ETV Bharat / bharat

కేంద్రంపై రైతులు 'కిసాన్​ మహా పంచాయత్​' అస్త్రం

రానున్న రోజుల్లో దేశవ్యాప్తంగా 'కిసాన్ మహా పంచాయత్' కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు సంయుక్త కిసాన్ మోర్చా రైతు సంఘం నేతలు ప్రకటించారు. పలు ప్రాంతాల్లో ఈ కార్యక్రమం నిర్వహణపై ఇప్పటికే ప్రణాళికలు రచించినట్టు తెలిపారు.

author img

By

Published : Feb 12, 2021, 5:16 AM IST

kisan mahapanchayats across country in coming days
'దేశవ్యాప్తంగా 'కిసాన్ మహా పంచాయత్​'లు నిర్వహిస్తాం'

సాగు చట్టాలకు వ్యతిరేకంగా.. రానున్న రోజుల్లో దేశవ్యాప్తంగా 'కిసాన్ మహా పంచాయత్' కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు 'సంయుక్త కిసాన్ మోర్చా' రైతు సంఘం ప్రకటించింది. రాష్ట్రాల వారీగా మహా పంచాయత్​ల నిర్వహణకు ప్రణాళికలు రచిస్తున్నట్లు వెల్లడించింది.

ఈ క్రమంలో.. సాగు చట్టాల రద్దు, కనీస మద్దతు ధరపై స్పష్టత వచ్చే వరకు ఉద్యమం కొనసాగిస్తామని మరోమారు స్పష్టం చేసింది సంయుక్త కిసాన్​ మోర్చా.

ఈ నెల 18న.. దేశవ్యాప్తంగా నాలుగు గంటల పాటు 'రైల్​ రోకో' నిర్వహించనున్నట్లు కిసాన్​ మోర్చా తెలిపిన ఒక్కరోజు అనంతరం ఈ ప్రకటన వెలువడింది.

"పలు ప్రాంతాల్లో మహా పంచాయత్ కార్యక్రమాలు నిర్వహించనున్నాం. శుక్రవారం ఉత్తర్​ప్రదేశ్​ మోదాబాద్​లో, ఫిబ్రవరి 13న హరియాణాలోని బహదుర్గాలో, ఫిబ్రవరి 18,19,23 తేదీల్లో రాజస్థాన్​లోని శ్రీ గంగానగర్, హనుమాన్​నగర్​, సిల్కార్​ ప్రాంతాల్లో కార్యక్రమాలు చేపడతాం."

-దర్శన్ పాల్, రైతు సంఘం నాయకుడు.

ఈ నేపథ్యంలో.. హరియాణా ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేశారు దర్శన్​ పాల్​. రైతులు ఉద్యమం చేస్తోన్న టిక్రి సరిహద్దుల్లో ప్రభుత్వం సీసీటీవీలు ఏర్పాటు చేసేందుకు యోచిస్తోందన్నారు. రైతుల డిమాండ్లపై ప్రభుత్వం ఉదాసీనత చూపుతోందని మండిపడ్డారు.

ఇదీ చదవండి:'మేకులను తొలగించిన తర్వాతే దిల్లీని వీడతాం'

సాగు చట్టాలకు వ్యతిరేకంగా.. రానున్న రోజుల్లో దేశవ్యాప్తంగా 'కిసాన్ మహా పంచాయత్' కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు 'సంయుక్త కిసాన్ మోర్చా' రైతు సంఘం ప్రకటించింది. రాష్ట్రాల వారీగా మహా పంచాయత్​ల నిర్వహణకు ప్రణాళికలు రచిస్తున్నట్లు వెల్లడించింది.

ఈ క్రమంలో.. సాగు చట్టాల రద్దు, కనీస మద్దతు ధరపై స్పష్టత వచ్చే వరకు ఉద్యమం కొనసాగిస్తామని మరోమారు స్పష్టం చేసింది సంయుక్త కిసాన్​ మోర్చా.

ఈ నెల 18న.. దేశవ్యాప్తంగా నాలుగు గంటల పాటు 'రైల్​ రోకో' నిర్వహించనున్నట్లు కిసాన్​ మోర్చా తెలిపిన ఒక్కరోజు అనంతరం ఈ ప్రకటన వెలువడింది.

"పలు ప్రాంతాల్లో మహా పంచాయత్ కార్యక్రమాలు నిర్వహించనున్నాం. శుక్రవారం ఉత్తర్​ప్రదేశ్​ మోదాబాద్​లో, ఫిబ్రవరి 13న హరియాణాలోని బహదుర్గాలో, ఫిబ్రవరి 18,19,23 తేదీల్లో రాజస్థాన్​లోని శ్రీ గంగానగర్, హనుమాన్​నగర్​, సిల్కార్​ ప్రాంతాల్లో కార్యక్రమాలు చేపడతాం."

-దర్శన్ పాల్, రైతు సంఘం నాయకుడు.

ఈ నేపథ్యంలో.. హరియాణా ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేశారు దర్శన్​ పాల్​. రైతులు ఉద్యమం చేస్తోన్న టిక్రి సరిహద్దుల్లో ప్రభుత్వం సీసీటీవీలు ఏర్పాటు చేసేందుకు యోచిస్తోందన్నారు. రైతుల డిమాండ్లపై ప్రభుత్వం ఉదాసీనత చూపుతోందని మండిపడ్డారు.

ఇదీ చదవండి:'మేకులను తొలగించిన తర్వాతే దిల్లీని వీడతాం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.