ETV Bharat / bharat

రజనీ వెనకున్న ఆ 'రాజకీయ శక్తులు' ఎవరు?

author img

By

Published : Dec 6, 2020, 5:04 PM IST

అర్జునమూర్తి, తమిళరువి మణియన్​కు తాను పెట్టబోయే పార్టీలో కీలక బాధ్యతలను అప్పగించారు సూపర్​స్టార్​ రజనీకాంత్​. దీంతో వీరి పేర్లు చర్చనీయాంశంగా మారాయి. ఇంతకీ అర్జునమూర్తి, మణియన్​ ఎవరు? వారి ప్రస్థానం ఏంటి? రజనీతో వారికున్న సంబంధమేంటి?

Rajinikanth's political entry - Background of Rajini's pillars Arjun Moorthy, Tamilruvi Maniyan
రజనీ వెనకున్న ఆ 'రాజకీయ శక్తులు' ఎవరు?

తమిళ ప్రజల నిరీక్షణకు తెరదించుతూ తాను రాజకీయ రంగ ప్రవేశం చేయనున్నట్టు ఇటీవలే ప్రకటించారు సూపర్​స్టార్​ రజనీకాంత్​. పార్టీకి సంబంధించిన వివరాలను ఈ నెల 31న ప్రకటిస్తానని స్పష్టం చేశారు. అయితే తన పార్టీ పర్యవేక్షకుడిగా తమిళరువి మణియన్​, పార్టీ సమన్వయకర్తగా అర్జునమూర్తిని నియమించారు రజనీ. ఇంతకీ వీరిద్దరు ఎవరు? పార్టీలోని కీలక బాధ్యతలను రజనీ వీరికి ఎందుకు అప్పగించారు?

అర్జునమూర్తి...

  • స్వాతంత్ర్య సమరయోధుడు ఎల్​పీ రామసామి కుమారుడు అర్జునమూర్తి.
  • 59ఏళ్ల అర్జునమూర్తి.. దేశంలో పేరున్న పారిశ్రామికవేత్త. వాణిజ్యం, టెలికమ్యూనికేషన్​, వాణిజ్యం వంటి రంగాలపై ఈయనకు అద్భుతమైన పట్టు ఉంది.
  • జీనీ, సాఫ్ట్​కామ్​ ప్రైవేట్​ లిమిటెడ్​, ఎన్​ఎఫ్​సీ టెక్నాలజీ సంస్థలను అర్జునమూర్తి స్థాపించారు.

రాజకీయ ప్రస్థానం:-

  • డీఎమ్​కే సీనియర్​ నేత, దివంగత మురసొలి మారన్​కు రాజకీయ సలహాదారుగా తన ప్రస్థానాన్ని ప్రారంభించారు అర్జునమూర్తి. డీఎమ్​కే నేత దయానిధి మారన్​కు కూడా పనిచేశారు.
  • అదే సమయంలో ఆర్​ఎస్​ఎస్​ సిద్ధాంతాలపై మక్కువతో భాజపాతోనూ అనుబంధం ఏర్పరచుకున్నారు. అనంతర ఎన్నికల్లో భాజపాకు మేనిఫెస్టోను రూపొందించారు. ఆయన కృషికి భాజపా పెద్దల నుంచి ప్రశంసలు లభించాయి.
  • అనేక మార్లు భాజపాకు మద్దతుగా నిలిచిన రజనీకాంత్​.. అనూహ్యంగా అర్జునమూర్తిని పార్టీ సమన్వయకర్తగా నియమించారు.
    Rajinikanth's political entry - Background of Rajini's pillars Arjun Moorthy, Tamilruvi Maniyan
    అర్జునమూర్తితో రజనీ

ఇదీ చూడండి:- తలైవా.. తమిళ రాజకీయాలను మార్చేస్తారా?

తమిళరువి మణియన్​...

  • మణియన్​.. తమిళనాడులో ప్రముఖ రచయిత, ప్రజా వక్త, గాంధేయవాది. హిస్టరీ టీచర్​గా చూలైలో కొన్నేళ్లు పనిచేశారు. న్యాయవాదిగా కొన్నేళ్లు ప్రాక్టీస్​ చేసి స్వచ్ఛంద పదవీవిరమణ తీసుకున్నారు.
  • నాటి ముఖ్యమంత్రి, కాంగ్రెస్​ కీలక నేత కామరాజ్​ నాయకత్వంతో స్ఫూర్తిపొంది 1966లో కాంగ్రెస్​ సభ్యత్వం తీసుకున్నారు మణియన్​. కామరాజ్ మరణం అనంతరం 1975లో జనతా పార్టీలో చేరారు.
  • 23ఏళ్ల తర్వాత.. 2002లో తిరిగి కాంగ్రెస్​లో చేరారు మణియన్​. తొలుత తమిళనాడు కాంగ్రెస్​ కమిటీకి ప్రధాన కార్యదర్శిగా విధులు నిర్వర్తించారు. అనంతరం 2006లో ప్రణాళికా సంఘంలో సభ్యుడయ్యారు.
  • 2017లో తొలిసారి రజనీకాంత్​ను కలిశారు మణియన్​. కొద్ది కాలంలోనే వీరిరువురి మధ్య బంధం బలపడింది.
    Rajinikanth's political entry - Background of Rajini's pillars Arjun Moorthy, Tamilruvi Maniyan
    అర్జునమూర్తి, తమిళరువి మణియన్​తో రజనీ

