ETV Bharat / bharat

'రైతులతో చర్చకు కేంద్రం ఎప్పుడూ సిద్ధమే'

author img

By

Published : Nov 27, 2020, 11:37 AM IST

Updated : Nov 27, 2020, 5:27 PM IST

CHALO DELHI
ఛలో దిల్లీ

17:25 November 27

  • Haryana: Police remove barricades at Shambhu border between Haryana and Punjab, near Ambala as farmers have been allowed to enter Delhi.

    "Nobody will be stopped, commuters can travel with ease," says Rajesh Kalia, Ambala SP pic.twitter.com/hMzbNutkxz

    — ANI (@ANI) November 27, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

బ్యారికేడ్లను తొలగించిన పోలీసులు..

దిల్లీ వెళ్లేందుకు రైతులకు అనుమతి లభించడంతో.. హరియాణా- పంజాబ్​ సరిహద్దులోని శంబూ ప్రాంతం వద్ద బారికేడ్లను తొలగించారు పోలీసులు. ఎవరినీ అడ్డుకోమని, రైతులు వెళ్లవచ్చని అంబాలా ఎస్పీ రాజేశ్​ కలియా స్పష్టం చేశారు. 

16:37 November 27

  • केंद्र सरकार बातचीत के लिए हमेशा तैयार है।

    मेरी सभी किसान भाइयों से अपील है कि अपने सभी जायज मुद्दों के लिए केंद्र से सीधे बातचीत करें। आन्दोलन इसका जरिया नहीं है- इसका हल बातचीत से ही निकलेगा

    — Manohar Lal (@mlkhattar) November 27, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

కేంద్రం సిద్ధమే..

రైతులతో చర్చకు కేంద్ర ప్రభుత్వం ఎప్పుడూ సిద్ధమేనని అన్నారు హరియాణా ముఖ్యమంత్రి మనోహల్​లాల్​ ఖట్టర్​. రైతులు తమ సమస్యల పరిష్కారానికి నేరుగా ప్రభుత్వంతోనే సంప్రదింపులు జరపాలని ట్విట్టర్​ వేదికగా విజ్ఞప్తి చేశారు. 

16:15 November 27

'రైతుల పోరాటాన్ని ఎవరూ అడ్డుకోలేరు'

వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేస్తున్న నిరసనలకు మద్దతు తెలిపారు కాంగ్రెస్​ నేత రాహుల్​ గాంధీ. ఈ నేపథ్యంలో మోదీ సర్కార్​పై విరుచుకుపడ్డారు. 

సత్యం కోసం రైతులు చేస్తున్న పోరాటాన్ని ప్రపంచంలో ఏ ప్రభుత్వమూ అడ్డుకోలేదని ట్వీట్​ చేశారు. వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకోవాలని డిమాండ్​ చేశారు. 

15:35 November 27

దిల్లీలోకి ప్రవేశించిన రైతులు..

పోలీసుల అనుమతితో రైతులు దిల్లీలోకి ప్రవేశించారు. టిక్రీ సరిహద్దు గుండా నిరంకారీ సమగం మైదానానికి చేరుకుంటున్నారు. 

14:48 November 27

స్వాగతించిన పంజాబ్​ సీఎం..

రైతులను దిల్లీలోకి అనుమతిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతించారు పంజాబ్​ ముఖ్యమంత్రి అమరీందర్​ సింగ్​. రైతులకు శాంతియుతంగా నిరసన చేసుకునే స్వేచ్ఛ ఉందని పునరుద్ఘాటించారు. కేంద్రం ఇప్పటికైనా రైతు సమస్యలపై, వ్యవసాయ చట్టాలపై వారితో మాట్లాడాలని కోరారు. సమస్యకు పరిష్కారం చూపించాలని స్పష్టం చేశారు. 

14:42 November 27

దిల్లీకి అనుమతి..

దేశ రాజధానికి ర్యాలీగా బయల్దేరిన పంజాబ్​, హరియాణాకు చెందిన రైతులను దిల్లీలోకి వచ్చేందుకు పోలీసులు అనుమతించారు. బురారీ ప్రాంతంలోని నిరంకారీ సమాగం మైదానంలో రైతులు నిరసన చేసుకోవచ్చని స్పష్టం చేశారు.

అయితే.. రైతులు తమ నిరసనలను శాంతియుతంగా కొనసాగించాలని పిలుపునిచ్చారు దిల్లీ పోలీస్​ కమిషనర్​. 

13:52 November 27

రైతులను జైళ్లకు పంపలేం..

