త్వరలో బంగాల్లో ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు ఊపందుకున్నాయి. ఇటీవల తృణమూల్ పార్టీకి రాజీనామ చేసిన ఆ రాష్ట్ర మాజీ అటవీ శాఖ మంత్రి రాజివ్ బెనర్జీ భాజపాలో చేరారు.
దిల్లీలో కేంద్ర హోం మంత్రి అమిత్షా ఇంట్లో సమావేశమైన అనంతరం భాజపా జెండా కప్పుకున్నారు. ఆయనతో పాటు బాలి ఎమ్మెల్యే బైశాలి దాల్మియా, ఉత్తర్ పారా ఎమ్మెల్యే ప్రభిర్ ఘోషల్, మాజీ మంత్రి పార్థసారథి ఛటర్జీ, మాజీ హౌరా మేయర్ రతిన్ చక్రవర్తి, బంగాలీ నటుడు రుద్రనిల్ ఘోష్లు సైతం భాజపాలో చేరారు. దీంతో రాజీవ్ ఏ పార్టీలో చేరతారన్న ఊహాగానాలకు తెరపడింది.
ఇదీ చదవండి : దీదీకి మరో షాక్- పార్టీకి ఎమ్మెల్యే గుడ్బై