ETV Bharat / bharat

మర్రివనం సృష్టించి.. ప్రపంచ రికార్డు కొల్లగొట్టి..

author img

By

Published : Aug 9, 2021, 7:43 PM IST

Updated : Aug 9, 2021, 11:02 PM IST

అతిపెద్ద మర్రివనాన్ని సృష్టించి ప్రపంచ రికార్డును సొంతం చేసుకున్నారు రాజస్థాన్​ మహిళలు. మాండా భోప్​వాస్​ గ్రామంలో 500 మొక్కలను వారు నాటారు.

banyan garden
మర్రిమొక్కలు నాటిన మహిళలు

మాండా భోప్​వాస్​ గ్రామంలో మర్రి మొక్కలు నాటుతున్న మహిళలు

రాజస్థాన్ జైపుర్​ మహిళలు అరుదైన ఘనత సాధించారు. ఒకే ప్రాంతంలో భారీ సంఖ్యలో మర్రి మొక్కలు నాటి ప్రపంచ రికార్డును కైవసం చేసుకున్నారు. మహవీర్​ ఇంటర్నేషనల్ పింక్​ సిటీ స్వచ్ఛంద సంస్థ, మాండా భోప్​వాస్​ గ్రామ పంచాయతీ సంయుక్తంగా ఈ మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించాయి. ఆగస్టు 8న మాండా భోప్​వాస్​ గ్రామంలో మొక్కలను నాటారు మహిళలు .

banyan garden
మర్రి మొక్కలు నాటడంలో నిమగ్నమైన మహిళలు
women in banyan plantataion
మర్రి మొక్కలు నాటుతున్న దృశ్యాలు

500 మంది మహిళలతో..

ఈ కార్యక్రమంలో 500 మంది మహిళలు పాలుపంచుకున్నారు. 16 బీఘాల ప్రాంతంలో వీరు మొక్కలను నాటారు. ప్రపంచంలోనే అతి పెద్దదైన మర్రివనం ఇదే కావడం వల్ల.. 'గోల్డెన్​ బుక్​ ఆఫ్​ వరల్డ్ రికార్డ్స్​'లో వీరికి స్థానం దక్కింది. మొత్తం 2,100 మొక్కలను వారు నాటగా.. అందులో మర్రి మొక్కలు సంఖ్య 500గా ఉంది. ఈ ప్రపంచ రికార్డుతో వారంతా ఎంతో మురిసిపోతున్నారు.

women in banyan plantataion
మర్రి మొక్కలు నాటుతున్న దృశ్యాలు
manda bhopawas village
మొక్కలు నాటుతున్న మహిళలు
golden book of world records
గోల్డెన్​ బుక్​ ఆఫ్​ రికార్డ్స్​ ధ్రువపత్రం

పచ్చదనాన్ని పెంపొందించాలనే లక్ష్యంతో తాము ఈ కార్యక్రమాన్ని చేపట్టామని నిర్వాహకులు తెలిపారు.

ఇదీ చూడండి: 'శివుడే మా సీఎం- కరోనాతో మాకు భయమేంటి?'

ఇదీ చూడండి: సినీ హీరో ఔదార్యం- ఐదు ప్రాణాలు సేఫ్

మాండా భోప్​వాస్​ గ్రామంలో మర్రి మొక్కలు నాటుతున్న మహిళలు

రాజస్థాన్ జైపుర్​ మహిళలు అరుదైన ఘనత సాధించారు. ఒకే ప్రాంతంలో భారీ సంఖ్యలో మర్రి మొక్కలు నాటి ప్రపంచ రికార్డును కైవసం చేసుకున్నారు. మహవీర్​ ఇంటర్నేషనల్ పింక్​ సిటీ స్వచ్ఛంద సంస్థ, మాండా భోప్​వాస్​ గ్రామ పంచాయతీ సంయుక్తంగా ఈ మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించాయి. ఆగస్టు 8న మాండా భోప్​వాస్​ గ్రామంలో మొక్కలను నాటారు మహిళలు .

banyan garden
మర్రి మొక్కలు నాటడంలో నిమగ్నమైన మహిళలు
women in banyan plantataion
మర్రి మొక్కలు నాటుతున్న దృశ్యాలు

500 మంది మహిళలతో..

ఈ కార్యక్రమంలో 500 మంది మహిళలు పాలుపంచుకున్నారు. 16 బీఘాల ప్రాంతంలో వీరు మొక్కలను నాటారు. ప్రపంచంలోనే అతి పెద్దదైన మర్రివనం ఇదే కావడం వల్ల.. 'గోల్డెన్​ బుక్​ ఆఫ్​ వరల్డ్ రికార్డ్స్​'లో వీరికి స్థానం దక్కింది. మొత్తం 2,100 మొక్కలను వారు నాటగా.. అందులో మర్రి మొక్కలు సంఖ్య 500గా ఉంది. ఈ ప్రపంచ రికార్డుతో వారంతా ఎంతో మురిసిపోతున్నారు.

women in banyan plantataion
మర్రి మొక్కలు నాటుతున్న దృశ్యాలు
manda bhopawas village
మొక్కలు నాటుతున్న మహిళలు
golden book of world records
గోల్డెన్​ బుక్​ ఆఫ్​ రికార్డ్స్​ ధ్రువపత్రం

పచ్చదనాన్ని పెంపొందించాలనే లక్ష్యంతో తాము ఈ కార్యక్రమాన్ని చేపట్టామని నిర్వాహకులు తెలిపారు.

ఇదీ చూడండి: 'శివుడే మా సీఎం- కరోనాతో మాకు భయమేంటి?'

ఇదీ చూడండి: సినీ హీరో ఔదార్యం- ఐదు ప్రాణాలు సేఫ్

Last Updated : Aug 9, 2021, 11:02 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.