స్టేడియాలను జైళ్లుగా వాడుకుంటామన్న దిల్లీ పోలీసుల అభ్యర్థనను కేజ్రీవాల్​ ప్రభుత్వం తిరస్కరించింది. రైతులను జైళ్లకు పంపేందుకు తాము సిద్ధంగా లేమని తేల్చిచెప్పింది. ఈ మేరకు దిల్లీ హోంమంత్రి సత్యేంద్రజైన్ అధికారిక ప్రకటన విడుదల చేశారు.

12:49 November 27

శంబు సరిహద్దులో ఉద్రిక్తత..

అంబాలా సమీపంలోని శంబు సరిహద్దులో రైతులను చెదరగొట్టేందుకు జల ఫిరంగులు, బాష్పవాయువును ప్రయోగించారు పోలీసులు.  

12:45 November 27

  • Meerut: A groom, along with his wedding party, seen walking on road due to road blockade amidst ongoing farmers' protest .

    Police have placed barricades on roads to stop the farmers heading towards Delhi, as part of their protest march against Centre's Farm Laws. pic.twitter.com/nMr1FKg0cf

    — ANI UP (@ANINewsUP) November 27, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

కాలినడకన వరుడు..

రైతుల ఆందోళన కారణంగా దిల్లీ సరిహద్దుల్లో వాహనాల రాకపోకలను నిలిపేశారు. ఈ నేపథ్యంలో మేరఠ్​లో వరుడు సహా ఓ పెళ్లి బృందం కాలి నడకన వెళుతూ కనిపించింది.

12:38 November 27

కేంద్రానికి సీఎం విజ్ఞప్తి..

రైతు సంఘాలతో కేంద్రం చర్చలు జరపాలని పంజాబ్ సీఎం కెప్టెన్​ అమరీందర్ సింగ్ కోరారు. దిల్లీ సరిహద్దుల్లో ఉద్రిక్తతలకు తెరదించాలని సూచించారు.  

12:07 November 27

  • Farmers from Punjab wait at the Shambhu border between Haryana and Punjab, near Ambala, to cross into Haryana to proceed to Delhi to protest against Farm laws

    Security deployed, barriers and water cannon vehicle placed at the border to prevent farmers from entering Haryana pic.twitter.com/LexWymMvoJ

    — ANI (@ANI) November 27, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

అంబాలాలో ఎదురెదురుగా..

శంబు సరిహద్దులో పోలీసులు భారీగా మోహరించారు. పంజాబ్​ నుంచి రైతులను హరియాణాలోకి ప్రవేశించకుండా బారికేడ్లను ఏర్పాటు చేశారు. వాటర్ కెనాన్లను సిద్ధంగా ఉంచారు. ఈ నేపథ్యంలో సరిహద్దులోనే గురువారం నుంచి రైతులు ఎదురుచూస్తున్నారు.  

11:56 November 27

  • Punjab: Protesting farmers jump barricades in Sirsa, say they're going to Delhi for their rights.

    "Whatever we do will be peaceful. We won't harm any person or property. Even if we have to stay for a month, we will. Even if we have attain martyrdom, we will," says a farmer. pic.twitter.com/rGHBzFWHpY

    — ANI (@ANI) November 27, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

బారికేడ్లను దాటి..

సిర్సాలో బారికేడ్లను తోసుకుని రైతులు దిల్లీ వైపు సాగుతున్నారు. ఆందోళనలను శాంతియుతంగానే నిర్వహిస్తామని, అవసరమైతే అక్కడే నెలరోజులైనా ఎదురుచూస్తామని ఓ రైతు తెలిపాడు. 

11:45 November 27

భారీగా ట్రాఫిక్ జామ్​..

యమునా ఎక్స్​ప్రెస్​ వేపై రైతులు రాస్తారోకో నిర్వహించారు. రహదారిపై భారీగా వాహనాలు నిలిచిపోయాయి.  

11:38 November 27

ట్రాక్టర్​తో లారీ తొలగింపు..

టిక్రీ సరిహద్దుకు భారీ సంఖ్యలో రైతులు తరలిరాగా.. దిల్లీకి వెళ్లే మార్గాన్ని లారీతో బ్లాక్ చేశారు. ఆగ్రహించిన రైతులు.. ట్రాక్టర్​ సాయంతో లారీని తొలగించారు. 

11:17 November 27

పోలీసులు- రైతుల మధ్య ఘర్షణ

  • #WATCH Delhi: Police use water cannon & tear gas shells to disperse protesting farmers at Tikri border near Delhi-Bahadurgarh highway.

