ETV Bharat / bharat

'బ్యాంకుల ప్రైవేటీకరణతో ఆర్థిక భద్రతకు ముప్పు'

author img

By

Published : Mar 16, 2021, 3:20 PM IST

పెద్ద వ్యాపార సంస్థలకే ప్రైవేటు బ్యాంకులు మేలు చేస్తాయి తప్ప పేదల గురించి ఆలోచించవని లోక్​సభలో కాంగ్రెస్​ ఎంపీ రవ్​నీత్​ సింగ్​ తెలిపారు. బ్యాంకులను ప్రైవేటీకరిస్తే ఆర్థిక భద్రత ప్రశ్నార్థకమవుతుందని హెచ్చరించారు.

Privatisation of PSU banks will compromise financial security: Cong MP in LS
'పీఎస్​యూలను ప్రైవేటీకరిస్తే ఆర్థిక భద్రత లేనట్టే'

ప్రభుత్వ రంగ బ్యాంకులను ప్రైవేటీకరిస్తే ఆర్థిక భద్రతపై ప్రతికూల ప్రభావం పడుతుందని కాంగ్రెస్​ ఎంపీ రవ్​నీత్​ సింగ్​ ఆందోళన వ్యక్తం చేశారు. పెద్ద వ్యాపార సంస్థలకు లాభం చేకూర్చేందుకే ప్రైవేటు బ్యాంకులు చూస్తాయి తప్ప పేదల గురించి ఆలోచించవని లోక్​సభలో అన్నారు.

" 9 ప్రభుత్వ రంగ బ్యాంకులకు చెందిన 10 లక్షల మంది ఉద్యోగులు.. ప్రైవేటీకరణకు నిరసనగా సమ్మె చేస్తున్నారు. ప్రభుత్వం వారితో చర్చలు జరపాలి. పేదలకు బ్యాంకు సేవలను అందించే లక్ష్యంతో బ్యాంకులను అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ జాతీయకరణ చేశారు. 2008 ప్రపంచ ఆర్థిక సంక్షోభ సమయంలో ఆదుకున్నవి ప్రభుత్వ రంగ బ్యాంకులే. వాటిని ప్రైవేటీకరిస్తే బ్యాంకుల ఆర్థిక భద్రత విషయంలో రాజీ పడాల్సి వస్తుంది. ఇది పది లక్షల మంది బ్యాంకు ఉద్యోగుల సమస్య మాత్రమే కాదు. దేశ ప్రజలందరి సమస్య."

-రవ్​నీత్ సింగ్​​, పార్లమెంట్​ సభ్యుడు.

కేంద్రం ప్రతిపాదించిన ప్రభుత్వరంగ బ్యాంకుల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా.. మార్చి 16 నుంచి రెండు రోజుల పాటు బ్యాంక్‌ సంఘాల సమాఖ్య దేశవ్యాప్త సమ్మె చేపడుతోంది.

ఇదీ చూడండి:లోక్​సభలో కాంగ్రెస్​ పక్ష నేతగా రవ్​నీత్ సింగ్

ప్రభుత్వ రంగ బ్యాంకులను ప్రైవేటీకరిస్తే ఆర్థిక భద్రతపై ప్రతికూల ప్రభావం పడుతుందని కాంగ్రెస్​ ఎంపీ రవ్​నీత్​ సింగ్​ ఆందోళన వ్యక్తం చేశారు. పెద్ద వ్యాపార సంస్థలకు లాభం చేకూర్చేందుకే ప్రైవేటు బ్యాంకులు చూస్తాయి తప్ప పేదల గురించి ఆలోచించవని లోక్​సభలో అన్నారు.

" 9 ప్రభుత్వ రంగ బ్యాంకులకు చెందిన 10 లక్షల మంది ఉద్యోగులు.. ప్రైవేటీకరణకు నిరసనగా సమ్మె చేస్తున్నారు. ప్రభుత్వం వారితో చర్చలు జరపాలి. పేదలకు బ్యాంకు సేవలను అందించే లక్ష్యంతో బ్యాంకులను అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ జాతీయకరణ చేశారు. 2008 ప్రపంచ ఆర్థిక సంక్షోభ సమయంలో ఆదుకున్నవి ప్రభుత్వ రంగ బ్యాంకులే. వాటిని ప్రైవేటీకరిస్తే బ్యాంకుల ఆర్థిక భద్రత విషయంలో రాజీ పడాల్సి వస్తుంది. ఇది పది లక్షల మంది బ్యాంకు ఉద్యోగుల సమస్య మాత్రమే కాదు. దేశ ప్రజలందరి సమస్య."

-రవ్​నీత్ సింగ్​​, పార్లమెంట్​ సభ్యుడు.

కేంద్రం ప్రతిపాదించిన ప్రభుత్వరంగ బ్యాంకుల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా.. మార్చి 16 నుంచి రెండు రోజుల పాటు బ్యాంక్‌ సంఘాల సమాఖ్య దేశవ్యాప్త సమ్మె చేపడుతోంది.

ఇదీ చూడండి:లోక్​సభలో కాంగ్రెస్​ పక్ష నేతగా రవ్​నీత్ సింగ్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.