ఇదీ చూడండి:-

తమిళ ప్రజల నిరీక్షణకు తెరదించుతూ తాను రాజకీయ రంగ ప్రవేశం చేయనున్నట్టు ఇటీవలే ప్రకటించారు సూపర్​స్టార్​ రజనీకాంత్​. పార్టీకి సంబంధించిన వివరాలను ఈ నెల 31న ప్రకటిస్తానని స్పష్టం చేశారు. అయితే తన పార్టీ పర్యవేక్షకుడిగా తమిళరువి మణియన్​, పార్టీ సమన్వయకర్తగా అర్జునమూర్తిని నియమించారు రజనీ. ఇంతకీ వీరిద్దరు ఎవరు? పార్టీలోని కీలక బాధ్యతలను రజనీ వీరికి ఎందుకు అప్పగించారు?

అర్జునమూర్తి...

  • స్వాతంత్ర్య సమరయోధుడు ఎల్​పీ రామసామి కుమారుడు అర్జునమూర్తి.
  • 59ఏళ్ల అర్జునమూర్తి.. దేశంలో పేరున్న పారిశ్రామికవేత్త. వాణిజ్యం, టెలికమ్యూనికేషన్​, వాణిజ్యం వంటి రంగాలపై ఈయనకు అద్భుతమైన పట్టు ఉంది.
  • జీనీ, సాఫ్ట్​కామ్​ ప్రైవేట్​ లిమిటెడ్​, ఎన్​ఎఫ్​సీ టెక్నాలజీ సంస్థలను అర్జునమూర్తి స్థాపించారు.

రాజకీయ ప్రస్థానం:-

  • డీఎమ్​కే సీనియర్​ నేత, దివంగత మురసొలి మారన్​కు రాజకీయ సలహాదారుగా తన ప్రస్థానాన్ని ప్రారంభించారు అర్జునమూర్తి. డీఎమ్​కే నేత దయానిధి మారన్​కు కూడా పనిచేశారు.
  • అదే సమయంలో ఆర్​ఎస్​ఎస్​ సిద్ధాంతాలపై మక్కువతో భాజపాతోనూ అనుబంధం ఏర్పరచుకున్నారు. అనంతర ఎన్నికల్లో భాజపాకు మేనిఫెస్టోను రూపొందించారు. ఆయన కృషికి భాజపా పెద్దల నుంచి ప్రశంసలు లభించాయి.
  • అనేక మార్లు భాజపాకు మద్దతుగా నిలిచిన రజనీకాంత్​.. అనూహ్యంగా అర్జునమూర్తిని పార్టీ సమన్వయకర్తగా నియమించారు.
    Rajinikanth's political entry - Background of Rajini's pillars Arjun Moorthy, Tamilruvi Maniyan
    అర్జునమూర్తితో రజనీ

ఇదీ చూడండి:- తలైవా.. తమిళ రాజకీయాలను మార్చేస్తారా?

తమిళరువి మణియన్​...

  • మణియన్​.. తమిళనాడులో ప్రముఖ రచయిత, ప్రజా వక్త, గాంధేయవాది. హిస్టరీ టీచర్​గా చూలైలో కొన్నేళ్లు పనిచేశారు. న్యాయవాదిగా కొన్నేళ్లు ప్రాక్టీస్​ చేసి స్వచ్ఛంద పదవీవిరమణ తీసుకున్నారు.
  • నాటి ముఖ్యమంత్రి, కాంగ్రెస్​ కీలక నేత కామరాజ్​ నాయకత్వంతో స్ఫూర్తిపొంది 1966లో కాంగ్రెస్​ సభ్యత్వం తీసుకున్నారు మణియన్​. కామరాజ్ మరణం అనంతరం 1975లో జనతా పార్టీలో చేరారు.
  • 23ఏళ్ల తర్వాత.. 2002లో తిరిగి కాంగ్రెస్​లో చేరారు మణియన్​. తొలుత తమిళనాడు కాంగ్రెస్​ కమిటీకి ప్రధాన కార్యదర్శిగా విధులు నిర్వర్తించారు. అనంతరం 2006లో ప్రణాళికా సంఘంలో సభ్యుడయ్యారు.
  • 2017లో తొలిసారి రజనీకాంత్​ను కలిశారు మణియన్​. కొద్ది కాలంలోనే వీరిరువురి మధ్య బంధం బలపడింది.
    Rajinikanth's political entry - Background of Rajini's pillars Arjun Moorthy, Tamilruvi Maniyan
    అర్జునమూర్తి, తమిళరువి మణియన్​తో రజనీ

ఇదీ చూడండి:-

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.