    Farmers are seen clashing with security forces, as they tried to head towards Delhi as part of their protest march against Centre's Farm laws. pic.twitter.com/L67PN4xYKy

    — ANI (@ANI) November 27, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

కేంద్ర ప్రభుత్వం తెచ్చిన సాగు చట్టాలకు వ్యతిరేకంగా పంజాబ్‌-హరియాణా రైతులు చేపట్టిన 'ఛలో దిల్లీ' కార్యక్రమంలో మరోసారి ఉద్రిక్తత చోటుచేసుకుంది. దిల్లీ వైపు సాగుతున్న రైతులను సింఘు వద్ద పోలీసులు అడ్డుకున్నారు.  

రైతులు దిల్లీలోకి వెళ్లకుండా సాయుధ పోలీసులు నిలువరించేందుకు యత్నించగా.. ఇరు వర్గాల మధ్య ఘర్షణ నెలకొంది. రైతులను చెదరగొట్టేందుకు పోలీసులు బాష్పవాయువు ప్రయోగించారు.  

  • దిల్లీ-బహదుర్‌గఢ్‌ రహదారికి సమీపంలో టిక్రీ బోర్డర్‌ వద్ద ఆందోళన వ్యక్తం చేస్తున్న రైతులను చెదరగొట్టేందుకు పోలీసులు వాటర్‌ కెనాన్లు, టియర్‌ గ్యాస్‌ ప్రయోగించారు.  
  • పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో కిసాన్‌ మజ్దూర్‌ సంఘర్ష్‌ కమిటీ సభ్యులు నెలకు సరిపడా నిత్యవసర వస్తువులను ట్రాక్టర్‌లో నింపుకొని దిల్లీకి బయలుదేరారు.  
  • ఛలో దిల్లీ కార్యక్రమానికి వస్తున్న రైతులను పానిపత్ సమీపంలో జాతీయ రహదారి టోల్‌ప్లాజా వద్ద పోలీసులు నిలిపివేశారు.

జైళ్లుగా మైదానాలు..!

రైతుల మార్చ్​ నేపథ్యంలో నగరంలోని పది స్టేడియాలను జైళ్లుగా వాడుకునేందుకు అనుమతించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని దిల్లీ పోలీసులు కోరినట్లు తెలుస్తోంది.  

17:25 November 27

  • Haryana: Police remove barricades at Shambhu border between Haryana and Punjab, near Ambala as farmers have been allowed to enter Delhi.

    "Nobody will be stopped, commuters can travel with ease," says Rajesh Kalia, Ambala SP pic.twitter.com/hMzbNutkxz

    — ANI (@ANI) November 27, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

బ్యారికేడ్లను తొలగించిన పోలీసులు..

దిల్లీ వెళ్లేందుకు రైతులకు అనుమతి లభించడంతో.. హరియాణా- పంజాబ్​ సరిహద్దులోని శంబూ ప్రాంతం వద్ద బారికేడ్లను తొలగించారు పోలీసులు. ఎవరినీ అడ్డుకోమని, రైతులు వెళ్లవచ్చని అంబాలా ఎస్పీ రాజేశ్​ కలియా స్పష్టం చేశారు. 

16:37 November 27

  • केंद्र सरकार बातचीत के लिए हमेशा तैयार है।

    मेरी सभी किसान भाइयों से अपील है कि अपने सभी जायज मुद्दों के लिए केंद्र से सीधे बातचीत करें। आन्दोलन इसका जरिया नहीं है- इसका हल बातचीत से ही निकलेगा

    — Manohar Lal (@mlkhattar) November 27, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

కేంద్రం సిద్ధమే..

రైతులతో చర్చకు కేంద్ర ప్రభుత్వం ఎప్పుడూ సిద్ధమేనని అన్నారు హరియాణా ముఖ్యమంత్రి మనోహల్​లాల్​ ఖట్టర్​. రైతులు తమ సమస్యల పరిష్కారానికి నేరుగా ప్రభుత్వంతోనే సంప్రదింపులు జరపాలని ట్విట్టర్​ వేదికగా విజ్ఞప్తి చేశారు. 

16:15 November 27

'రైతుల పోరాటాన్ని ఎవరూ అడ్డుకోలేరు'

వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేస్తున్న నిరసనలకు మద్దతు తెలిపారు కాంగ్రెస్​ నేత రాహుల్​ గాంధీ. ఈ నేపథ్యంలో మోదీ సర్కార్​పై విరుచుకుపడ్డారు. 

