. ప్రతి ఆదివారం 'డే ఆఫ్​' కావాలని అందులో అతడు పేర్కొనేవాడు. ఆ దరఖాస్తులో ఆయన పేర్కొన్న అంశాలను చూడగా విస్తుపోవడం వారి వంతైంది. అసలేం జరిగిందంటే..?

గత జన్మ గుర్తొచ్చి...
అగర్​ మాల్వా జిల్లాలోని సంశేర్​ జనపద్​ పంచాయతీ చీఫ్​కు.. సబ్ ఇంజినీర్ రాజ్​కుమార్ యాదవ్ ఈ లేఖ రాశారు. అందులో తనకు కొద్దిరోజుల క్రితమే గత జన్మ గురించి తెలిసిందని చెప్పారు. తన జీవిత రహస్యాన్ని కనుగొనడానికి, ఆత్మను శోధించేందుకు ఉపయోగపడేలా ప్రతి ఆదివారం తనకు 'డే ఆఫ్'​ ఇవ్వాలని కోరారు.

తాను భగవద్గీత బోధించిన మార్గాన్ని అనుసరించాలనుకుంటున్నానని రాజ్​కుమార్ తెలిపాడు. నాలో ఉన్న అహాన్ని తొలగించుకోవడానికి ప్రతి ఆదివారం భిక్షాటన చేయాలని భావించినట్లు అతడు వివరించాడు. ప్రతి ఇంటి నుంచి గోధుమలను యాచించాలనుకుంటున్నట్లు పేర్కొన్నాడు. దానికోసమే నాకు ఆదివారం డే ఆఫ్ కావాలని.. తన దరఖాస్తులో అని రాజ్​కుమార్ యాదవ్​ తెలిపాడు. పూర్తి కథనం కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

ఉత్తర్​ప్రదేశ్​లోని మైన్​పురి జిల్లాలో ఓ వింత ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ తొమ్మిదేళ్ల కుర్రాడు తన పూర్వజన్మ గురించి చెబుతున్నాడు. తన తల్లిని కూతురిగా.. అమ్మమ్మను తన భార్యగా చెప్పుకుంటున్నాడు. మేనమామలిద్దరూ గత జన్మలో తన కుమారులని పేర్కొంటున్నాడు. ఆ బాలుడి చెప్పే మాటలతో కుటుంబ సభ్యులంతా ఆశ్చర్యానికి గురవుతున్నారు.

కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం 2015 జనవరి 9న బాలుడి తాత మనోజ్ మిశ్ర చనిపోయాడు. రతన్​పుర్​లో ఉండే అతడు.. పొలంలో నీరు పారించేందుకు వెళ్లి పాముకాటుకు గురై ప్రాణాలు కోల్పోయాడు. అదే సమయంలో మనోజ్ కుమార్తె రంజన.. గర్భంతో ఉంది. మనోజ్ చనిపోయిన 20 రోజులకే ఆమె మగబిడ్డకు జన్మనిచ్చింది. ఆ బాలుడికి ఆర్యన్ అని పేరు పెట్టుకున్నారు. అయితే, ఆ బాలుడే ఇప్పుడు తన గత జన్మ గురించి చెబుతున్నాడు. రతన్​పుర్ గ్రామం గురించి ప్రస్తావిస్తున్న అతడు.. తానే మనోజ్ మిశ్ర అని అంటున్నాడు.

reincarnation-of-eight-year-old-boy-in-uttarprdesh
చనిపోయిన మనోజ్​

జూన్​ 15న​ తన అమ్మమ్మ ఇంటికి వెళ్లిన ఆర్యన్.. విచిత్రంగా ప్రవర్తించాడు. ఆమె కాళ్లను మొక్కుతూ.. గత జన్మలో 'నువ్వు నా భార్యవి' అని అమ్మమ్మతో చెప్పాడు. తన పేరును మనోజ్​గా చెప్పుకున్న ఆర్యన్​.. తల్లి రంజనను తన కూతురని వివరించాడు. మేనమామలైన అజయ్​, అనుజ్​లను తన కొడుకులని చెప్పుకొచ్చాడు. అది చూసిన ఆర్యన్ మేనమామలు.. కన్నీరు మున్నీరై విలపించారు. తన పేరు మీద బ్యాంకులో డబ్బులు కూడా ఉన్నాయని ఆర్యన్​ వెల్లడించాడు. ఈ వార్త విన్న గ్రామస్థులంతా.. ఆర్యన్ ఇంటికి పెద్ద ఎత్తున చేరుకున్నారు. అతడు చెప్పే మాటలు విని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

reincarnation-of-eight-year-old-boy-in-uttarprdesh
బాలుడు ఆర్యన్​

'గత జన్మ గుర్తొచ్చింది.. లీవ్ ఇస్తే ఆ పని చేస్తా'.. బాస్​కు సబ్​ ఇంజినీర్​ లేఖ..
కొద్ది రోజుల క్రితం కూడా.. మధ్యప్రదేశ్​కు చెందిన ఓ సబ్ ఇంజినీర్​ వింత కారణాలతో తన పైఅధికారులకు దరఖాస్తులు ఇవ్వడం చర్చనీయాంశమైంది. ప్రతి ఆదివారం 'డే ఆఫ్​' కావాలని అందులో అతడు పేర్కొనేవాడు. ఆ దరఖాస్తులో ఆయన పేర్కొన్న అంశాలను చూడగా విస్తుపోవడం వారి వంతైంది. అసలేం జరిగిందంటే..?

గత జన్మ గుర్తొచ్చి...
అగర్​ మాల్వా జిల్లాలోని సంశేర్​ జనపద్​ పంచాయతీ చీఫ్​కు.. సబ్ ఇంజినీర్ రాజ్​కుమార్ యాదవ్ ఈ లేఖ రాశారు. అందులో తనకు కొద్దిరోజుల క్రితమే గత జన్మ గురించి తెలిసిందని చెప్పారు. తన జీవిత రహస్యాన్ని కనుగొనడానికి, ఆత్మను శోధించేందుకు ఉపయోగపడేలా ప్రతి ఆదివారం తనకు 'డే ఆఫ్'​ ఇవ్వాలని కోరారు.

తాను భగవద్గీత బోధించిన మార్గాన్ని అనుసరించాలనుకుంటున్నానని రాజ్​కుమార్ తెలిపాడు. నాలో ఉన్న అహాన్ని తొలగించుకోవడానికి ప్రతి ఆదివారం భిక్షాటన చేయాలని భావించినట్లు అతడు వివరించాడు. ప్రతి ఇంటి నుంచి గోధుమలను యాచించాలనుకుంటున్నట్లు పేర్కొన్నాడు. దానికోసమే నాకు ఆదివారం డే ఆఫ్ కావాలని.. తన దరఖాస్తులో అని రాజ్​కుమార్ యాదవ్​ తెలిపాడు. పూర్తి కథనం కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

Last Updated : Jun 17, 2023, 9:03 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.