ETV Bharat / bharat

విషాదంలో ఉన్న 'సైకిల్​ గర్ల్​'కు ప్రియాంక అండ

author img

By

Published : Jun 4, 2021, 3:52 PM IST

'సైకిల్​ గర్ల్' జ్యోతి కుమారి తండ్రి మృతి పట్ల కాంగ్రెస్​ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ సంతాపం తెలిపారు. జ్యోతి చదువుకయ్యే ఖర్చులు భరించటం సహా ఆమె కుటుంబానికి అన్ని రకాలుగా సహాయం చేస్తానని హామీ ఇచ్చారు. ఈమేరకు జ్యోతితో ఆమె ఫోన్​లో మాట్లాడారు.

priyanka help to cycle girl
సైకిల్​ గర్ల్​కు ప్రియాంక గాంధీ ఫోన్​!

'సైకిల్​ గర్ల్'​ జ్యోతి కుమారితో కాంగ్రెస్​ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ ఫోన్​లో మాట్లాడారు. జ్యోతి తండ్రి మృతి పట్ల ఆమె ప్రగాఢ సానుభూతి తెలిపారు. గతేడాది లాక్​డౌన్​ వేళ తన తండ్రిని సైకిల్​పై ఎక్కించుకుని 1300 కి.మీ ప్రయాణించి 'సైకిల్​ గర్ల్​'గా జ్యోతి కుమారి గుర్తింపు పొందింది. అయితే.. గుండెపోటు కారణంగా ఆమె తండ్రి ఇటీవల మృతి చెందాడు.

Cycle Girl
ప్రియాంక గాంధీతో ఫోన్​లో మాట్లాడుతున్న జ్యోతి

జ్యోతి చదువుకయ్యే ఖర్చులు భరించటం సహా ఆమె కుటుంబానికి అన్ని విధాలుగా సహాయం చేస్తానని ప్రియాంక గాంధీ హామీ ఇచ్చారు. తాను వ్యక్తిగతంగా ప్రియాంక గాంధీని కలవాలనుకుంటున్నాన్న జ్యోతి వినతికి ఆమె సానుకూలంగా స్పందించారు.

ప్రియాంక తరఫున కాంగ్రెస్​ నేత మష్కూర్​ అహ్మద్​ ఉస్మానీ.. జ్యోతి ఇంటికి వెళ్లి పరామర్శించారు. ప్రియాంక స్వయంగా రాసిన ఓ లేఖను అందజేశారు.

Cycle Girl
'సైకిల్​ గర్ల్​' జ్యోతి కుమారికి ప్రియాంక ఫోన్​
Cycle Girl
గతేడాది తండ్రిని ఎక్కించుకొని సైకిల్​ నడిపిన జ్యోతి

పాత సైకిల్​ కొని..

హరియాణా దర్భంగలోని సిర్హుల్లి గ్రామానికి చెందిన జ్యోతి కుమారి తండ్రి మోహన్ పాసవాన్.. గుర్​గ్రామ్​​లో​ ఆటో డ్రైవర్​గా పనిచేసేవాడు. జనవరిలో జరిగిన రోడ్డు ప్రమాదం​ వల్ల అతని మోకాలికి బలమైన గాయం అయింది. అదే సమయంలో లాక్​డౌన్​ ప్రకటించడం వల్ల గుర్​గ్రామ్​లో చిక్కుకున్నాడు. తండ్రితో సహా సొంత గ్రామానికి చేరుకోవాలని నిశ్చయించుకున్న జ్యోతి.. పాత సైకిల్​ కొని దాంతో గ్రామానికి చేరుకుంది.

జ్యోతి సాహసానికి గాను ప్రధాన మంత్రి రాష్ట్రీయ బాల్​ పురస్కార్​-2021 ఆమెను వరించింది. వర్చువల్​గా జరిగిన ఈ బహుమతి ప్రదానోత్సవంలో.. జ్యోతి ధైర్యాన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రశంసించారు. బిహార్ ప్రభుత్వం ఆమెను డ్రగ్​ డీఆడిక్షన్​ ప్రచార కార్యక్రమానికి బ్రాండ్​ అంబాసిడర్​గా నియమించింది.

ఇవీ చూడండి :

'సైకిల్​ గర్ల్'​ జ్యోతి కుమారితో కాంగ్రెస్​ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ ఫోన్​లో మాట్లాడారు. జ్యోతి తండ్రి మృతి పట్ల ఆమె ప్రగాఢ సానుభూతి తెలిపారు. గతేడాది లాక్​డౌన్​ వేళ తన తండ్రిని సైకిల్​పై ఎక్కించుకుని 1300 కి.మీ ప్రయాణించి 'సైకిల్​ గర్ల్​'గా జ్యోతి కుమారి గుర్తింపు పొందింది. అయితే.. గుండెపోటు కారణంగా ఆమె తండ్రి ఇటీవల మృతి చెందాడు.

Cycle Girl
ప్రియాంక గాంధీతో ఫోన్​లో మాట్లాడుతున్న జ్యోతి

జ్యోతి చదువుకయ్యే ఖర్చులు భరించటం సహా ఆమె కుటుంబానికి అన్ని విధాలుగా సహాయం చేస్తానని ప్రియాంక గాంధీ హామీ ఇచ్చారు. తాను వ్యక్తిగతంగా ప్రియాంక గాంధీని కలవాలనుకుంటున్నాన్న జ్యోతి వినతికి ఆమె సానుకూలంగా స్పందించారు.

ప్రియాంక తరఫున కాంగ్రెస్​ నేత మష్కూర్​ అహ్మద్​ ఉస్మానీ.. జ్యోతి ఇంటికి వెళ్లి పరామర్శించారు. ప్రియాంక స్వయంగా రాసిన ఓ లేఖను అందజేశారు.

Cycle Girl
'సైకిల్​ గర్ల్​' జ్యోతి కుమారికి ప్రియాంక ఫోన్​
Cycle Girl
గతేడాది తండ్రిని ఎక్కించుకొని సైకిల్​ నడిపిన జ్యోతి

పాత సైకిల్​ కొని..

హరియాణా దర్భంగలోని సిర్హుల్లి గ్రామానికి చెందిన జ్యోతి కుమారి తండ్రి మోహన్ పాసవాన్.. గుర్​గ్రామ్​​లో​ ఆటో డ్రైవర్​గా పనిచేసేవాడు. జనవరిలో జరిగిన రోడ్డు ప్రమాదం​ వల్ల అతని మోకాలికి బలమైన గాయం అయింది. అదే సమయంలో లాక్​డౌన్​ ప్రకటించడం వల్ల గుర్​గ్రామ్​లో చిక్కుకున్నాడు. తండ్రితో సహా సొంత గ్రామానికి చేరుకోవాలని నిశ్చయించుకున్న జ్యోతి.. పాత సైకిల్​ కొని దాంతో గ్రామానికి చేరుకుంది.

జ్యోతి సాహసానికి గాను ప్రధాన మంత్రి రాష్ట్రీయ బాల్​ పురస్కార్​-2021 ఆమెను వరించింది. వర్చువల్​గా జరిగిన ఈ బహుమతి ప్రదానోత్సవంలో.. జ్యోతి ధైర్యాన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రశంసించారు. బిహార్ ప్రభుత్వం ఆమెను డ్రగ్​ డీఆడిక్షన్​ ప్రచార కార్యక్రమానికి బ్రాండ్​ అంబాసిడర్​గా నియమించింది.

ఇవీ చూడండి :

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.