సత్యం కోసం రైతులు చేస్తున్న పోరాటాన్ని ప్రపంచంలో ఏ ప్రభుత్వమూ అడ్డుకోలేదని ట్వీట్​ చేశారు. వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకోవాలని డిమాండ్​ చేశారు. 

15:35 November 27

దిల్లీలోకి ప్రవేశించిన రైతులు..

పోలీసుల అనుమతితో రైతులు దిల్లీలోకి ప్రవేశించారు. టిక్రీ సరిహద్దు గుండా నిరంకారీ సమగం మైదానానికి చేరుకుంటున్నారు. 

14:48 November 27

స్వాగతించిన పంజాబ్​ సీఎం..

రైతులను దిల్లీలోకి అనుమతిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతించారు పంజాబ్​ ముఖ్యమంత్రి అమరీందర్​ సింగ్​. రైతులకు శాంతియుతంగా నిరసన చేసుకునే స్వేచ్ఛ ఉందని పునరుద్ఘాటించారు. కేంద్రం ఇప్పటికైనా రైతు సమస్యలపై, వ్యవసాయ చట్టాలపై వారితో మాట్లాడాలని కోరారు. సమస్యకు పరిష్కారం చూపించాలని స్పష్టం చేశారు. 

14:42 November 27

దిల్లీకి అనుమతి..

దేశ రాజధానికి ర్యాలీగా బయల్దేరిన పంజాబ్​, హరియాణాకు చెందిన రైతులను దిల్లీలోకి వచ్చేందుకు పోలీసులు అనుమతించారు. బురారీ ప్రాంతంలోని నిరంకారీ సమాగం మైదానంలో రైతులు నిరసన చేసుకోవచ్చని స్పష్టం చేశారు.

అయితే.. రైతులు తమ నిరసనలను శాంతియుతంగా కొనసాగించాలని పిలుపునిచ్చారు దిల్లీ పోలీస్​ కమిషనర్​. 

13:52 November 27

రైతులను జైళ్లకు పంపలేం..

స్టేడియాలను జైళ్లుగా వాడుకుంటామన్న దిల్లీ పోలీసుల అభ్యర్థనను కేజ్రీవాల్​ ప్రభుత్వం తిరస్కరించింది. రైతులను జైళ్లకు పంపేందుకు తాము సిద్ధంగా లేమని తేల్చిచెప్పింది. ఈ మేరకు దిల్లీ హోంమంత్రి సత్యేంద్రజైన్ అధికారిక ప్రకటన విడుదల చేశారు.

12:49 November 27

శంబు సరిహద్దులో ఉద్రిక్తత..

అంబాలా సమీపంలోని శంబు సరిహద్దులో రైతులను చెదరగొట్టేందుకు జల ఫిరంగులు, బాష్పవాయువును ప్రయోగించారు పోలీసులు.  

12:45 November 27

  • Meerut: A groom, along with his wedding party, seen walking on road due to road blockade amidst ongoing farmers' protest .

    Police have placed barricades on roads to stop the farmers heading towards Delhi, as part of their protest march against Centre's Farm Laws. pic.twitter.com/nMr1FKg0cf

    — ANI UP (@ANINewsUP) November 27, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

కాలినడకన వరుడు..

రైతుల ఆందోళన కారణంగా దిల్లీ సరిహద్దుల్లో వాహనాల రాకపోకలను నిలిపేశారు. ఈ నేపథ్యంలో మేరఠ్​లో వరుడు సహా ఓ పెళ్లి బృందం కాలి నడకన వెళుతూ కనిపించింది.

12:38 November 27

కేంద్రానికి సీఎం విజ్ఞప్తి..

రైతు సంఘాలతో కేంద్రం చర్చలు జరపాలని పంజాబ్ సీఎం కెప్టెన్​ అమరీందర్ సింగ్ కోరారు. దిల్లీ సరిహద్దుల్లో ఉద్రిక్తతలకు తెరదించాలని సూచించారు.  

12:07 November 27

  • Farmers from Punjab wait at the Shambhu border between Haryana and Punjab, near Ambala, to cross into Haryana to proceed to Delhi to protest against Farm laws

    Security deployed, barriers and water cannon vehicle placed at the border to prevent farmers from entering Haryana pic.twitter.com/LexWymMvoJ

    — ANI (@ANI) November 27, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

అంబాలాలో ఎదురెదురుగా..

