ETV Bharat / bharat

స్టాలిన్​ సర్కారులో రాజన్​కు కీలక బాధ్యతలు

author img

By

Published : Jun 21, 2021, 2:30 PM IST

తమిళనాడు సర్కారులో ఆర్​బీఐ​ మాజీ గవర్నర్​ రఘురామ్​ రాజన్​కు కీలక బాధ్యతలు అప్పగించారు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్​. ఆయనతో పాటు.. అమెరికాకు చెందిన నోబెల్ గ్రహీత ఎస్తేర్ డుఫ్లో కూడా రాష్ట్ర ఆర్థిక కమిటీలో భాగం కానున్నారు.

Raghuram Rajan, stalin
స్టాలిన్​ ఆర్థిక సలహామండలి

తమిళనాట కొత్తగా ఏర్పాటైన స్టాలిన్​ ప్రభుత్వంలో ఆర్​బీఐ మాజీ గవర్నర్​ రఘురామ్​ రాజన్​ కీలక బాధ్యతలు నిర్వర్తించనున్నారు. రాష్ట్ర ఆర్థిక మండలిలో ఆయనతో పాటు అమెరికా.. మసాచుసెట్స్ ఇన్​స్టిట్యూట్​ ఆఫ్ టెక్నాలజీ (ఎంఐటీ)కి చెందిన నోబెల్ గ్రహీత ఎస్తేర్ డుఫ్లోకు స్థానం కల్పించింది స్టాలిన్​ సర్కార్​. ముఖ్యమంత్రి ఆర్థిక సలహా మండలిలో భాగంగా ఉంటారని ఆ రాష్ట్ర గవర్నర్ బన్వారిలాల్ పురోహిత్ సోమవారం వెల్లడించారు.

రాష్ట్ర శాసనసభను ఉద్దేశించి గవర్నర్ బన్వారిలాల్​ పురోహిత్​ మట్లాడారు. ఈ క్రమంలో రాష్ట్రం ఆర్థికాభివృద్ధి దిశగా అడుగులు వేసేందుకు ఓ కమిటిని నియమించినట్లు పేర్కొన్నారు. అమెరికాకు చెందిన ఎస్తేర్ డుఫ్లో, ఆర్​బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్, కేంద్ర ప్రభుత్వ మాజీ ముఖ్య ఆర్థిక సలహాదారు డాక్టర్ అరవింద్ సుబ్రమణియన్, అభివృద్ధి ఆర్థికవేత్త జీన్ డ్రేజ్, మాజీ కేంద్ర ఆర్థిక కార్యదర్శి డాక్టర్ ఎస్ నారాయణ్​లు ఈ కమిటీలో ఉండనున్నట్లు తెలిపారు.

రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను పునరుజ్జీవింపజేసేలా, ఆర్థిక వృద్ధి సమాజంలోని అన్ని వర్గాల వారికి అందేలా ఈ కమిటీ చేస్తుందని పురోహిత్​ ఆశాభావం వ్యక్తం చేశారు. శాసన మండలి సిఫార్సు మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు.

ఇదీ చూడండి: 'ఎన్నికల వల్లే ఈ స్థాయికి ఎదిగారా?'

తమిళనాట కొత్తగా ఏర్పాటైన స్టాలిన్​ ప్రభుత్వంలో ఆర్​బీఐ మాజీ గవర్నర్​ రఘురామ్​ రాజన్​ కీలక బాధ్యతలు నిర్వర్తించనున్నారు. రాష్ట్ర ఆర్థిక మండలిలో ఆయనతో పాటు అమెరికా.. మసాచుసెట్స్ ఇన్​స్టిట్యూట్​ ఆఫ్ టెక్నాలజీ (ఎంఐటీ)కి చెందిన నోబెల్ గ్రహీత ఎస్తేర్ డుఫ్లోకు స్థానం కల్పించింది స్టాలిన్​ సర్కార్​. ముఖ్యమంత్రి ఆర్థిక సలహా మండలిలో భాగంగా ఉంటారని ఆ రాష్ట్ర గవర్నర్ బన్వారిలాల్ పురోహిత్ సోమవారం వెల్లడించారు.

రాష్ట్ర శాసనసభను ఉద్దేశించి గవర్నర్ బన్వారిలాల్​ పురోహిత్​ మట్లాడారు. ఈ క్రమంలో రాష్ట్రం ఆర్థికాభివృద్ధి దిశగా అడుగులు వేసేందుకు ఓ కమిటిని నియమించినట్లు పేర్కొన్నారు. అమెరికాకు చెందిన ఎస్తేర్ డుఫ్లో, ఆర్​బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్, కేంద్ర ప్రభుత్వ మాజీ ముఖ్య ఆర్థిక సలహాదారు డాక్టర్ అరవింద్ సుబ్రమణియన్, అభివృద్ధి ఆర్థికవేత్త జీన్ డ్రేజ్, మాజీ కేంద్ర ఆర్థిక కార్యదర్శి డాక్టర్ ఎస్ నారాయణ్​లు ఈ కమిటీలో ఉండనున్నట్లు తెలిపారు.

రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను పునరుజ్జీవింపజేసేలా, ఆర్థిక వృద్ధి సమాజంలోని అన్ని వర్గాల వారికి అందేలా ఈ కమిటీ చేస్తుందని పురోహిత్​ ఆశాభావం వ్యక్తం చేశారు. శాసన మండలి సిఫార్సు మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు.

ఇదీ చూడండి: 'ఎన్నికల వల్లే ఈ స్థాయికి ఎదిగారా?'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.