శంబు సరిహద్దులో పోలీసులు భారీగా మోహరించారు. పంజాబ్​ నుంచి రైతులను హరియాణాలోకి ప్రవేశించకుండా బారికేడ్లను ఏర్పాటు చేశారు. వాటర్ కెనాన్లను సిద్ధంగా ఉంచారు. ఈ నేపథ్యంలో సరిహద్దులోనే గురువారం నుంచి రైతులు ఎదురుచూస్తున్నారు.  

11:56 November 27

  • Punjab: Protesting farmers jump barricades in Sirsa, say they're going to Delhi for their rights.

    "Whatever we do will be peaceful. We won't harm any person or property. Even if we have to stay for a month, we will. Even if we have attain martyrdom, we will," says a farmer. pic.twitter.com/rGHBzFWHpY

    — ANI (@ANI) November 27, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

బారికేడ్లను దాటి..

సిర్సాలో బారికేడ్లను తోసుకుని రైతులు దిల్లీ వైపు సాగుతున్నారు. ఆందోళనలను శాంతియుతంగానే నిర్వహిస్తామని, అవసరమైతే అక్కడే నెలరోజులైనా ఎదురుచూస్తామని ఓ రైతు తెలిపాడు. 

11:45 November 27

భారీగా ట్రాఫిక్ జామ్​..

యమునా ఎక్స్​ప్రెస్​ వేపై రైతులు రాస్తారోకో నిర్వహించారు. రహదారిపై భారీగా వాహనాలు నిలిచిపోయాయి.  

11:38 November 27

ట్రాక్టర్​తో లారీ తొలగింపు..

టిక్రీ సరిహద్దుకు భారీ సంఖ్యలో రైతులు తరలిరాగా.. దిల్లీకి వెళ్లే మార్గాన్ని లారీతో బ్లాక్ చేశారు. ఆగ్రహించిన రైతులు.. ట్రాక్టర్​ సాయంతో లారీని తొలగించారు. 

11:17 November 27

పోలీసులు- రైతుల మధ్య ఘర్షణ

  • #WATCH Delhi: Police use water cannon & tear gas shells to disperse protesting farmers at Tikri border near Delhi-Bahadurgarh highway.

    Farmers are seen clashing with security forces, as they tried to head towards Delhi as part of their protest march against Centre's Farm laws. pic.twitter.com/L67PN4xYKy

    — ANI (@ANI) November 27, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

కేంద్ర ప్రభుత్వం తెచ్చిన సాగు చట్టాలకు వ్యతిరేకంగా పంజాబ్‌-హరియాణా రైతులు చేపట్టిన 'ఛలో దిల్లీ' కార్యక్రమంలో మరోసారి ఉద్రిక్తత చోటుచేసుకుంది. దిల్లీ వైపు సాగుతున్న రైతులను సింఘు వద్ద పోలీసులు అడ్డుకున్నారు.  

రైతులు దిల్లీలోకి వెళ్లకుండా సాయుధ పోలీసులు నిలువరించేందుకు యత్నించగా.. ఇరు వర్గాల మధ్య ఘర్షణ నెలకొంది. రైతులను చెదరగొట్టేందుకు పోలీసులు బాష్పవాయువు ప్రయోగించారు.  

  • దిల్లీ-బహదుర్‌గఢ్‌ రహదారికి సమీపంలో టిక్రీ బోర్డర్‌ వద్ద ఆందోళన వ్యక్తం చేస్తున్న రైతులను చెదరగొట్టేందుకు పోలీసులు వాటర్‌ కెనాన్లు, టియర్‌ గ్యాస్‌ ప్రయోగించారు.  
  • పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో కిసాన్‌ మజ్దూర్‌ సంఘర్ష్‌ కమిటీ సభ్యులు నెలకు సరిపడా నిత్యవసర వస్తువులను ట్రాక్టర్‌లో నింపుకొని దిల్లీకి బయలుదేరారు.  
  • ఛలో దిల్లీ కార్యక్రమానికి వస్తున్న రైతులను పానిపత్ సమీపంలో జాతీయ రహదారి టోల్‌ప్లాజా వద్ద పోలీసులు నిలిపివేశారు.

జైళ్లుగా మైదానాలు..!

రైతుల మార్చ్​ నేపథ్యంలో నగరంలోని పది స్టేడియాలను జైళ్లుగా వాడుకునేందుకు అనుమతించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని దిల్లీ పోలీసులు కోరినట్లు తెలుస్తోంది.  

Last Updated : Nov 27, 2020, 5:27 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.